అన్వేషించండి

Mancherial Fire Accident: ఆరుగురు సజీవ దహనం కేసులో కీలక ఆధారాలు- వారం రోజులుగా రెక్కీ- రూ. 5 వేల పెట్రోల్ కొనుగోలు!

Mancherial Fire Accident: మంచిర్యాల జిల్లా గుడిపెల్లిలో ఆరుగురు సజీవ దహనం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు 5 వేల రూపాయల పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

Mancherial Fire Accident: మంచిర్యాల జిల్లా గుడిపెల్లి(వెంకటాపూర్)లో ఆరుగురు సజీవ దహనం అయిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సీసీసీ పెట్రోల్ బంక్ లో ముగ్గురు వ్యక్తులు ఐదు వేల రూపాయల పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. లక్షెట్టిపేటకు చెందిన వ్యక్తి, ఉట్కూర్ కు చెందిన మరో వ్యక్తితోపాటు గోదావరిఖనిలో ఐదుగురు, ఆటోలో ఉన్న ఇద్దరు, గుడిపెల్లికి చెందిన వ్యక్తి మొత్తం పది మందిని మరిన్ని వివరాల కోసం విచారణ చేస్తున్నారు. లక్షెట్టిపేట, ఉట్కూర్ కు చెందిన ఇద్దరు మంచిర్యాలలోని ఓ లాడ్జిలో వారం రోజుల నుంచి ఉంటున్నారు. వారు పలుమార్లు రెక్కీ నిర్వహించిన అనంతరం ఈనెల 16వ తేదీన శ్రీరాంపూర్ కు చెందిన ఆటో మాట్లాడుకొని అప్పటికే సిద్ధం చేసుకున్న డబ్బాల్లో సీసీసీ బంక్ లో రాత్రి 9.54 గంటలకు పెట్రోల్ తీసుకున్నారు. 

పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయిన దుండగులు

గుడిపెల్లికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దగ్గరి దారిలో కాకుండా రసూల్ పెల్లి మీదుగా గుడిపెల్లికి 15 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించారు. మార్గ మధ్యలో మద్యం తాగిన వీరు రాత్రి 11.15 గంటలకు గుడిపెల్లి శివారుకు చేరుకున్నారు. 11.45 గంటల నుంచి 12.15 గంటల వరకు బాధితుల ఇంటికి ఉన్న రెండు తలుపుల నుంచి లోపల పెట్రోల్ గుమ్మరించారు. మంటలు రేగాక చుట్టు పక్కల వారు మేల్కొనడంతో పెట్రోల్ డబ్బాలను చింతచెట్టు కింద వదిలి వచ్చిన ఆటోలోనే పరారు అయ్యారు. అనంతరం లాడ్జికి చేరుకొని 17వ తేదీన అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉట్కూర్ కు చెందిన వ్యక్తిపై ఇంతకు ముందే హత్య కేసు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి తల్లికి, మంటల్లో కాలిపోయిన వ్యక్తి తమ్ముడికి అక్రమ సంబంధం ఉండటంతో 15 సంవత్సరాల క్రితం ఆయనను హతమార్చినట్లు విచారణలో వెలుగు చూసింది. 

వారి సమాచారాలు తెలుసుకునేందుకు గ్రామస్థుడితో ఒప్పందం..!

గుడిపెల్లికి చెందిన ఓ వ్యక్తి దుండగులకు సహకరించినట్లుగా పోలీసులు తేల్చారు. మాస పద్మ, శివయ్య దంపతులు, శాంతయ్య గ్రామంలో ఉన్నారా లేదా వారు ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు వంటి విషయాలను ఎప్పటికప్పుడు చెప్పేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. అందుకోసం అతడికి మూడు లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు వివరిస్తున్నారు. ఘటన జరిగిన రోజు పూటుగా తాగి ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో ఎంత మంది ఉన్నారో కూడా తెలియకుండా.. ముగ్గురే ఉన్నట్లు వారికి సమాచారం ఇచ్చాడు. చుట్టం చూపుగా వచ్చిన మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలియక పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో... వీళ్లు కూడా చనిపోయారు. అయితే ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం కూడా ఈ వ్యక్తి అక్కడే ఉన్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. 

సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ

ప్రాణాలు కాపాడుకునేందుకు మృతులు ఎంతో కష్టపడ్డారు. మంటల్లో కాలిపోతుండగా... కిటికీలు, తలుపుల వద్దరకు వచ్చి మాంసపు ముద్దలుగా మారిపోయారు. అయితే ఈ ఘటనలో మౌనిత తన రెండేళ్ల కూతురు ప్రశాంతిని ఒడిలోనే ఉంచుకొని బూడిదైంది.తలుపు గడియ పెట్టి ఉండడంతో వారు బయటకు రాలేకపోయారు. అయితే శాంతయ్య శవం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. ఆదివారం కూడా శవాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు అనుమానం ఉన్న ఇతర బంధువులను పోలీసులు గోదావరిఖనిలో అదుపుకలోకి తీసుకున్నారు. అయితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి 2023 జనవరి 27వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని రామగుండం పోలీసులు కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Embed widget