అన్వేషించండి

Crime News: మందుపాతర పేల్చిన మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి

Telangana Crime News | మావోయిస్టులు మందు పాతర పేల్చడంతో, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. కూంబింగ్ చేపట్టిన గ్రౌహౌండ్స్ పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బ్లాస్ట్ చేశారు.

Blast In Mulugu District | వాజేడు: పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ లో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయినట్లు సమాచారం. బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటపురం ఎడ్మిల్లి కొండలపై కూంబింగ్ కు వెళ్లిన గ్రేహౌండ్ పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడి మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్ పోలీసులు మృతి చెందారు. మావోయిస్టులను తిప్పికొట్టేందుకు పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. రెండు వైపుల నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. ఫైరింగ్ కొనసాగుతున్న ఎడ్మిల్లి కొండ ప్రాంతం తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. బాంబుల మోత, ఎన్ కౌంటర్లతో కర్రెగుట్టలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి.

కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్
మరో వైపు 17 రోజులుగా కర్రెగుట్టల్లో బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా కర్రెగుట్టల్లో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. కర్రెగుట్టల్లో వేలాది మంది పారామిలటరీ బలగాలతో పాటు డ్రోన్లు, హెలికాప్టర్లతో అపరేష్ కొనసాగుతుంది. కర్రెగుట్టలతో పాటు వాటి చుట్టు ఉన్న గుట్టల్లో మావోయిస్టుల డెన్ ప్రాంతాలను గుర్తించి, భద్రత బలగాలు దొబి కొండ స్వాధీనం చేసుకొని ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ లు, ఐ ఈ డీ లో పేలుళ్లతో బలగాలు మృతి చెందడం, గాయాలకు గురవుతున్నారు.


బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని  కర్రేగుట్టల్లో జరిగిన ఎన్బికౌంటర్ 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ తరువాత ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ 22 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. మార్చి 31 2026 వరకు. దేశవ్యాప్తంగా మావోయిజం అంతమవుతుందని ఆ లక్ష్యంగా బలగాలు ముందుకు వెళ్తున్నాయని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి చెప్పారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Embed widget