Hyderabad Drug Tests: హైదరాబాద్లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
Anti Drug Operation In Hyderabad | హైదరాబాద్లో డ్రగ్స్ టెస్టులు నిర్వహించిన రౌడీషీటర్లలో 75 శాతం మందికి పాజిటివ్ గా తేలడాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రెగ్యూలర్ గా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు ఒక భారీ ఆపరేషన్ చేపట్టారు. సిటీ వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, వారిలో డ్రగ్స్ అలవాట్లు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీలు నగరంలోని నేరస్తులకు వణుకు పుట్టిస్తున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం మొత్తం మీద సుమారు 1300 మంది రౌడీ షీటర్లను గుర్తించారు. వీరిలో ప్రాథమిక దశలో 250 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ పరీక్షలు జరిపిన 250 మందిలో ఏకంగా 190 మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలడం కలకలం రేపుతోంది. అంటే దాదాపు 75 శాతం మంది రౌడీ షీటర్లు మత్తు పదార్థాలకు బానిసలయ్యారని స్పష్టమైంది.
వీరిలో అత్యధిక శాతం మంది గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్లు మత్తులో ఉండి తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుండి సరఫరా అవుతోంది? దీని వెనుక ఉన్న ప్రధాన నెట్వర్క్ ఏమిటి? వీరు డ్రగ్స్, గంజాయి ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Before You Go
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
ట్రెండింగ్ వార్తలు






















