అన్వేషించండి

Matrimony Fraud: 'తల్లిదండ్రులు లేని పిల్ల బాబూ' - జరిగే పెళ్లి నిజం కానీ వధువు మాయం, కట్ చేస్తే!

Crime News: ఓ కుటుంబంగా ఏర్పడతారు. పేదింటి యువతికి పెళ్లి చేస్తున్నట్లు నమ్మిస్తారు. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంటారు. పెళ్లి కాని వారే టార్గెట్‌గా ప.గో జిల్లా ఈ తరహా మోసాలు ఇటీవల పెరుగుతున్నాయి.

Matrimony Fraud In Godavari Districts: 'తల్లిదండ్రులు లేని పిల్ల బాబూ.. ఎన్నో కష్టాలు పడింది. మీ ఇంటికెళ్లాక అయినా సుఖపడుతుంది.' అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇదంతా నమ్మిన వారిని నట్టేట ముంచేస్తారు. పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్‌గా తెలివిగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలో ప.గో జిల్లాలో ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకూ అందిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ అక్క, ఓ బావ, అన్న, వదిన.. ఆపై అత్తమామలు.. ఆడపడుచు.. వీరంతా ఓ కుటుంబంగా ఉంటారు. తల్లిదండ్రులు లేని ఆ పేద యువతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తారు. అవసరమైతే ఎదురు డబ్బు ఇచ్చే వ్యక్తికి వివాహం చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇది నిజమని నమ్మిన వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి కనపడకుండా పోతారు. పెళ్లి కాని ప్రసాదులనే ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు.

వాళ్లే టార్గెట్..

కొన్ని సామాజికవర్గాల్లో పెళ్లీడు ఆడపిల్లలు తక్కువగా ఉండడంతో అవివాహిత యువకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పెళ్లి సంబంధాలు దొరక్క విసిగిపోయిన వీరు.. దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతులకు ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. వీరి బలహీనతనే ఆసరాగా చేసుకున్న కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు నకిలీ పెళ్లి ముఠాలు సైతం పుట్టుకొచ్చాయి. రాయలసీమలోని హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్లు దాటాయి. ఆ ప్రాంతంలో వధువు కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో మధ్యవర్తులను సంప్రదించగా భీమవరానికి చెందిన అగ్రవర్ణ పేదింటి యువతి ఉందని ఆయనకు సమాచారం పంపారు. ఆ వ్యక్తి భీమవరం వచ్చి మధ్యవర్తులను కలవగా.. యువతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుని పెళ్లి చేసుకుని తీసుకెళ్లవచ్చని చెప్పి.. రూ.4.50 లక్షలు దండుకున్నారు.

యువతిని పెళ్లి చేసుకుని సొంతూరికి తీసుకెళ్లగా.. 2 రోజులకే అనారోగ్యమంటూ నాటకమాడింది. వారం తర్వాత తమ వారిని చూసొస్తామంటూ పట్టుబట్టడంతో భర్త ఆమెను భీమవరం తీసుకొచ్చాడు. రైల్వే స్టేషన్‌కు వచ్చాక మాయమాటలు చెప్పి కనిపించకుండా పోయింది. దీంతో మధ్యవర్తులకు ఫోన్ చేయగా.. మోసపోయినట్లు తేలింది. ఈ క్రమంలో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అటు, ధర్మవరానికి చెందిన ఓ యువకుడు సైతం ఇదే తరహాలో రూ.3 లక్షలు మోసానికి గురయ్యాడు. అలాగే, సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి రూ.8 లక్షలు తీసుకుని కుచ్చుటోపీ పెట్టారు. కర్ణాటకలోనూ బాధితులు ఈ ముఠాల బారిన పడినట్లు తెలుస్తోంది. కొందరు నకిలీ వధువులైతే అత్తింటికి వెళ్లిన వెంటనే రాత్రికి రాత్రే నగదు, నగలతో పారిపోతున్నారు. ప.గో జిల్లా నవుడూరుకు చెందిన ఓ మహిళ ఈ ముఠాలో అక్క పాత్ర పోషిస్తోంది. ఇదే మండలానికి చెందిన ఓ పాల వ్యాపారి అన్న, బావగా నటిస్తున్నాడు. భీమవరంలో అత్తమామలు, తాడేపల్లిగూడెంలో ఆడపడుచు పాత్రధారులు ఉన్నారు. వీరంతా మాయమాటలతో కన్నీటిగాథలు చెప్పి పెళ్లి కాని వారి నుంచి డబ్బులు దోచేస్తున్నారు. అయితే, వివాహమైన కొద్దిరోజులకు కానీ తాము మోసపోయామన్న సంగతి వరులకు తెలియడం లేదు. ఈ తరహా మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

Also Read: Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Embed widget