అన్వేషించండి

Macherial: వీఆర్ఏ గొంతు కోసి హత్య, తహసీల్దార్ ఆఫీసులోనే దారుణం

Mancherial: ఓ రెవెన్యూ ఉద్యోగి హత్యకు గురి కావడం జిల్లాలో సంచలనం అయింది. వ్యక్తిగత కక్షలతో వీఆర్‌ఏ హత్య జరిగిందా లేదా ఏదైనా రెవెన్యూ సంబంధిత లావాదేవీనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

VRA Murder in Mancherial District: మంచిర్యాల జిల్లాలో (Mancherial) ఓ ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి (Kannepalli) ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్ఏ హత్యకు (VRA Murder) గురయ్యాడు. కొత్తపల్లి వీఆర్‌ఏ (Kothapalli VRA) అయిన దుర్గం బాబును గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న దుర్గం బాబును స్థానికులు గుర్తించి పరిశీలించగా.. అప్పటికే అతను కదల్లేని స్థితిలో ఉన్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. 

అయితే, ఓ రెవెన్యూ ఉద్యోగి హత్యకు గురి కావడం జిల్లాలో సంచలనం అయింది. వ్యక్తిగత కక్షలతో వీఆర్‌ఏ హత్య (VRA Murder) జరిగిందా లేదా ఏదైనా రెవెన్యూ సంబంధిత లావాదేవీనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధికారుల మధ్య విబేధాలతో అది హత్యకు దారి తీసిందా అనే కోణంలో కూడా పోలీసులు హత్య చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

దుర్గం బాబు కొత్తపల్లికి (Kothapalli) గ్రామ రెవెన్యూ సహాయకుడు (VRA)గా పని చేస్తున్నాడు. మంచిర్యాల జిల్లా (Mancherial District) కన్నెపల్లి తహసీల్దార్‌ (Kannepalli MRO Office) కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులను పిలిపించి వారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్నది పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని సీఐ బాబురావు వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదిరిస్తున్నారని దుర్గం బాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే విషయంపై గతంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అతనే దుర్గం బాబును హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

గతంలోనూ తహసీల్దార్ ఆఫీసుల్లో దాడులు
తహసీల్దార్ ఆఫీసులపై దాడులు జరిగడం ఇదేం మొదటిసారి కాదు. హైదరాబాద్ శివారులో తహసీల్దార్ విజయా రెడ్డిపై పెట్రోల్ పోసిన ఘటన కొన్నేళ్ల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతేడాది మెదక్ జిల్లా శివ్వం పేటలో తహసీల్దార్ పై రైతులు డీజిల్ పోసిన ఘటన చోటు చేసుకుంది. సకాలంలో తహసీల్దార్ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోగొట్టుకున్న రైతుకు బీమా డబ్బులు రాలేదని ఆరోపిస్తూ రైతులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి తహసీల్దార్ పై దాడికి ప్రయత్నించారు. ఆఖరికి హైదరాబాద్ షేక్ పేటలో ఎమ్మార్వోపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. గద్వాల విజయలక్ష్మి నగర మేయర్ కాక ముందు ఆమె అనుచరులతో కలిసి బెదిరించారని ఆయన అప్పట్లో అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

High Speed rail: హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
AP Bird Flu Tension: ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
MLCKavitha: కేసీఆర్‌ను, బీఆర్ఎస్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి తరం కాదు- ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
కేసీఆర్‌ను, బీఆర్ఎస్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి తరం కాదు- ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Chhaava - Rashmika Mandanna: ఎవరీ ఏసుబాయి? 'ఛావా'లో రష్మిక రోల్ వెనుక కథ, భర్త బ్రతికి ఉండగా ఏం మహారాణి ఏం చేసిందో తెలిస్తే జై కొట్టాల్సిందే
ఎవరీ ఏసుబాయి? 'ఛావా'లో రష్మిక రోల్ వెనుక కథ, భర్త బ్రతికి ఉండగా ఏం మహారాణి ఏం చేసిందో తెలిస్తే జై కొట్టాల్సిందే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Deputy CM Pawan Kalyan Palani Temple | షష్ఠ షణ్ముఖ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ | ABP DesamPM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP DesamTrump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP DesamCaste Census Re Survey in Telangana |  ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High Speed rail: హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
AP Bird Flu Tension: ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
MLCKavitha: కేసీఆర్‌ను, బీఆర్ఎస్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి తరం కాదు- ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
కేసీఆర్‌ను, బీఆర్ఎస్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి తరం కాదు- ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Chhaava - Rashmika Mandanna: ఎవరీ ఏసుబాయి? 'ఛావా'లో రష్మిక రోల్ వెనుక కథ, భర్త బ్రతికి ఉండగా ఏం మహారాణి ఏం చేసిందో తెలిస్తే జై కొట్టాల్సిందే
ఎవరీ ఏసుబాయి? 'ఛావా'లో రష్మిక రోల్ వెనుక కథ, భర్త బ్రతికి ఉండగా ఏం మహారాణి ఏం చేసిందో తెలిస్తే జై కొట్టాల్సిందే
PM Children Care Scheme: మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - ఈ స్కీమ్‌ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు
మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - PM CARES స్కీమ్‌ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు
Balakrishna Thaman: తమన్‌కు పోర్షే గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ... ఆ కారు రేటు ఎన్ని కోట్లు ఉందో తెల్సా?
తమన్‌కు పోర్షే గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ... ఆ కారు రేటు ఎన్ని కోట్లు ఉందో తెల్సా?
Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Tirumala Alert: చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.