2024 ఎన్నికల సమయంలో రామాపురం తహసీల్దారుగా ఉన్నప్పుడు ఒక ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ కారణంగా ఆయన బదిలీ అయ్యారు.
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
విచారణ ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా పీజీఆర్ఎస్ తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన సూసైడ్ చేసుకున్నారు.

- కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో శ్రీనివాసులు సెలవులో ఉన్నారు.
రైలు కింద పడి ఎమ్మార్వో శ్రీనివాసులు ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో విషాదం
విచారణ ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా పీజీఆర్ఎస్ తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన సూసైడ్ చేసుకున్నారు.
చిత్తూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) విభాగంలో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు గురువారం సూసైడ్ చేసుకున్నారు. చిత్తూరు నగర సమీపంలోని సిద్ధంపల్లె వద్ద రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. సాయంత్రం దాదాపు 6.30 గంటలకు తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వైపు వస్తున్న మెము ఎక్స్ప్రెస్ రైలు సిద్ధంపల్లె సమీపిస్తుండగా, ఆయన ఒక్కసారిగా పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
2024 సాధారణ ఎన్నికల సమయంలో శ్రీనివాసులు రామాపురం తహసీల్దారుగా పనిచేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన లక్కిరెడ్డిపల్లెకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఒక ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. సంబంధిత వీఆర్వో వెంకటరమణను సస్పెండ్ చేయగా, తహసీల్దార్ శ్రీనివాసులును కలెక్టరేట్లోని కోనేరు రంగారావు రిఫార్మ్స్ కమిటీ (KRRC) విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రం మదనపల్లెకు మారడంతో ఆయన పీజీఆర్ఎస్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై ఇటీవల విచారణ పూర్తి చేసిన ఉన్నతాధికారులు, విధుల్లో తప్పులు దొర్లాయనే అంశంపై సీసీఎల్ఏ (CCLA)కు నివేదిక అందించినట్లు తెలిసింది.
గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసులు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భార్య కూడా ఇదే జిల్లాలోని సదుం (MPDOగా పనిచేస్తూ, ఇటీవల అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నట్లు సమాచారం. శ్రీనివాసులు కుమార్తె ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. తహసీల్దార్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్పీఎస్ రైల్వే పోలీసులు వెల్లడించారు.
Frequently Asked Questions
శ్రీనివాసులుపై విచారణ ఎందుకు జరుగుతోంది?
ట్రెండింగ్ వార్తలు























