అన్వేషించండి

Crime News: 10 వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి - గుండె పగిలేలా ఏడ్చిన తల్లిదండ్రులు

Andhra Pradesh News | ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పెనుగంచిప్రోలులో విషాదం చోటుచేసుకుంది 10 వీధి కుక్కలు దాడిలో రెండేళ్ల బాలుడు మృతిచెందడంతో పసివాడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Boy Dies in Dogs Attack In NTR District | నందిగామ: ఎన్టీఆర్ జిల్లా  నందిగామలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో గాయపడిన రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. బాలుడి తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. కుక్కలు తమ బాబుపై దారుణంగా దాడి చేసి చంపాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణలోనూ ఇలాంటి హృదయ విదారక ఘటనలు పలుచోట్ల జరిగాయి. ఏపీలో గతంలో ఆసుపత్రుల్లో ఎలుకలు కొరకడం ద్వారా సైతం చిన్నారులు మృతిచెందిన సంచలన కేసులు నమోదు కావడం తెలిసిందే. తాజాగా మరో చిన్నారి చనిపోవడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నందిగామలోని పెనుగంచిప్రోలు గ్రామంలో తూఫాన్ కాలనీకి చెందిన రెండేళ్ల బాల తోటి ప్రేమ్ కుమార్ ఆరుబయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో వీధి కుక్కలు ఒక్కొక్కటిగా 10 అక్కడికి వచ్చాయి. ఒక్కసారిగా 10 వీధి కుక్కలు రెండేళ్ల బాలుడిపై దాడి చేసి పంట పొలాల్లోకి లాక్కొని వెళ్లేందుకు చూశాయి. అది గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేస్తూ, కుక్కల్ని తరమడంతో బాలుడ్ని అక్కడే వదిలి వెళ్లాయి. కానీ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రేమ్ కుమార్ కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం కుటుంబసభ్యులు బాలుడ్ని హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే బాలుడు చనిపోయాడని నిర్ధారించారు.

గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, వాటిని పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని గ్రామ పంచాయితీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాం. అయినా వారు పట్టించుకోకపోవడంతో ఇంత విషాదం చోటుచేసుకుందని.. తమకు పుత్రశోకం మిగిలిందని మృతిచెందిన బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. 

ఏపీలో అధికారుల నిర్లక్ష్యానికి రెండేళ్ల బాలుడు బలి 
అధికారుల నిర్లక్ష్యానికి రెండేళ్ల బాలుడు చనిపోయాడని వైసీపీ ఆరోపించింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో కుక్కల బెడదపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోని కారణంగా పసివాడు బలయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుబయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేయడం దారుణం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యానికి ఇంకెంత మంది బిడ్డలు ఇలా బలి అవ్వాలి అని వైసీపీ ఎక్స్ ఖాతాలో ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు.

Also Read: Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

UP Man Killed By Lover: ఇద్దరు భార్యలు 18 మంది పిల్లలున్నా వివాహేతర బంధం - అదే ప్రాణం తీసింది !
ఇద్దరు భార్యలు 18 మంది పిల్లలున్నా వివాహేతర బంధం - అదే ప్రాణం తీసింది !
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Air Canada Express Plane Crash: న్యూయార్క్ లోని ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రన్‌వే పై ట్రక్కును ఢీకొన్న ఎయిర్ కెనడా విమానం
న్యూయార్క్ లోని ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రన్‌వే పై ట్రక్కును ఢీకొన్న ఎయిర్ కెనడా విమానం
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Embed widget