అన్వేషించండి

Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం

Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పేలి లారీ ఢీకొట్టింది. కారు పెట్రోల్ ట్యాంక్ పేలి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.

Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. కంభం నుంచి మార్కాపురం వైపు వెళుతున్న కారు టైరు పేలి లారీని ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో పెట్రోల్ ట్యాంక్ కు మంటలంటుకుని కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు.

ముగ్గురు మిత్రులు 

ఈ ప్రమాదంలో మృతులు భాకరాపేట గ్రామానికి చెందిన ఇమ్రాన్, బాలాజీ, తేజగా పోలీసులు గుర్తించారు. ఇమ్రాన్ అనే యువకుడు గుంటూరులోని ఓ ప్రైవేట్ టెలికాం డిపార్ట్​మెంట్ ​కు చెందిన బొలెరో వాహనానికి డ్రైవర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్, అతని స్నేహితులు బాలాజీ, తేజ ముగ్గురు కలిసి మార్కాపురం జాతీయ రహదారిపై కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ముగ్గురూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

అసలేం జరిగింది 

తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన తేజ(29) , ఇమ్రాన్‌(21), బాలాజీ (21), కారులో కంభం నుంచి మార్కాపురం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో చేపల లోడుతో ఓ కంటెయినర్‌ మార్కాపురం నుంచి కంభం వైపు వస్తుంది. తిప్పాయిపాలెం దాటిన తర్వాత కారు టైరు ఒకసారిగా పేలింది. దీంతో అదుపుతట్టిన కారు ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొంది. ఈ కంటెయినర్ కారును దాదాపు 40 మీటర్లు  ఈడ్చుకుపోయింది. దీంతో కారు పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు మంటలు అంటుకుని అందులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కంభం ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమై అందులో ఉన్న వ్యక్తుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా దహనమయ్యాయి. లారీ, కారు రెండూ వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని సీఐ ఆంజనేయరెడ్డి తెలిపారు. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. వాహన యజమాని చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం అదినవారిపల్లికి చెందిన ఈటిమరుపు నరేంద్రగా పోలీసులు గుర్తించారు. ఆయన వాహనంలో లేరని తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
Vizag News: బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు, సింహాచలంలో నిలిపివేసిన రైల్వే సిబ్బంది
బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు, సింహాచలంలో నిలిపివేసిన రైల్వే సిబ్బంది
BSNL 5G Testing: ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Embed widget