అన్వేషించండి

Krishna District News: బడికి సమీపంలో ఇళ్లు అద్దెకు తీసుకుని గంజాయి స్మగ్లింగ్

Krishna District News: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. పోలీసులు నిత్యం స్మగ్లర్లను అరెస్ట్ చేస్తున్నా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడడం లేదు.

Krishna District News: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి రవాణాకు ఏపీ కేంద్రంగా మారుతోంది. స్మగ్లర్లు పెద్ద ఎత్తు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పోలీసులు నిత్యం స్మగ్లర్లను అరెస్ట్ చేస్తున్నా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడడం లేదు. రెండు రోజుల్లో సుళ్లూరుపేట, కోదాడలో గంజాయి పట్టుబడగా, గురువారం కృష్ణా జిల్లాలో గంజాయి తరలిస్తున్న  ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో  సెయింట్ జాన్స్ పాఠశాల సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠాను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు.

 మొత్తం నలుగురు సభ్యులు ఉన్న ముఠాలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు స్మగ్లర్లు పారిపోయారు. కారులో 100 కిలోల గంజాయిని ఉన్నట్లు సమాచారం. ఒడిశా నుంచి నుంచి గుజరాత్‌కి తరలిస్తూ గంజాయి ముఠా పోలీసులకు పట్టుబడింది. గంజాయి తరలించే స్మగ్లర్లు గుజరాత్ కు చెందిన వారిగా గుర్తించారు. వీరు కొంతకాలంగా సెయింట్ జాన్స్ స్కూల్ సమీపంలో ఓ ఇంటిని బాడుగ తీసుకుని ఒడిశా నుంచి ఏపీ మీదుగా గుజరాత్‌కు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కారు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

రాజవొమ్మంగి స్టేషన్ పరిధిలో..
రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీసుస్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జడ్డంగి ఎస్ఐ తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఒక ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను గురువారం రిమాండ్ నిమిత్తం అడ్డతీగల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు హాజరు పరిచారు.

తిరుపతిలో..
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సూళ్లూరుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ సూర్యనారాయణ కథనం.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రం, మల్కాన్‌గిరి జిల్లా, బరియబహల్‌ ప్రాంతానికి చెదిన మందన్‌ మంతల్‌(27), అదే జిల్లా టింగాలిగూడ గ్రామానికి చెదిన బలరాం గౌడ్‌ (18) అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులు ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయిని సరఫరా చేసేందుకు సూళ్లూరుపేటకు చేరుకున్నామని ఒప్పుకున్నారు. ఆపై వారి వద్ద ఉన్న 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

కోదాడలో 70 కేజీల పట్టివేత
రాష్ట్ర సరిహదు కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రామాపురం క్రాస్‌ రోడ్డు చెక్‌పోస్టు వద్ద నిందితులు సినీ ఫక్కీలో పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 70కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఓ కారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తోంది. బుధవారం రాత్రి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేయడాన్ని కారులో ఉన్న నలుగురు నిందితులు గమనించి కారు వేగాన్ని పెంచి మరో రోడ్డులో తప్పించుకునే యత్నం చేశారు. సమీపంలో ఉన్న ఆటోను ఢీకొట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా 70 కిలోల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget