అన్వేషించండి

Murder: మనవడి చేతిలో హత్యకు గురైన పారిశ్రామికవేత్త.. 73సార్లు పొడిచి చంపిన నిందితుడు

Crime News: ఆస్తి కోసం సొంత తాతనే కత్తితో పొడిచి పొడిచి చంపిన మనవడు. హైదారాబాద్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త,వెల్జాన్ గ్రూప్ అధినేత మృతి

Murder: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు పెద్దలు.. సమాజంలో పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఆస్తి తగదాలతో ప్రముఖ పారిశ్రామికవేత్త(Industrialist), వెల్జాన్(Veljan) గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్‌రావును  ఆయన సొంత మనవడే  కత్తితో పొడిచి అతి దారుణంగా హతమార్చాడు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త దారుణహత్య
ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటిచంద్రశేఖర్‌ జనార్ధన్‌రావు( వీసీ) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌(Hyderabad)లోని సోమాజిగూడలో ఆయన నివాసంలో కుమార్తె కుమారుడు కీర్తితేజ కత్తితో  ఆయన 73 సార్లు పొడిచి చంపాడు. అడ్డుకోబోయిన కుమార్తె పైనా దాడి చేశాడు. ఈఘటనలో  చంద్రశేఖర  జనార్దన్‌రావు(VC) అక్కడికక్కడే మృతిచెందగా...ఆయన కుమార్తె  తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. 
 
కష్టపడి ఎదిగి …
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru) ప్రాంతానికి చెందిన వెలమాటి చంద్రశేఖర్ జనార్దనరావు  కష్టపడి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. వివిధ సంస్థలు స్థాపించారు. వెల్జాన్ (Veljan)గ్రూప్ పేరిట మోటార్లు,హైడ్రాలిక్‌ పంపులు, ప్రెషర్‌ పంపులు తయారీరంగంలో దాదాపు 55 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన కోట్లాది రూపాయలు సంపాదించారు. ఎన్నో దాతృత్వ సేవల ద్వారా గుర్తింపు పొందిన వీసీ...తన సంపాదనలో ఎక్కువ భాగం దానదర్మాలు చేసేవారు. తన పుట్టిన ప్రాంతమైన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి  పలు దఫాలుగా  రూ.40 కోట్లు విరాళంగా అందజేశారు.అలాగే తిరుమల తిరుపతి(TTD) దేవస్థానానికి సైతం మరో రూ.40 కోట్లు ఇచ్చారు. ఏపీ,తెలంగాణలో పలు స్వచ్ఛంద సంస్థలకు సైతం భారీగా విరాళాలు  అందజేశారు. జీవిత చరమాంకంలోకి చేరిన ఆయన తన సంస్థ బాధ్యతలను వారసులకు అప్పగించి విశ్రాంతి తీసుకుందామనుకున్న క్రమంలో ఆస్తి తగాదాలు తలెత్తాయి. ఇటీవల పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణ(Sri Krishna)ను  వెల్జాన్ సంస్థకు డైరెక్టర్‌గా నియమించారు. అలాగే మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడు కిలారు కీర్తితేజ(Keerthi Teja)కు రూ.4 కోట్ల విలువైన  షేర్లను బదిలీ చేశారు. దీంతో చిన్న కుమార్తె, మనుమడు కొన్నిరోజులుగా  గొడవపడుతున్నారు.  ఆస్తిని సమానంగా పంచాలని కోరుతున్నారు.  ఈక్రమంలోనే గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడు   కీర్తితేజతో కలిసి తండ్రి వద్దకు వచ్చింది. ఆస్తి విషయమై మరోసారి వారిరువురు చంద్రశేఖర జనార్దనరావుతో గొడవపడ్డారు. తాతతో మనవడు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలో తండ్రికి టీ తెచ్చేందుకు  సరోజనీదేవి  ఇంట్లోకి వెళ్లగా అదే అదునుగా  కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న  పదునైన కత్తితో తాతను  తాతను 73 సార్లు పొడిచాడు. అరుపులు, కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుడిని అడ్డుకుంది. ఆమెపైనా కత్తితో దాడి చేసి నాలుగుచోట్ల పొడిచాడు. పనివాళ్లు అడ్డుకోబోగా వారినీ చంపేస్తానని బెదిరించి  అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన ఇరువురిని ఆస్పత్రికి తరలించగా...జనార్దన్‌రావు అప్పటికే  మృతిచెందగా సరోజనీదేవి జూబ్లీహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హంతకుడు కీర్తితేజ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మత్తులో ఉండబట్టే విచక్షణ కోల్పోయి తాత,తల్లిపై దాడి చేసిఉంటాడని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన సరోజనీదేవి కోలుకుంటున్నారు. త్వరలోనే   నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget