అన్వేషించండి

Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి

Pithapuram News : కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కాపురానికి పంపడంలేదని అత్తను అల్లుడు కత్తితో నరికి చంపాడు.

Pithapuram News : కాకినాడ పిఠాపురం విద్యుత్ నగర్ లో దారుణ హత్య జరిగింది. అత్తపై అల్లుడు సైతన రమేష్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అత్త గండేపల్లి రమణమ్మ(46) అక్కడికక్కడే మృతి చెందింది. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రమణమ్మ భర్త సత్యన్నారాయణ, కొడుకు దిలీప్ కు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత ఆరునెలలుగా భార్య దివ్యను కాపురానికి పంపలేదని అక్కసుతో ఉదయాన్నే ఇంటి బయట కాపు కాసిన రమేష్ కత్తితో అత్తపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అతడి భార్య దివ్య ఉద్యోగం నిమిత్తం గత రాత్రే హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. హత్య చేసి నేరుగా  పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడు రమేష్  లొంగిపోయాడు. 

Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి

(రక్తపు మడుగులో అత్త, బావమరిది)

ప్రేమ వ్యవహారంతో 

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణ ఘటన జరిగింది. చింటూ అనే విద్యార్థిపై రోహన్‌ అనే మరో విద్యార్థి కత్తితో దాడి చేశాడు. చింటూకు రక్తం కారుతుంటే రోహన్‌ సెల్ఫీ దిగాడు. ప్రేమ వ్యవహారమే ఇద్దరి మధ్య గొడవకు కారణంగా తెలుస్తోంది. రోహన్‌, అతని స్నేహితులు చింటూను బైక్‌ ఎక్కించుకొని మంగవారం రాజేంద్రనగర్‌లోని మూసీనది వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత చింటూని కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీచేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

రూపాన్ని ఎగతాళి చేశాడని 

ఈ ఘటన పిల్లల మానసిక పరిస్థితికి అద్ధం పడుతోంది.  తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో శనివారం జరిగి ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  తన రూపాన్ని ఎగతాళి చేస్తూ ఏడిపిస్తున్నారనే కారణంతో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థిని హత్య చేశాడు. 12వ క్లాస్ చదువుతున్న విద్యార్థిని ఆడపిల్ల అని బాధితుడు పిలిచేవాడు. అలా పిలవొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో చివరికి అతడిని హత్య చేశాడు. రూపాన్ని అవమానించేలా బాధిత విద్యార్థి మాట్లాడేవాడని పోలీసులు తెలిపారు. పార్టీ ఇస్తానని చెప్పి కొడవలి, కత్తిని ఉపయోగించి తోటి విద్యార్థిని హత్య చేశాడని వివరించారు. స్కూల్ కు దగ్గర్లోని హైవేపై ఈ హత్య జరిగిందని తెలిపారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామన్నారు. మైనర్ కావడంతో అబ్జర్వేషన్ హోంకు పంపించామన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. 

విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు

తమిళనాడు స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ డాక్టర్ శరణ్య ఈ ఘటనపై స్పందించారు. భౌతిక రూపాన్ని ఎగతాళి చేయడంతో విద్యార్థి కోపం పెంచుకుని, ఒత్తికి లోనై దాడికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. కోపం, ఒత్తిడి పెరిగి డిస్‌మోర్ఫిక్ అనే మానసిక వ్యాధికి దారితీసిందన్నారు. తన రూపం గురించి ఆలోచించడం కూడా ఈ వ్యాధి లక్షణమన్నారు. అది తీవ్ర కోపం లేదా ఒత్తిడిగా మారిపోయాయన్నారు. ఈ ఘటన విద్యార్థుల ప్రవర్తనలో మార్పును గుర్తుచేస్తుంది. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. తరగతి గదుల్లో ఉపాధ్యాయులను టార్గెట్ చేయడం, ధూమపానం, మద్యపానానికి సంబంధించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు విద్యార్థులు సామాజిక ప్రవర్తనకు దూరంగా ఉండడం ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Embed widget