Drishyam style murder: భర్తను చంపేసి కిచెన్లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?
Ahmedabad: అహ్మదాబాద్ లో ఓ మహిళ భర్తను చంపేసి కిచెన్ లో పాతి పెట్టింది. ఊరంతా వెదికిన పోలీసులుక చిన్న క్లూ ద్వారా కనిపెట్టారు.

Drishyam style murder in Ahmedabad: హత్య చేసి ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టే కథనంతో వచ్చిన 'దృశ్యం' సినిమాలోని కథ తరహాలోనే ఓ హత్య అహ్మదాబాద్ లో జరిగింది. భర్తను చంపి, శవాన్ని కిచెన్ లో పూడ్చి పెట్టిందోభార్య. గుజరాత్లోని అహ్మదాబాద్లోని మెగానీ ప్రాంతంలో ఈ హత్య ఘటన జరిగింది.
మద్యానికి బానిసై హింసిస్తున్నాడని భర్త హత్య
32 ఏళ్ల మహిళ .. 35 ఏళ్ల భర్త రాజ్ పటేల్ను అక్టోబర్ 25న చంపి, శవాన్ని కిచెన్ను తవ్వేసి.. అక్కడే పాతి పెట్టింది. రాజ్ దంపతుల మధ్య కొంత కాలంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రాజ్ చెడు అలవాట్లకు బానిసగా మారడం ఆస్తులన్నీ తగలేస్తున్నాడన్న కారణంతో భార్య ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. రాజ్, ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేసేవాడు, తన ఆదాయాన్ని మద్యానికి ఖర్చు చేసేవాడని భార్య ఆరోపిస్తోంది. అక్టోబర్ 25 రాత్రి, ఇద్దరూ తీవ్రంగా వాదించుకున్నారు. ఆవేశనంలో కృష్ణా భర్తను గొడ్డలితో నరికి చంపేసిందది. "అతను నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు, స్వరక్షణ కోసం చేశాను" అని ఆమె పోలీసులకు చెప్పుకొచ్చింది.
కిచెన్ లో టైల్స్ తీసి గొయ్యి తవ్వి పాతి పెట్టిన మహిళ
హత్య తర్వాత ఆమె శవాన్ని మాయం చేయాలనుకుంది. బయటకు తీసుకెళ్లలేదు కాబట్టి.. దృశ్యం సినిమాను గుర్తు చేసుకుంది. ఆమె మొదట శవాన్ని ముక్కలుగా కట్ చేసి తలా ఓ చోట పడేయాలనుకుంది.కానీ భయంతో ఆ పని చేయలేకపోయింది. తర్వాత కిచెన్ లోనే పాతి పెట్టాలని నిర్ణయించింది. కిచెన్లోని ఫ్లోరింగ్ టైల్స్ను తొలగించి అక్కడ తవ్వింది. శవాన్ని మట్టిలో దాచి, మళ్లీ టైల్స్ను పెట్టేసింది. దీనికి ఆమె స్నేహితురాలు లక్ష్మీ (30) సహాయం చేసింది. ఇద్దరూ కలిసి శవాన్ని కవర్ చేసి, ఫ్యామిలీకి "రాజ్ ఊరు వద్దకు వెళ్లాడు" అని చెప్పారు.
పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సమయంలో తడబాటు - దొరికిపోయిన మహిళ
రాజ్ మిస్సింగ్ కేసు నమోదైన అక్టోబర్ 28నుంచి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మొదట్లో భార్య "అతను అప్పుల పాలై పారిపోయాడు" అని చెప్పింది. కానీ సందేహాస్పదంగా ఉండటంతో, పోలీసులు ఇంటి చుట్టూ సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ లొకేషన్లు పరిశీలించారు. రాజ్ ఫోన్ లాస్ట్ సిగ్నల్ ఇంటి సమీపంలోనే ఉండటం గమనించారు. నవంబర్ 4న, కృష్ణా , లక్ష్మీలపై ప్రశ్నిస్తూంటే ఆమె మానసిక ఒత్తిడికి గురై నిజం చెప్పేశారు. పోలీసులు వెంటనే ఇంటిని సెర్చ్ చేసి, కిచెన్ ఫ్లోరింగ్ను తొలగించి చూశారు. . అక్కడ శవం దొరికింది. ఫోరెన్సిక్ టీమ్ పరీక్షలో, మరణానికి గొడ్డలతో నరకడం కారణమని నిర్ధారణ అయింది.
నిందతుల్ని రిమాండ్కు పంపించారు. దంపతులకు ఒక 8 ఏళ్ల చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతని కస్టడీ కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలైంది.





















