అన్వేషించండి

Nandyal News: బాలిక ఆచూకీపై వీడని సస్పెన్స్ - పూటకో మాట చెబుతున్న నిందితులు, కొనసాగుతోన్న గాలింపు

Andhrapradesh News: నంద్యాల జిల్లాలోని మచ్చుమర్రిలో బాలికపై హత్యాచారం ఘటనలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. 4 రోజులుగా మృతదేహం కోసం గాలిస్తున్నా ఆచూకీ లభ్యం కాలేదు.

Girl Deadbody Not Found In Machumarri: నంద్యాల (Nandyal) జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమర్రిలో బాలికపై అత్యాచార ఘటనలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. గత 4 రోజులుగా మైనర్ మృతదేహం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా గుర్తించలేకపోయారు. ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే, బాలికపై దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, వారు పూటకో మాట చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కాలువలో పడేశామని నిందితులు చెప్పగా.. పోలీసులు మత్స్యకారులు, గత ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఎంత జల్లెడ పట్టినా ఫలితం లేకపోవడంతో నిందితులను మరోసారి రహస్య ప్రదేశంలో విచారించారు. రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని శ్మశానంలో పడేశామని చెప్పగా.. మచ్చుమర్రితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని శ్మశాన వాటికల్లోనూ గాలింపు చేపట్టారు. తాజాగా, బాలిక మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశామని చెప్పగా.. ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్నారు. మైనర్ బాలురుతో సహా వారి తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. 

డీఐజీ స్థాయి అధికారి కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ఇప్పటివరకూ బాలిక మృతదేహం లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ మృతదేహాన్నైనా తమకు అప్పగించాలని కన్నీటితో వేడుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. బాలికపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆదివారం గ్రామంలో వీఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలిక మృతదేహం త్వరగా కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ జరిగింది

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం మచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి గత ఆదివారం వీధుల్లో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు బాలికను ఆడుకుందామని మాయమాటలు చెప్పి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. వీరి అఘాయిత్యాన్ని భరించలేక బాలిక మృతి చెందగా భయంతో మృతదేహాన్ని ఎత్తిపోతల ప్రాజెక్ట్ దగ్గర కాలువలో పడేశారు. బాలిక ఆచూకీ తెలియక ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. వారు డాగ్ స్క్వాడ్ బృందాలతో పాప కోసం గాలించారు. ఘటనా స్థలంలో ఆధారాలతో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలికపై అత్యాచారం చేసి చంపేశామని నిందితులు పోలీసు విచారణలో అంగీకరించగా.. వారు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. కాలువలో తీవ్రంగా గాలించినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. ఇప్పుడు కృష్ణా నదిలో సైతం గాలింపు చేపడుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. 

మరో ఘటన..

అటు, ఈ ఘటన మరువక ముందే విజయనగరం జిల్లాలో మరో దారుణం జరిగింది. ఊయలలో ఉన్న 6 నెలల పసికందుపై తాత వరుసయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రామభద్రాపురం మండలంలో ఈ ఘోరం జరిగింది. చిన్నారిపై దారుణాన్ని గుర్తించిన తల్లి, గ్రామస్థులు నిందితున్ని పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం జరగ్గా తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Crime News: ఏపీలో ఘోరం - ఊయలలో ఉన్న 6 నెలల పసికందుపై అత్యాచారం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget