అన్వేషించండి

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

అడ్డదారిలో డబ్బును రెట్టింపు చేసుకోవాలనుకునే ప్రయత్నం బెడిసికొట్టింది. రూ.2000 నోట్లు రద్దును అవకాశంగా చేసుకున్న కేటుగాళ్లు పోలీసుల్లా వచ్చి నోట్ల మార్పిడి కోసం తెచ్చిన అసలు నోట్లను ఎత్తుకెళ్ళారు.

- నోట్లు మారుస్తానని వ్యాపారిని నమ్మించి మోసం 
- రూ.500 నోట్లు ఇస్తే ఎక్కువ విలువైన రూ.2 వేల నోట్లకు డీల్
- పోలీసుల వేషంలో వచ్చి సినిమా సీన్ తరహాలో దోపిడీ

అత్యాశ అభాసుపాలు చేస్తుందంటారు. దురాశ దుఖం కలిగిస్తుందంటారు. అయితే ఓ వ్యాపారి అత్యాశకు పోయి ఏకంగా అరకోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. అడ్డదారిని ఆశ్రయించి తన డబ్బును రెట్టింపు చేసుకోవాలనుకునే ప్రయత్నం బెడిసికొట్టగా అసలు డబ్బుకే ఎసరు పెట్టినట్లయింది కథ. రూ.2000 నోట్లు రద్దును అవకాశంగా చేసుకున్న కేటుగాళ్లు పోలీసుల్లా వచ్చి నోట్ల మార్పిడి కోసం తెచ్చిన అసలు నోట్లను ఎత్తుకెళ్లారు. విషయం గమనించి లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యాపారి. తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న నోట్ల మార్పిడి మోసం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగిందంటే..
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన మాజేటి లక్ష్మీనారాయణ అనే వ్యాపారికి రూ.50 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే దానికి ప్రతిగా ఇటీవల రద్దు అయిన రూ.2000 నోట్లు రూ.60 లక్షలు ఇస్తారని తనకు తెలిసిన వ్యక్తి చెప్పాడు. దీంతో ఆశపడిన ఆ వ్యాపారి నాలుగు రోజుల క్రితం రూ.50 లక్షల విలువైన రూ.500 నోట్లును తీసుకుని రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్దకు వెళ్లాడు. అక్కడ అప్పటికే ఎదురు చూస్తున్న ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండగా పోలీసు సైరన్‌ వేసుకుంటూ ఓ వాహనంలో నలుగురు వ్యక్తులు వచ్చి బెదిరించి వ్యాపారి వద్దనున్న రూ.50 లక్షల బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు.  దీంతో బిత్తరపోయిన వ్యాపారి ఏం చేయాలో పాలుపోని స్థితిలో రాజానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

యూట్యూబ్‌ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేస్తే చాలంటూ మోసం..
సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అత్యాశలు గురిచేసి ఆపై ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. యూట్యూబ్‌ ఛానెల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసి కొంత మేర పెట్టుబడి పెడితే 30 శాతం కమీషన్‌ ఇస్తామంటూ ఓ ఉద్యోగిని నమ్మించి రూ.35 లక్షలకు పైగా టోకరా వేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో చోటుచేసుకుంది. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధవళేశ్వరంలోని లక్ష్మీనరసింహ నగర్‌కు చెందిన పల్నాటి శ్రీహరి రైల్వేలో పనిచేస్తున్నాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ సబ్‌స్క్రైబ్‌ చేయాలని గతనెల 14న బాధితునికి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది.. సబ్‌స్క్రైబ్‌ చేసిన తరువాత రూ.5 వేలు జమ చేస్తే అసలుతోపాటు 30 శాతం కమీషన్‌ వస్తుందని నమ్మబలికారు. వారు చెప్పిన విధంగానే ముందు రూ.5,000 వారు చెప్పిన ఎకౌంట్‌కు జమచేశాడు. అతని అకౌంట్‌లోకి రూ.6,500 తిరిగి వేశారు. ఇది నమ్మిన శ్రీహరి అనేక సార్లు దఫదఫాలుగా డబ్బులు జమచేయసాగాడు. వారు చెప్పిన విధంగానే తిరిగి డబ్బులు రావడంతో మరింత నమ్మకం కుదిరింది. దీంతో మరింత ఎక్కువ డబ్బు జమచేయడం ప్రారంభించిన శ్రీహరి పలు దఫాలుగా రూ.35,23,440 వరకు జమచేశాడు. పెద్దమొత్తంలో డబ్బు జమ చేసిన తరువాత వారి నుంచి ఎటువంటి సొమ్ము తిరిగి రాకపోవడంతో వారిని సంప్రదించాలని ప్రయత్నిస్తే వారినుంచి ఎటువంటి రెస్పాన్స్‌ రాకపోగా ఫోన్‌ పనిచేయడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు బాధితులు ధవళేశ్వరం పోలీసులను ఆశ్రయించాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget