అన్వేషించండి

Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!

విచారణ ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా పీజీఆర్‌ఎస్ తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన సూసైడ్ చేసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో శ్రీనివాసులు సెలవులో ఉన్నారు.

రైలు కింద పడి ఎమ్మార్వో శ్రీనివాసులు ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో విషాదం

విచారణ ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా పీజీఆర్‌ఎస్ తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన సూసైడ్ చేసుకున్నారు. 

చిత్తూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా  కలెక్టరేట్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) విభాగంలో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు గురువారం సూసైడ్ చేసుకున్నారు. చిత్తూరు నగర సమీపంలోని సిద్ధంపల్లె వద్ద రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. సాయంత్రం దాదాపు 6.30 గంటలకు తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వైపు వస్తున్న మెము ఎక్స్‌ప్రెస్ రైలు సిద్ధంపల్లె సమీపిస్తుండగా, ఆయన ఒక్కసారిగా పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

 2024 సాధారణ ఎన్నికల సమయంలో శ్రీనివాసులు రామాపురం తహసీల్దారుగా పనిచేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన లక్కిరెడ్డిపల్లెకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఒక ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. సంబంధిత వీఆర్వో వెంకటరమణను సస్పెండ్ చేయగా, తహసీల్దార్ శ్రీనివాసులును కలెక్టరేట్‌లోని కోనేరు రంగారావు రిఫార్మ్స్ కమిటీ (KRRC) విభాగానికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రం మదనపల్లెకు మారడంతో ఆయన పీజీఆర్‌ఎస్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై ఇటీవల విచారణ పూర్తి చేసిన ఉన్నతాధికారులు, విధుల్లో తప్పులు దొర్లాయనే అంశంపై సీసీఎల్‌ఏ (CCLA)కు నివేదిక అందించినట్లు తెలిసింది.

గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసులు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భార్య కూడా ఇదే జిల్లాలోని సదుం (MPDOగా పనిచేస్తూ, ఇటీవల అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నట్లు సమాచారం. శ్రీనివాసులు కుమార్తె ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. తహసీల్దార్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్‌పీఎస్ రైల్వే పోలీసులు వెల్లడించారు.

Frequently Asked Questions

శ్రీనివాసులుపై విచారణ ఎందుకు జరుగుతోంది?

2024 ఎన్నికల సమయంలో రామాపురం తహసీల్దారుగా ఉన్నప్పుడు ఒక ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ కారణంగా ఆయన బదిలీ అయ్యారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget