అన్వేషించండి

Kothapeta News : కన్ను పడితే కనకమంతా మాయం, తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

Kothapeta News :పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దొంగల ముఠాను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 172 గ్రాముల బంగారం స్వాధీనం చేస్తున్నారు.

Kothapeta News : చెడు వ్యాసనాలకు బానిసలైన కొందరు ఈజీ మనీ కోసం దొంగతనాలు బాట పడుతున్నారు. ఈ క్రమంలో బంగారం, నగదునే టార్గెట్ చేసుకుని రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి  చొరబడుతూ ఇంట్లో దాచుకున్న బంగారాన్ని కొట్టేస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించారు కొత్తపేట పోలీసులు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జరిగిన పలు దొంగతనం కేసులపై దృష్టి సారించారు పోలీసులు. ఈ కేసుల దర్యాప్తులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ మంగళవారం వెల్లడించారు. దొంగల నుంచి రూ.8,29,200 విలువ చేసే 172 గ్రాముల బంగారం, రూ. 4,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  

తాళం వేసిన ఇళ్లే టార్గెట్ 

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేయడం, ఒంటరిగా వెళ్తోన్న మహిళలే లక్ష్యంగా  బంగారం దొంగిలించడం వీరికి పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా దొంగతనాలు మొదలుపెట్టారు.  కొత్తపేటలో జరిగిన ఓ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వీరి గురించి  ఆధారాలు లభించాయి. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు వీరి ఆగడాలు తెలిసొచ్చింది. దీంతో వీరి కదలికలపై నిఘా ఉంచిన క్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముక్కామలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న  నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నమోదైన కేసులపై నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. కొత్తపేటలో నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టిన పోలీసులు మరిన్ని కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపారు.

కళ్లలో కారం కొట్టి దొంగతనాలు 

ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని అక్కడ పని చేస్తున్న వారిని ఫాలో అవుతూ వారి కదలికలపై దృష్టి సారించి 'భయ్యా అంటూ పిలిచి వారు తేరుకునేలోపే కళ్లలో కారం కొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఇరానీ గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నెల (నవంబర్) 22న రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని కృష్ణా జ్యువెలర్స్ యజమాని అంకిత్ అగర్వాల నివాసం వద్ద అక్కడ పని చేస్తున్న ఉద్యోగి కళ్లల్లో కారం కొట్టి బ్యాగుతో ఉడాయించారు. ఇదే గ్యాంగ్ ఈ నెల 24న రాత్రి నారాయణగూడలో డివినిటి ఆభరణాల షాపు నుంచి వెళ్తున్న ఉద్యోగిని సైతం కళ్లల్లో కారం కొట్టి 25 తులాల బంగారు నగలున్న బ్యాగుతో ఉడాయించారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోగా అటు నారాయణగూడ క్రైం పోలీసులకు, ఇటు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు ఈ ముఠాను పట్టుకోవడం సవాల్‌గా మారింది. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ గత మూడు రోజుల నుంచి సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ ముఠా స్నాచింగ్లకు పాల్పడుతున్న తీరు, వీరి కదలికల ఆధా రంగా నిందితులు మహారాష్ట్రకు చెందిన ఇరానీ గ్యాంగ్ గుర్తించారు. గతంలోనూ వీరు స్నాచింగ్ చేసిన పద్ధతులను కూడా పరిశీలించారు. నెంబర్ ప్లేట్ లేని బైక్పై మంకీ క్యాపులు ధరించిన ఇద్దరు యువకులు ఈ చోరీలకు పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు.  

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం బ్యాగులో 25 తులాల బంగారు ఆభరణాలు ఉండగా బాధితుడు జితేంద్ర శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రధాన రహదారుల్లో సీసీ పుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ గ్యాంగ్ ఎక్కడా క్షణం కూడా నిలబడకుం డా దూసుకుపోతున్నట్లు తేలింది. ఇంకోవైపు మంకీ క్యాంప్ ధరించడంతో ముఖ ఆనవాళ్లు గుర్తించలేకపోతున్నారు. బైక్ నెం బర్ ప్లేట్లు కూడా తొలగించడంతో కేసు దర్యాప్తు జఠిలంగా మారిందని ఓ అధికారి తెలిపారు. అయితే పాత నేరస్తుల కద లికలపై దృష్టి పెట్టిన పోలీసులు మరో రెండు, మూడు రోజుల్లో ఈ గ్యాంగ్ను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget