అన్వేషించండి

Credit Card Cyber Crime : క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని కాల్స్, ఓటీపీ చెబితే షాకింగ్ మేసెజ్!

Credit Card Cyber Crime : సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలు షురూ చేశారు. క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

Credit Card Cyber Crime : మీ క్రెడిట్‌ కార్డు ట్రాక్‌ చాలా బాగుంది. క్రెడిట్‌ లిమిట్ ఇంకా పెంచాలనుకుంటున్నాం. మీ డీటైల్స్‌ ఒక సారి చెక్‌చేసుకోండి అంటూ ఓ ఫోన్‌ వస్తుంది. మన వివరాలన్నీ మనం చెప్పకుండానే పేరు, బ్యాంకు, క్రెడిట్‌ కార్డు ద్వారా చేసిన ట్రాన్జక్షన్స్‌ వివరాలు అన్నీ అనర్గళంగా చెబుతారు. ఆఖరికి ఈనెలలో మీరు వినియోగించిన క్రెడిట్‌ను నిర్ణీత సమయంలో రికవరీ చెల్లించాలని సూచించి మీ సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్యూ అంటూ ముగిస్తారు. మళ్లీ మరుసటిరోజు లేక మరో రెండు రోజులు గడిచాక మళ్లీ ట్రూకాలర్‌లో బ్యాంక్‌ నుంచి వచ్చినట్లు మరో కాల్‌ వస్తుంది. మీరు చెల్లించాల్సిన క్రెడిట్‌ కార్డు రికవరీ వీలైనంత త్వరగా చెల్లించేయండి. ఎందుకుంటే మీకు ఈనెల నుంచి క్రెడిట్‌ లిమిట్ పెరగబోతుందని బిల్డప్‌ ఇస్తారు. 

క్రెడిట్ కార్డు అమౌంట్ రేంజ్ పేరిట మోసం 

ఒక వేళ మీరు అప్పటికీ క్రెడిట్‌ కార్డు రికవరీ చెల్లించకపోతే త్వరగా చెల్లించాలని, లేకపోతే సిబిల్‌ స్కోర్‌ తగ్గి క్రెడిట్‌ కార్డు రేంజ్‌ పెరగదని హెచ్చరిస్తారు సైబర్ కేటుగాళ్లు. ఒక వేళ రికవరీ చెల్లించినట్లయితే మీరు సకాలంలో రికవరీ చెల్లించినందుకు ధన్యవాదాలు చెపుతూ ప్రారంభిస్తారు. మీ క్రిడిట్‌ కార్డు రేంజ్‌ అదనంగా మరో 50 వేల రూపాయలు యాడ్‌ అవుతుందని, దానికి కొన్ని డీటెయిల్స్‌ చెప్పాలని సూచిస్తారు. ఇంతకీ గత నాలుగు రోజులుగా మనల్ని ఫాలోఅప్‌ చేస్తున్న వ్యక్తి అవ్వడంతో మనం వెంటనే నమ్మి అడిగిన అన్ని ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెబుతాం. చివరిగా మీ కార్డులో అమౌంట్‌ ఇంక్రీజ్‌ అయ్యేందుకు మీ మొబైల్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. ఆందులో నెంబర్‌ చెప్పాలంటూ సూచిస్తారు. అప్పటికే అన్ని వివరాలు చెబుతూ వచ్చిన మనం వెంటనే ఆ మెసేజ్‌లో ఉన్న నెంబర్‌ను చెబుతాం. అంతలోనే మన మొబైల్‌కు మరో మెసేజ్‌ వస్తుంది. ఇంకేముంది మన క్రెడిట్‌ కార్డులో ఉన్న 50 వేలు కట్ అయినట్లు. అంతలోనే మనతో అప్పటి వరకు చాలా హుందాగా మాట్లాడిన వ్యక్తి కూడా కాల్‌ కట్‌ చేస్తాడు. తిరిగి చేద్దామంటే ఆ కాల్‌ కనెక్ట్‌ అవ్వదు. లబోదిబో మనడం తప్ప మనం చేసేదేం ఉండదు. ఇలా కొత్త మార్గాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. 

సైబర్ నేరగాళ్ల నయా మోసం 

ఇప్పుడు క్రెడిట్‌ కార్డుల ద్వారా సైబర్‌ నేరగాళ్లు చేస్తున్న నయా మోసం ఇది. మనకు క్రెడిట్‌ కార్డు ఉందన్న సంగతి ఇంట్లో వాళ్లకే తెలియదు కానీ ఈ సైబర్‌ నేరగాళ్లకు మాత్రం క్రెడిట్‌ కార్డు వివరాలు, మన అడ్రస్‌, ఆధార్‌ నెంబర్‌తో సహా తెలుస్తుంది. వారికి కావాల్సిందల్లా మన మొబైల్‌తో లింక్‌ అవ్వడం వల్ల అయిదంకెల ఓటీపీ మాత్రమే. సైబర్‌ కేటుగాళ్లు వేసిన వలలో మనం పడి ఓటీపీ చెప్పామంటే ఒక్క క్షణంలో మన క్రెడిట్‌ కార్డు నుంచి నగదు కట్ అవుతుంది. కొన్ని రోజులుగా ఈ తరహా మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. కాకినాడకు చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తి ఈ తరహాలోనే మోసపోయాడు. వారం రోజులుగా తనను ఫాలో అప్‌ చేస్తుండడంతో సైబర్‌ నేరగాడి వలలో ఈజీగా పడిపోయాడు.  వారం రోజులుగా తనను ఫాలోఅప్‌ చేస్తున్న వ్యక్తే కదా అని సైబర్‌ నేరగాడు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అదే మాయలో పడి ఓటీపీ చెప్పాడు. లబోదిబో అంటూ కాకినాడ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు వచ్చిన ఫోన్‌ కాల్‌ నెట్‌ ఆధారంగా వచ్చిందని, అదే ఐపీ నెంబరుపై హైదరాబాద్‌లో మరికొన్ని కేసులు నమోదయ్యి ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాధితుని క్రెడిట్‌ కార్డు ద్వారా సైబర్‌ నేరగాడు వేరే రాష్ట్రంలో బంగారం కొనుగోలు చేసినట్లు కొంత వరకు ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఈ తరహా కేసులు అంత త్వరగా తేలే పరిస్థితి ఉండదని పోలీసులు చెబుతున్నారు. 

అపరచిత ఫోన్‌కాల్స్‌పై జాగ్రత్త 

అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్లు చేసి వివరాలు అడిగితే చెప్పవద్దని, అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. క్రెడిట్‌ కార్డుల ద్వారా ఈ తరహా మోసాలు ఎక్కువవుతుండడంతో కేవలం బ్యాంకుల ద్వారా వచ్చే కాల్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని స్పందించాలని, ఇలాంటి కాల్స్‌ను అటెమ్ట్‌ చేయకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి వీటిని ఆపరేట్‌ చేస్తున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు. నెట్‌ ఆధారంగా ఫోన్‌ కాల్స్‌చేస్తారని, అటువంటి కాల్స్‌ను వినియోదారులు అవైడ్‌ చేయాలని సూచిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల మన డీటెయిల్స్‌ అన్నీ చాలా సునాయాసంగా చెప్పగలరని, అయినా మనం ఏమాత్రం వారి మాయలో పడకుండా మొబైల్‌కు వచ్చే మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేయడం కానీ అందులో సమాచారాన్ని చెప్పడం కానీ చేయకుండా అప్రమత్తంగా సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget