అన్వేషించండి

Telangana Nizamabad News: కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 90 మంది విద్యార్థినులకు అస్వస్థత

Nizamabad News: నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో.. 90 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

Nizamabad News: నిజామాబాద్ జిల్లా భీంగల్ లోని కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయింది. దీంతో 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నుంచి విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. దీంతో పాఠశాల సిబ్బంది  విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి మరీ నిజామాబాద్ కు పంపించారు. ప్రస్తుతం వీరందరి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా కిటకిటలాడింది. పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టారంటూ పాఠశాల సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు. మీ వల్లే మా పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం బాగాలేకపోతే ఇంత మంది పిల్లల పరిస్థితి ఏమయ్యుండేదో అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక నుంచి అయినా పిల్లల ఆహారం నాణ్యత విషయంలో దృష్టి పెట్టాలంటూ సూచిస్తున్నారు. 

Read Also: Food Poisoning: ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ - 26 మంది విద్యార్థులకు అస్వస్థత

మహబూబాబాద్ జిల్లా కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్ అయింది. విషాహారం తిన్న విద్యార్థుల్లో 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిందర్నీ మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కస్తూర్భ పాఠశాలలో గత రాత్రి భోజనం చేసినప్పటి నుంచి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అస్వస్థతతు గురయ్యారు. అయినా నిర్వాహకులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా రియాక్ట్ కాలేదని అంటున్నారు. చివరకు పరిస్థితి చేయిదాటిపోతుందన్న టైంలో ఫుడ్‌ పాయిజన్ అయిన విద్యార్థులకు అక్కడే వైద్య చికిత్సలు అందించారని చెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా డాక్టర్లను కస్తూర్భా పాఠశాలలోకి పిలిపించుకొని సీక్రెట్‌గా వైద్యం అందించారని తెలుస్తోంది. 

దీనిపై వివిధ మీడియాల్లో కథనాలు రావడంతో అలర్ట్‌ అయిన నిర్వాహకులు అప్పుడు ఆసుపత్రికి తరలించినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థినీలు కడుపు నొప్పి భరించలేక అవస్థలు పడుతున్నారు. కొందరికి సాధారణ చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమంది విద్యార్ధినీలకు వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇంత జరిగినా ఇంతవరకు విద్యార్ధినీల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రమాదం లేదని అసలు ఎందుకిలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెబుతున్నారు వైద్యులు. కలుషిత నీరు కారణంగా ఇలా జరిగిందా.. లేకుంటే ఆహారం వల్లే ఇది జరిగిందా అనేది పిల్లలు కోలుకున్న తర్వాతే తెలుస్తుందని అంటున్నారు. 

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంత  జరిగినా తల్లిదండ్రులకు ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై వారంతా మండిపడుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. భయపడాల్సిన పని లేదని వైద్యులు చికిత్స అందిస్తున్నారని త్వరగా కోలుకుంటారని భరోసా ఇచ్చారు. 

Read Also: Suryapet: ఎస్సీ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత - ఖర్జూరాలే కారణం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
Mallik Tej: యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు
యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు
Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
Mallik Tej: యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు
యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు
Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
World Heart Day 2024 : ప్రపంచ హృదయ దినోత్సవం 2024 థీమ్ ఇదే.. హార్ట్ హెల్తీగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఫుడ్స్ లిస్ట్ ఇదే
ప్రపంచ హృదయ దినోత్సవం 2024 థీమ్ ఇదే.. హార్ట్ హెల్తీగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఫుడ్స్ లిస్ట్ ఇదే
Devara Day 2 Box Office Collection: రెండు రోజుల్లో 200 కోట్లు దాటేసిన 'దేవర' - మిక్స్డ్ టాక్‌తో ఎన్టీఆర్ రికార్డుల మోత
రెండు రోజుల్లో 200 కోట్లు దాటేసిన 'దేవర' - మిక్స్డ్ టాక్‌తో ఎన్టీఆర్ రికార్డుల మోత
Janhvi Kapoor : జాన్వీ కపూర్ IIFA లుక్స్ చూశారా? గోల్డెన్ బాడీకాన్ డ్రెస్​లో సూపర్​ హాట్​గా ఉన్న దేవర బ్యూటీ
జాన్వీ కపూర్ IIFA లుక్స్ చూశారా? గోల్డెన్ బాడీకాన్ డ్రెస్​లో సూపర్​ హాట్​గా ఉన్న దేవర బ్యూటీ
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Embed widget