అన్వేషించండి

Crime News: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రగ్స్ కలకలం, వ్యాపారవేత్తలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Hyderabad News : బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తరలిస్తున్న సాయి చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Telangana Crime news: ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. పోలీసులు డ్రగ్స్ కట్టడికి ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నా  కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాల్లో నగరానికి తీసుకొస్తూనే ఉన్నారు.  పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా వ్యాపారస్తులను అంటగడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తరలిస్తున్న సాయి చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ని చిన్న చిన్న ప్యాకెట్లలోకి మార్చి  ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా సాయి చరణ్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.   

నిందితుడు అరెస్ట్
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు  వ్యాపారవేత్తలతో పాటు ప్రధాన నిందితుడు సాయిచరణ్‌ను పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం‌లను నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనూ సాయిచరణ్ ను డ్రగ్స్ కేసులో  డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దాదాపు  50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా నెల్లూరు, విజయవాడ,  రాజమండ్రి, వైజాగ్‌లో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. రాజేశ్వరి ట్రావెల్స్ , జీవీఆర్, స్టార్ట్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా సాయిచరణ్​ డ్రగ్స్ రవాణా చేస్తు్న్నాడని పోలీసులు వివరించారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అహ్మదాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
అటు అహ్మదాబాద్ లోనూ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేపట్టిన యాంటీ డ్రగ్ ఆపరేషన్ లో భాగంగా చేసిన తనిఖీల్లో రూ.3.5కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2023 - 24కు సంబంధించి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.3,500 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల్లో డ్రగ్స్, బంగారం వాటా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే థానే పోలీసులు 25 ఏళ్ల నైజీరియన్ మహిళ నుండి సుమారు రూ. 5.6 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు.  గురువారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి 56.3 గ్రాముల ఎండీ క్రిస్టల్ స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 5.6లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.  

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget