అన్వేషించండి

Bengaluru: బెంగళూరు ఆఫీసులో లైట్ల విషయంలో గొడవ - మేనేజర్‌ను కొట్టి చంపేసిన విజయవాడ టెకీ !

Techie kills manager: పని ఒత్తిడికి తోడు చీటిమాటికి ప్రతీ విషయంలోనూ ఇబ్బంది పెడుతున్నాడన్న అసహనంతో ఓ టెకీ మేనేజర్ ను చంపేశాడు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది.

Bengaluru techie kills manager with dumbbell:  బెంగళూరులోని ఒక డిజిటల్  వరల్డ్,  ఫోటో-ఎడిటింగ్ కంపెనీలో రాత్రి షిఫ్ట్ సమయంలో జరిగిన చిన్న గొడవ భయంకర హత్యకు కారణం అయింది.  41 ఏళ్ల మేనేజర్ భీమేష్ బాబును అతని సహోద్యోగి, 24 ఏళ్ల టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ డంబెల్‌తో కొట్టి చంపేశాడు. ఈ ఘటనకు కారణం  ఆఫీస్‌లో అనవసర లైట్లు ఆఫ్ చేయాలని అడిగిన విషయంలో రేగిన వివాదమే.  పోలీసులు.. మేనేజర్ ను హత్య చేసిన  వంశీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

ఘటన సరస్వతీనగర్‌లోని ఎంసీ లేఅవుట్ సమీపంలోని 'డేటా డిజిటల్ బ్యాంక్' కంపెనీ ఆఫీసులో నవంబర్ 1 శనివారం రాత్రి 1:00 గంటల సమయంలో జరిగింది. ఈ కంపెనీ సినిమా షూటింగ్ వీడియోలను డైలీ స్టోరేజ్ చేసే డిజిటల్ వాల్ట్ సర్వీస్‌ను అందిస్తుంది. రాత్రి షిఫ్ట్‌లో పని చేస్తున్న భీమేష్ బాబు , సోమల వంశీ మధ్య లైట్లపై జరిగిన తీవ్రమైన వాదన హింసాత్మక దాడిగా మారి హత్యకు దారి తీసింది. 

చిత్రదుర్గ జిల్లా నివాసి భీమేష్ బాబు (41) తన ఆఫీసులో బ్రైట్ లైట్ల విషయంలో ఇబ్బందికరంగా ఉండేవాడు.  అనవసర లైట్లు ఆఫ్ చేయాలని సహోద్యోగులను తరచూ కోరేవాడు. విజయవడకు విజయవాడ  చెందిన సోమల వంశీ (24) కంపెనీలో కొంత కాలంగా పని చేస్తున్నారు.  అర్థరాత్రి ఒంటి గంటలకు  వీడియో ఎడిటింగ్‌లో మునిగి ఉన్న సమయంలో  ...  బాబు వంశీని చూసి, "లైట్లు ఆఫ్ చేయి" అని అడిగాడు. దీనికి వంశీ కోపంతో వంశీ స్పందించాడు. ఆ వాదన అంతకంతకూ పెరిగిపోయింది.  

వాదన తీవ్రమై, దాదాపు 1:30 నిమిషాలకు  ఘర్షణకు దిగారు.  కోపంలో వంశీ మిరప కాయ పొడి  బాబుపై విసిరేశాడు. ఆ తర్వాత రూములో ఉన్న ఇనుము డంబెల్‌ను పట్టుకుని, బాబు తల, ముఖం, ఛాతీలపై బలవంతంగా ఒక్కసారిగా కొట్టాడు. బాబు  కూలిపోయాడు, అక్కడే మరణించాడు.

భయపడిపోయిన వంశీ ఆఫీసు నుంచి పరిగెత్తి, తన సహోద్యోగి గౌరి ప్రసాద్‌ను నయందహళ్ళిలో కలిశాడు. ప్రసాద్ తన స్నేహితుడిని తీసుకుని మళ్లీ ఆఫీసుకు వచ్చి, బాబును చూసి ఆంబులెన్స్ పిలిచారు.  ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు బాబును మరణించాడని ప్రకటించారు. ఘటన తెలుసుకున్న వెంటనే వంశీ గోవిందరాజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో స్వయంగా సరెండర్ అయ్యాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. దర్యాప్తులో పోలీసులు ఘటనా స్థలంలో డంబెల్, మిరప కాయ పొడి మొదలైన సాక్ష్యాలను సేకరించారు.

పశ్చిమ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. గిరీష్ మాట్లాడుతూ, "లైట్లు ఆఫ్ చేయాలనే అభ్యంతరమే ఈ హత్యకు తక్షణ కారణం.  భీమేష్ బాబు చిత్రదుర్గకు చెందినవాడు. ఈ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తూ, రాత్రి షిఫ్ట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.  సోమల వంశీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. టెక్నికల్ ఎగ్జిక్యూటివ్‌గా వీడియో ఎడిటింగ్ వంటి పనులు చేస్తున్నాడు.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
Advertisement

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget