అన్వేషించండి

Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం

AP Panchayat Raj | ఏపీలో పంచాయతీ రాజ్, మున్సిపల్ సవరణ చట్టాలకు శాసనసభలో ఆమోదం లభించింది. మండలిలో ఆమోదం, అనంతరం గవర్నర్ ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుందని తెలిసిందే.

Andhra Pradesh Municipalities Act | అమరావతి: ఏపీ అసెంబ్లీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారనున్నాయి. తాజాగా చేసిన చట్ట సవరణ ప్రకారం ఎంత మంది పిల్లలున్నా నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలకు నేడు శాసనసభలో ఆమోదం లభించింది. పంచాయతీ రాజ్ సహా పలు చట్టాలకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిలో ఈ బిల్లులకు ఆమోదం వచ్చాక, గవర్నర్ ఆమోదం పొందితే ఈ బిల్లులు చట్ట రూపం దాల్చనున్నాయి.  

దక్షిణాదికి చిక్కులు తెచ్చిన కుటుంబ నియంత్రణ!
జనాభా ప్రాతిపదికన త్వరలోనే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేయనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పే విషయాలను దక్షిణాది రాష్ట్రాలు, ప్రభుత్వాలు పాటించడం ద్వారా కుటుంబ నియంత్ర పాటించి జనాభా సమస్య అధికం కాకుండా చర్యలు తీసుకున్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం కుటుంబ నియంత్రణ చర్యలను అక్కడి ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయకపోవడంతో వారి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు ఎక్కువగా పెరగనున్నాయి. ఇప్పటికే దక్షిణాదిపై ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం ఉందని, వారి సీట్ల సంఖ్యలో సభలో దక్షిణాది వారి అభిప్రాయాలకు విలువ మరింత తగ్గుతుందని రాజకీయంగా చర్చ జరుగుతోంది.

ఇటీవల దక్షిణాదిని ఊపేసిన స్టాలిన్, చంద్రబాబు కామెంట్లు..
ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు గత నెలలో చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిన హాట్ టాపిక్ అయ్యాయి. కొత్తగా పెళ్లైన దంపతులు 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఆ మాటలు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కవ మంది పిల్లల్ని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ వారి రాష్ట్రాల ప్రజలకు సూచించడం వెనుక పెద్ద కారణమే ఉంది. 

గతంలో కొన్ని దశాబ్దాలపాటు ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు అసలే వద్దు అని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. కానీ దీన్ని దక్షిణాది రాష్ట్రాలు కాస్తో కూస్తో అమలు చేయగా ఇక్కడ జనాభా మరీ ఉత్తరాది రాష్ట్రాల్లా విపరీతంగా పెరగలేదు. ఈ సీఎంల మాటల వెనక పెద్ద కారణాలే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి తగ్గిపోయిందని, జీవిస్తున్న ప్రజల సరాసరి వయసు పెరిగిపోతుందని నాబార్డ్ లెక్కలు చెబుతున్నాయి. కుటంబంలో జాతీయ సగటు 4.3గా ఉంటే.. ఉత్తరాదిలో ఇది 5 ఉంది. కేరళలో 3.8, ఏపీలో 3.7, తమిళనాడులో 4.1, కర్ణాటకలో 4.3 గా సగటు ఉంది. కుటంబాలు చిన్నవి కావడంతో దక్షిణాదిన వృద్ధుల సంఖ్య (60 ఏళ్లు దాటిన) వారి సంఖ్య పెరుగుతోంది. 19 నుంచి 60 మధ్య వారి సంఖ్య తగ్గితే పనిచేసే వారి సంఖ్య తగ్గినట్లే. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో యువత అధికంగా ఉండాలంటే జనాభా పెరగాలని చంద్రబాబు, స్టాలిన్ సూచించారు.

Also Read: TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

సంతానం ఎక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని భయాలు వద్దని, చట్టంలో సవరణ చేస్తామని చంద్రబాబు ఇటీవల చెప్పారు. తాజాగా ఏపీ శాసనసభలో ఏపీ పంచాయతీ రాజ్, ఏపీ మున్సిపాలిటీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. ప్రస్తుతం చైనా, జపాన్ లాంటి దేశాల్లో పెళ్లిళ్లపై ఆసక్తి చూపకపోవడంతో యువత సంఖ్య తగ్గిపోయి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య జనాభాలో భారీగా కనిపిస్తోంది. అంటే పనిచేసే వారి సంఖ్య తగ్గి వారు ఎదుర్కొంటున్న సమస్య రావద్దంటే జనాభా పెరగాలని, యువత శాతం పెరుగుతుందని దక్షిణాది నేతలు స్టాలిన్, చంద్రబాబు లాంటి నేతలు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget