అన్వేషించండి

Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం

AP Panchayat Raj | ఏపీలో పంచాయతీ రాజ్, మున్సిపల్ సవరణ చట్టాలకు శాసనసభలో ఆమోదం లభించింది. మండలిలో ఆమోదం, అనంతరం గవర్నర్ ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుందని తెలిసిందే.

Andhra Pradesh Municipalities Act | అమరావతి: ఏపీ అసెంబ్లీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారనున్నాయి. తాజాగా చేసిన చట్ట సవరణ ప్రకారం ఎంత మంది పిల్లలున్నా నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలకు నేడు శాసనసభలో ఆమోదం లభించింది. పంచాయతీ రాజ్ సహా పలు చట్టాలకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిలో ఈ బిల్లులకు ఆమోదం వచ్చాక, గవర్నర్ ఆమోదం పొందితే ఈ బిల్లులు చట్ట రూపం దాల్చనున్నాయి.  

దక్షిణాదికి చిక్కులు తెచ్చిన కుటుంబ నియంత్రణ!
జనాభా ప్రాతిపదికన త్వరలోనే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేయనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పే విషయాలను దక్షిణాది రాష్ట్రాలు, ప్రభుత్వాలు పాటించడం ద్వారా కుటుంబ నియంత్ర పాటించి జనాభా సమస్య అధికం కాకుండా చర్యలు తీసుకున్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం కుటుంబ నియంత్రణ చర్యలను అక్కడి ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయకపోవడంతో వారి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు ఎక్కువగా పెరగనున్నాయి. ఇప్పటికే దక్షిణాదిపై ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం ఉందని, వారి సీట్ల సంఖ్యలో సభలో దక్షిణాది వారి అభిప్రాయాలకు విలువ మరింత తగ్గుతుందని రాజకీయంగా చర్చ జరుగుతోంది.

ఇటీవల దక్షిణాదిని ఊపేసిన స్టాలిన్, చంద్రబాబు కామెంట్లు..
ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు గత నెలలో చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిన హాట్ టాపిక్ అయ్యాయి. కొత్తగా పెళ్లైన దంపతులు 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఆ మాటలు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కవ మంది పిల్లల్ని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ వారి రాష్ట్రాల ప్రజలకు సూచించడం వెనుక పెద్ద కారణమే ఉంది. 

గతంలో కొన్ని దశాబ్దాలపాటు ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు అసలే వద్దు అని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. కానీ దీన్ని దక్షిణాది రాష్ట్రాలు కాస్తో కూస్తో అమలు చేయగా ఇక్కడ జనాభా మరీ ఉత్తరాది రాష్ట్రాల్లా విపరీతంగా పెరగలేదు. ఈ సీఎంల మాటల వెనక పెద్ద కారణాలే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి తగ్గిపోయిందని, జీవిస్తున్న ప్రజల సరాసరి వయసు పెరిగిపోతుందని నాబార్డ్ లెక్కలు చెబుతున్నాయి. కుటంబంలో జాతీయ సగటు 4.3గా ఉంటే.. ఉత్తరాదిలో ఇది 5 ఉంది. కేరళలో 3.8, ఏపీలో 3.7, తమిళనాడులో 4.1, కర్ణాటకలో 4.3 గా సగటు ఉంది. కుటంబాలు చిన్నవి కావడంతో దక్షిణాదిన వృద్ధుల సంఖ్య (60 ఏళ్లు దాటిన) వారి సంఖ్య పెరుగుతోంది. 19 నుంచి 60 మధ్య వారి సంఖ్య తగ్గితే పనిచేసే వారి సంఖ్య తగ్గినట్లే. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో యువత అధికంగా ఉండాలంటే జనాభా పెరగాలని చంద్రబాబు, స్టాలిన్ సూచించారు.

Also Read: TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

సంతానం ఎక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని భయాలు వద్దని, చట్టంలో సవరణ చేస్తామని చంద్రబాబు ఇటీవల చెప్పారు. తాజాగా ఏపీ శాసనసభలో ఏపీ పంచాయతీ రాజ్, ఏపీ మున్సిపాలిటీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. ప్రస్తుతం చైనా, జపాన్ లాంటి దేశాల్లో పెళ్లిళ్లపై ఆసక్తి చూపకపోవడంతో యువత సంఖ్య తగ్గిపోయి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య జనాభాలో భారీగా కనిపిస్తోంది. అంటే పనిచేసే వారి సంఖ్య తగ్గి వారు ఎదుర్కొంటున్న సమస్య రావద్దంటే జనాభా పెరగాలని, యువత శాతం పెరుగుతుందని దక్షిణాది నేతలు స్టాలిన్, చంద్రబాబు లాంటి నేతలు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget