By: ABP Desam | Updated at : 22 May 2023 05:50 PM (IST)
Edited By: Pavan
మణిపూర్లో మరోసారి హింస, ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
Manipur Violence:
గత నెల భగ్గుమన్న మణిపూర్.. భద్రతా బలగాల మోహరింపు, పెట్రోలింగ్ వంటి చర్యలతో శాంతించగా.. ఇప్పుడు మరోసారి హింస చెలరేగింది. ఓ స్థలం విషయంలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇంఫాల్ లోని న్యూ చెకాన్ ప్రాంతంలో పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దాంతో వెంటనే సర్కారు భద్రతా బలగాలను మోహరించి మంటలు అంటుకున్న ఇళ్లల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు మొదలుపెట్టింది. ఈ హింస ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కర్ఫ్యూ విధించింది. ఉన్నపళంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు.. ఆర్మీ, అసోం రైఫిల్స్, మణిపూర్ పోలీసు బలగాలను మోహరించారు. అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే, ఆయన భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇంఫాల్ ఈస్ట్ లోని న్యూ చెకాన్లో ఓ తెగకు చెందిన వారి దుకాణాలు మూసివేయాలని ఓ వ్యక్తి బెదిరించాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ఇళ్లకు నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ హింసలో ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని స్థానిక అధికారులు తెలిపారు. మరోసారి హింసాత్మక ఘటన నేపథ్యంలో జనం ఒక్కచోటుకు చేరకుండా పోలీసులను, సైన్యాన్ని మోహరించారు.
Another Church Targeted and Burnt Down by Meitei Mobs.
Devastating scenes of ICI Church at Chassad Avenue, Imphal engulfed in flames, a testament to the utter incompetence of our state administration. The people entrusted to protect us have failed miserably, leaving us to face… pic.twitter.com/agI3P4Hnp3— KSO Delhi & NCR (@KSODelhi) May 22, 2023
మణిపూర్ లో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు మూలం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి తెగల మధ్య నెలకొన్న వైరమే. రాష్ట్రంలో మెజారిటీ మెయిటీలకు ఎస్టీ హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజనులు ఆందోళనలు చేపట్టారు. గిరిజనులు నిర్వహించిన సంఘీభావయాత్ర కాస్త హింసాత్మకంగా మారింది. కొన్ని రోజుల పాటు మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. ఈ ఘటనల్లో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులను, సైన్యాన్ని మోహరించి పరిస్థితులను శాంతింపజేసినా.. తాజాగా జరిగిన ఘటనతో మరోసారి హింస చెలరేగే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గత నెలలో జరిగిన అల్లర్లకు మణిపూర్ లో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్ పుర్ కేంద్ర బిందువుగా ఉంది. కొద్దిరోజుల క్రితం సీఎం బీరేన్ సింగ్ పాల్గొనాల్సిన సభా వేదికను ఆ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరిగిన హింస ఇంఫాల్ లో చోటుచేసుకుంది.
#WATCH | Abandoned houses set ablaze by miscreants in New Lambulane area in Imphal in Manipur. Security personnel on the spot. pic.twitter.com/zENI5nuMyM
— ANI (@ANI) May 22, 2023
Also Read: BMW Accident: మందులు కొనుక్కుని వెళ్తుండగా ఢీ కొట్టిన BMW,ఆసుపత్రికి తరలించే లోపే మృతి
Hyderabad News: హైదరాబాద్లోని ఓ పబ్ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు - యజమాని అరెస్టు
Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్
రూమ్ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్ కేసు ఛేదించిన పోలీసులు
Jammu Bus Accident: జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు లోయలో పడి 10 మంది మృతి
Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్లోనే చిన్నారి మృతి
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?