అన్వేషించండి

Matrimony Fraud: 'తల్లిదండ్రులు లేని పిల్ల బాబూ' - జరిగే పెళ్లి నిజం కానీ వధువు మాయం, కట్ చేస్తే!

Crime News: ఓ కుటుంబంగా ఏర్పడతారు. పేదింటి యువతికి పెళ్లి చేస్తున్నట్లు నమ్మిస్తారు. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంటారు. పెళ్లి కాని వారే టార్గెట్‌గా ప.గో జిల్లా ఈ తరహా మోసాలు ఇటీవల పెరుగుతున్నాయి.

Matrimony Fraud In Godavari Districts: 'తల్లిదండ్రులు లేని పిల్ల బాబూ.. ఎన్నో కష్టాలు పడింది. మీ ఇంటికెళ్లాక అయినా సుఖపడుతుంది.' అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇదంతా నమ్మిన వారిని నట్టేట ముంచేస్తారు. పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్‌గా తెలివిగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలో ప.గో జిల్లాలో ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకూ అందిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ అక్క, ఓ బావ, అన్న, వదిన.. ఆపై అత్తమామలు.. ఆడపడుచు.. వీరంతా ఓ కుటుంబంగా ఉంటారు. తల్లిదండ్రులు లేని ఆ పేద యువతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తారు. అవసరమైతే ఎదురు డబ్బు ఇచ్చే వ్యక్తికి వివాహం చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇది నిజమని నమ్మిన వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి కనపడకుండా పోతారు. పెళ్లి కాని ప్రసాదులనే ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు.

వాళ్లే టార్గెట్..

కొన్ని సామాజికవర్గాల్లో పెళ్లీడు ఆడపిల్లలు తక్కువగా ఉండడంతో అవివాహిత యువకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పెళ్లి సంబంధాలు దొరక్క విసిగిపోయిన వీరు.. దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతులకు ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. వీరి బలహీనతనే ఆసరాగా చేసుకున్న కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు నకిలీ పెళ్లి ముఠాలు సైతం పుట్టుకొచ్చాయి. రాయలసీమలోని హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్లు దాటాయి. ఆ ప్రాంతంలో వధువు కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో మధ్యవర్తులను సంప్రదించగా భీమవరానికి చెందిన అగ్రవర్ణ పేదింటి యువతి ఉందని ఆయనకు సమాచారం పంపారు. ఆ వ్యక్తి భీమవరం వచ్చి మధ్యవర్తులను కలవగా.. యువతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుని పెళ్లి చేసుకుని తీసుకెళ్లవచ్చని చెప్పి.. రూ.4.50 లక్షలు దండుకున్నారు.

యువతిని పెళ్లి చేసుకుని సొంతూరికి తీసుకెళ్లగా.. 2 రోజులకే అనారోగ్యమంటూ నాటకమాడింది. వారం తర్వాత తమ వారిని చూసొస్తామంటూ పట్టుబట్టడంతో భర్త ఆమెను భీమవరం తీసుకొచ్చాడు. రైల్వే స్టేషన్‌కు వచ్చాక మాయమాటలు చెప్పి కనిపించకుండా పోయింది. దీంతో మధ్యవర్తులకు ఫోన్ చేయగా.. మోసపోయినట్లు తేలింది. ఈ క్రమంలో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అటు, ధర్మవరానికి చెందిన ఓ యువకుడు సైతం ఇదే తరహాలో రూ.3 లక్షలు మోసానికి గురయ్యాడు. అలాగే, సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి రూ.8 లక్షలు తీసుకుని కుచ్చుటోపీ పెట్టారు. కర్ణాటకలోనూ బాధితులు ఈ ముఠాల బారిన పడినట్లు తెలుస్తోంది. కొందరు నకిలీ వధువులైతే అత్తింటికి వెళ్లిన వెంటనే రాత్రికి రాత్రే నగదు, నగలతో పారిపోతున్నారు. ప.గో జిల్లా నవుడూరుకు చెందిన ఓ మహిళ ఈ ముఠాలో అక్క పాత్ర పోషిస్తోంది. ఇదే మండలానికి చెందిన ఓ పాల వ్యాపారి అన్న, బావగా నటిస్తున్నాడు. భీమవరంలో అత్తమామలు, తాడేపల్లిగూడెంలో ఆడపడుచు పాత్రధారులు ఉన్నారు. వీరంతా మాయమాటలతో కన్నీటిగాథలు చెప్పి పెళ్లి కాని వారి నుంచి డబ్బులు దోచేస్తున్నారు. అయితే, వివాహమైన కొద్దిరోజులకు కానీ తాము మోసపోయామన్న సంగతి వరులకు తెలియడం లేదు. ఈ తరహా మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

Also Read: Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget