అన్వేషించండి

Nandyal News: బాలిక ఆచూకీపై వీడని సస్పెన్స్ - పూటకో మాట చెబుతున్న నిందితులు, కొనసాగుతోన్న గాలింపు

Andhrapradesh News: నంద్యాల జిల్లాలోని మచ్చుమర్రిలో బాలికపై హత్యాచారం ఘటనలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. 4 రోజులుగా మృతదేహం కోసం గాలిస్తున్నా ఆచూకీ లభ్యం కాలేదు.

Girl Deadbody Not Found In Machumarri: నంద్యాల (Nandyal) జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమర్రిలో బాలికపై అత్యాచార ఘటనలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. గత 4 రోజులుగా మైనర్ మృతదేహం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా గుర్తించలేకపోయారు. ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే, బాలికపై దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, వారు పూటకో మాట చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కాలువలో పడేశామని నిందితులు చెప్పగా.. పోలీసులు మత్స్యకారులు, గత ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఎంత జల్లెడ పట్టినా ఫలితం లేకపోవడంతో నిందితులను మరోసారి రహస్య ప్రదేశంలో విచారించారు. రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని శ్మశానంలో పడేశామని చెప్పగా.. మచ్చుమర్రితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని శ్మశాన వాటికల్లోనూ గాలింపు చేపట్టారు. తాజాగా, బాలిక మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశామని చెప్పగా.. ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్నారు. మైనర్ బాలురుతో సహా వారి తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. 

డీఐజీ స్థాయి అధికారి కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ఇప్పటివరకూ బాలిక మృతదేహం లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ మృతదేహాన్నైనా తమకు అప్పగించాలని కన్నీటితో వేడుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. బాలికపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆదివారం గ్రామంలో వీఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలిక మృతదేహం త్వరగా కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ జరిగింది

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం మచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి గత ఆదివారం వీధుల్లో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు బాలికను ఆడుకుందామని మాయమాటలు చెప్పి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. వీరి అఘాయిత్యాన్ని భరించలేక బాలిక మృతి చెందగా భయంతో మృతదేహాన్ని ఎత్తిపోతల ప్రాజెక్ట్ దగ్గర కాలువలో పడేశారు. బాలిక ఆచూకీ తెలియక ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. వారు డాగ్ స్క్వాడ్ బృందాలతో పాప కోసం గాలించారు. ఘటనా స్థలంలో ఆధారాలతో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలికపై అత్యాచారం చేసి చంపేశామని నిందితులు పోలీసు విచారణలో అంగీకరించగా.. వారు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. కాలువలో తీవ్రంగా గాలించినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. ఇప్పుడు కృష్ణా నదిలో సైతం గాలింపు చేపడుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. 

మరో ఘటన..

అటు, ఈ ఘటన మరువక ముందే విజయనగరం జిల్లాలో మరో దారుణం జరిగింది. ఊయలలో ఉన్న 6 నెలల పసికందుపై తాత వరుసయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రామభద్రాపురం మండలంలో ఈ ఘోరం జరిగింది. చిన్నారిపై దారుణాన్ని గుర్తించిన తల్లి, గ్రామస్థులు నిందితున్ని పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం జరగ్గా తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Crime News: ఏపీలో ఘోరం - ఊయలలో ఉన్న 6 నెలల పసికందుపై అత్యాచారం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget