అన్వేషించండి

Boy Died: నాగోల్ అయ్యప్ప కాలనీలో అదృశ్యమైన బాలుడు, చెరువులో మృతదేహంగా కనిపించడంతో విషాదం

Boy Died: నాగోల్ అయ్యప్ప కాలనీలో నిన్న అదృశ్యమైన బాలుడు అర్ధరాత్రి చెరువులో శవంగా కనిపించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Boy Died: హైదరాబాద్ నాగోల్  అయ్యప్ప కాలనీలో మూడేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతమైంది. ఆడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులో గుర్తించారు. ఒక్కగానొక్క కొడుకు ఇలా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల వివరాల మేరకు.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ అయ్యప్పనగర్ కాలనీకి చెందిన షేక్షావలి, సాకీరా భార్యభర్తలు. పదేళ్లుగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు షాహిద్ ఉన్నాడు. నిన్న షేక్షావలి బయటకు వెళ్లగా, సాకీరా ఇంట్లోనే ఉంది. అదే సమయంలో సాహిత్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. అయితే, చాలా సమయమైనా షాహిద్ ఇంట్లోకి రాకపోవడంతో.. సాకీరా చుట్టుపక్కల గమనించగా ఎక్కడా కనిపించలేదు.

అర్ధరాత్రి శవంగా చెరువులో కనిపించిన బాలుడు.. 
బంధువులు, తెలిసిన వాళ్ల ఇంట్లో ఏమైనా ఉన్నాడా అని సాకీరా ఆరా తీసింది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో.. భర్త వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అదృశ్యమైన బాలుడి కోసం స్థానికులు కూడా వెతికారు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు కాలనీకి సమీపంలో ఉన్న చెరువులో అర్ధరాత్రి 12 గంటలకు ఓ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే వారు విషయాన్ని పోలీసులకు తెలపడంతో.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఈతగాళ్ల సాయంతో ఆ మృతదేహాన్ని బయటకు తీయించారు. అయితే చెరువులో లభ్యం అయిన మృతదేహం అదృశ్యమైన షాహిద్ గా గుర్తించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆడుకునేందుకు బయటకు వెళ్లి మృతదేహంగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

"కావాలనే బాబును చెరువులో పడేసి చంపేశారు".. 
తన కొడుకును ఎవరో కావాలనే చెరువులో తోసేసి ఉంటారని, షాహిద్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ సాకీరా ఆరోపించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే స్థానికులు చూపించిన చొరవ పోలీసులు చూపించలేంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. 

కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగిన చిన్నారి!

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా భీంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, లావణ్య దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల శాన్వి గుండి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో LKG చదువుతోంది. ఆదివారం పెద్దనాన్న ఇంటి వద్ద శాన్వి ఆడుకుంటోంది. పంటకు పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును కూల్ డ్రింగ్ బాటిల్ నింపి ఇంటి దగ్గర పెట్టారు. అక్కడే ఆడుకుంటున్న పాప సీసాను చూసి కూల్ డ్రింక్ అనుకుని తాగింది. ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో వాసనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి పంపారు. అక్కడ పది ఆసుపత్రులు తిరిగినా చోర్చుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఓ ఆసుపత్రిలో చేర్చుకున్నా అప్పటికే బాలిక ప్రాణాలు విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి కళ్లముందే విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Indian Student Kills Family In Alton: టెక్సాస్‌లో తల్లి,తండ్రితో పాటు అమ్మమ్మలనూ కాల్చేసిన భారత విద్యార్థి - సరదాకే ఇలా చేశాడా?
టెక్సాస్‌లో తల్లి,తండ్రితో పాటు అమ్మమ్మలనూ కాల్చేసిన భారత విద్యార్థి - సరదాకే ఇలా చేశాడా?
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy Fathers Day : హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Best Yoga Poses Men : 40 ఏళ్లు దాటిన మగవారు కచ్చితంగా చేయాల్సిన యోగాసనాలు ఇవే.. ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం
40 ఏళ్లు దాటిన మగవారు కచ్చితంగా చేయాల్సిన యోగాసనాలు ఇవే.. ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Yoga Benefits : రోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. మగవారికి, ఆడవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి
రోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. మగవారికి, ఆడవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
Embed widget