అన్వేషించండి

Mancherial Fire Accident: ఆరుగురు సజీవ దహనం కేసులో కీలక ఆధారాలు- వారం రోజులుగా రెక్కీ- రూ. 5 వేల పెట్రోల్ కొనుగోలు!

Mancherial Fire Accident: మంచిర్యాల జిల్లా గుడిపెల్లిలో ఆరుగురు సజీవ దహనం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు 5 వేల రూపాయల పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

Mancherial Fire Accident: మంచిర్యాల జిల్లా గుడిపెల్లి(వెంకటాపూర్)లో ఆరుగురు సజీవ దహనం అయిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సీసీసీ పెట్రోల్ బంక్ లో ముగ్గురు వ్యక్తులు ఐదు వేల రూపాయల పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. లక్షెట్టిపేటకు చెందిన వ్యక్తి, ఉట్కూర్ కు చెందిన మరో వ్యక్తితోపాటు గోదావరిఖనిలో ఐదుగురు, ఆటోలో ఉన్న ఇద్దరు, గుడిపెల్లికి చెందిన వ్యక్తి మొత్తం పది మందిని మరిన్ని వివరాల కోసం విచారణ చేస్తున్నారు. లక్షెట్టిపేట, ఉట్కూర్ కు చెందిన ఇద్దరు మంచిర్యాలలోని ఓ లాడ్జిలో వారం రోజుల నుంచి ఉంటున్నారు. వారు పలుమార్లు రెక్కీ నిర్వహించిన అనంతరం ఈనెల 16వ తేదీన శ్రీరాంపూర్ కు చెందిన ఆటో మాట్లాడుకొని అప్పటికే సిద్ధం చేసుకున్న డబ్బాల్లో సీసీసీ బంక్ లో రాత్రి 9.54 గంటలకు పెట్రోల్ తీసుకున్నారు. 

పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయిన దుండగులు

గుడిపెల్లికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దగ్గరి దారిలో కాకుండా రసూల్ పెల్లి మీదుగా గుడిపెల్లికి 15 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించారు. మార్గ మధ్యలో మద్యం తాగిన వీరు రాత్రి 11.15 గంటలకు గుడిపెల్లి శివారుకు చేరుకున్నారు. 11.45 గంటల నుంచి 12.15 గంటల వరకు బాధితుల ఇంటికి ఉన్న రెండు తలుపుల నుంచి లోపల పెట్రోల్ గుమ్మరించారు. మంటలు రేగాక చుట్టు పక్కల వారు మేల్కొనడంతో పెట్రోల్ డబ్బాలను చింతచెట్టు కింద వదిలి వచ్చిన ఆటోలోనే పరారు అయ్యారు. అనంతరం లాడ్జికి చేరుకొని 17వ తేదీన అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉట్కూర్ కు చెందిన వ్యక్తిపై ఇంతకు ముందే హత్య కేసు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి తల్లికి, మంటల్లో కాలిపోయిన వ్యక్తి తమ్ముడికి అక్రమ సంబంధం ఉండటంతో 15 సంవత్సరాల క్రితం ఆయనను హతమార్చినట్లు విచారణలో వెలుగు చూసింది. 

వారి సమాచారాలు తెలుసుకునేందుకు గ్రామస్థుడితో ఒప్పందం..!

గుడిపెల్లికి చెందిన ఓ వ్యక్తి దుండగులకు సహకరించినట్లుగా పోలీసులు తేల్చారు. మాస పద్మ, శివయ్య దంపతులు, శాంతయ్య గ్రామంలో ఉన్నారా లేదా వారు ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు వంటి విషయాలను ఎప్పటికప్పుడు చెప్పేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. అందుకోసం అతడికి మూడు లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు వివరిస్తున్నారు. ఘటన జరిగిన రోజు పూటుగా తాగి ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో ఎంత మంది ఉన్నారో కూడా తెలియకుండా.. ముగ్గురే ఉన్నట్లు వారికి సమాచారం ఇచ్చాడు. చుట్టం చూపుగా వచ్చిన మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలియక పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో... వీళ్లు కూడా చనిపోయారు. అయితే ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం కూడా ఈ వ్యక్తి అక్కడే ఉన్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. 

సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ

ప్రాణాలు కాపాడుకునేందుకు మృతులు ఎంతో కష్టపడ్డారు. మంటల్లో కాలిపోతుండగా... కిటికీలు, తలుపుల వద్దరకు వచ్చి మాంసపు ముద్దలుగా మారిపోయారు. అయితే ఈ ఘటనలో మౌనిత తన రెండేళ్ల కూతురు ప్రశాంతిని ఒడిలోనే ఉంచుకొని బూడిదైంది.తలుపు గడియ పెట్టి ఉండడంతో వారు బయటకు రాలేకపోయారు. అయితే శాంతయ్య శవం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. ఆదివారం కూడా శవాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు అనుమానం ఉన్న ఇతర బంధువులను పోలీసులు గోదావరిఖనిలో అదుపుకలోకి తీసుకున్నారు. అయితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి 2023 జనవరి 27వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని రామగుండం పోలీసులు కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget