అన్వేషించండి

Suryapet: ఎస్సీ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత - ఖర్జూరాలే కారణం

Suryapet news: హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత అయింది. అందుకు కారణం ఓ విద్యార్థి తల్లిదండ్రులు తెచ్చిన ఖర్జూరాలే కావడం గమనార్హం. అసలేం జరిగిందంటే..? 

Suryapet news: నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో పదకొండ మంది విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. 

అసలేం జరిగిందంటే..?

నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ బాలికను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. ఈ క్రమంలోనే కూతురు కోసం ఖర్జూర పండ్లు తీసుకొచ్చారు. వారు వెళ్లిపోగానే బాలిక ఎంతో ఆత్రుతగా వాటిని తెరిచి తన స్నేహితులకు పంచింది. ఆపై వారితో కలిసి ఆమె కూడా తినేసింది. అయితే తిన్న కాసేపటి నుంచే పదకొండ మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తెగ ఇబ్బంది పడ్డారు. విషయం గుర్తించిన పాఠశాల సిబ్బంది వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. అయితే కాలపరిమితి దాటిన ఖర్జూర పండ్లు తినడంతోనే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని వారి తల్లిదండ్రులను కనుక్కున్నారు. అలాగే పిల్లలకు ఏమైనా కొనుక్కొచ్చే ముందు వాటి కాల పరిమితి ఎప్పటి వరకు ఉందో చెక్ చేయాలని సూచించారు. 

కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్

కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సిబ్బందికి విషయం చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు సైతం దిగారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు గురుకులానికి వెళ్లగా.. సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. తరువాత పోలీసులు రావడంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను గమనించి పోలీసులు స్వయంగా వారి వాహనంలో పలువురు విద్యార్థులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

45 మంది విద్యార్థులకు అస్వస్థతకు 

మూడు నెలల క్రితం కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో సుమారుగా 45 మంది విద్యార్థుల వరకు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాల సిబ్బందికి విషయం చెప్పినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తొలుత గురుకులానికి మీడియా చేరుకోగా, వారికి విషయం తెలియకుండా ఉండాలని గురుకులం సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్‌ సీఐ నాగరాజు గురుకులం వద్దకు చేరుకోని సిబ్బందితో మాట్లాడి లోనికి వెళ్లి పరిశీలించారు. 

అప్పటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. ఇది గమనించిన సీఐ నాగరాజు అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులను హుటాహుటిన తన వాహనంలో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  గురుకులంలో అస్వస్థతకు గురైన మరికొంతమంది విద్యార్థులను నాలుగుసార్లు పోలీసు వాహనంలోనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సోమవారం రాత్రి భోజనం చేసిన సమయంలో అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు వాపోతున్నారు. ఇలా పలుమార్లు భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget