అన్వేషించండి

Crime News: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రగ్స్ కలకలం, వ్యాపారవేత్తలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Hyderabad News : బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తరలిస్తున్న సాయి చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Telangana Crime news: ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. పోలీసులు డ్రగ్స్ కట్టడికి ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నా  కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాల్లో నగరానికి తీసుకొస్తూనే ఉన్నారు.  పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా వ్యాపారస్తులను అంటగడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తరలిస్తున్న సాయి చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ని చిన్న చిన్న ప్యాకెట్లలోకి మార్చి  ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా సాయి చరణ్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.   

నిందితుడు అరెస్ట్
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు  వ్యాపారవేత్తలతో పాటు ప్రధాన నిందితుడు సాయిచరణ్‌ను పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం‌లను నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనూ సాయిచరణ్ ను డ్రగ్స్ కేసులో  డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దాదాపు  50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా నెల్లూరు, విజయవాడ,  రాజమండ్రి, వైజాగ్‌లో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. రాజేశ్వరి ట్రావెల్స్ , జీవీఆర్, స్టార్ట్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా సాయిచరణ్​ డ్రగ్స్ రవాణా చేస్తు్న్నాడని పోలీసులు వివరించారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అహ్మదాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
అటు అహ్మదాబాద్ లోనూ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేపట్టిన యాంటీ డ్రగ్ ఆపరేషన్ లో భాగంగా చేసిన తనిఖీల్లో రూ.3.5కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2023 - 24కు సంబంధించి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.3,500 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల్లో డ్రగ్స్, బంగారం వాటా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే థానే పోలీసులు 25 ఏళ్ల నైజీరియన్ మహిళ నుండి సుమారు రూ. 5.6 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు.  గురువారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి 56.3 గ్రాముల ఎండీ క్రిస్టల్ స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 5.6లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

వేట్లపాలెం పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేట్లపాలెం పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Embed widget