అన్వేషించండి

Bengaluru: పీజీ హాస్టల్‌లో యువతి హత్య, ప్రాధేయపడినా వదలని కిరాతకుడు

Bihar Crime News: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన 24 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. అభిషేక్ అనే వ్యక్తి కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.

Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన 24 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది.  మంగళవారం కోరమంగళ ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ హాస్టల్లో ఉంటున్న 22 ఏళ్ల యువతిని నిందితుడు గొంతుకోసి దారుణంగా హతమార్చాడు.  మృతురాలని బీహార్‌కి చెందిన కృతి కుమారిగా గుర్తించారు.  ఆమె నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. బాధితురాలు కోరమంగళలోని వీఆర్‌ లేఅవుట్‌లోని హాస్టల్‌లో ఉంటోందని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఓ వ్యక్తి హాస్టల్‌లో ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. యువతి హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి 11:10 నుంచి 11:30 గంటల సమయంలో జరిగింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు చేతిలో బ్యాగ్‌తో వచ్చి బాధితురాలి తలుపు తట్టడం కనిపించింది. మహిళ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అందుకున్న పోలీసులు,  ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మంగళవారం రాత్రి 11.10 నుంచి 11.30 గంటల మధ్య నిందితుడు కత్తితో హాస్టల్ ఆవరణలోకి ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మూడో అంతస్తులోని ఓ గది దగ్గరకు వెళ్లాడు.  కృతి కుమారి తలుపులు తెరిచిన తర్వాత నిందితుడు గదిలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. కొన్ని సెకన్ల తర్వాత బాధితురాలు, నిందితుడు మళ్లీ ఫ్రేమ్‌లోకి వస్తారు. ఇప్పుడు నిందితుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు కేకలు వేస్తూ కనిపించింది. కృతి కుమారి పై నిందితుడు ఆగకుండా దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు.  దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. హంతకుడిని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అభిషేక్‌ అని ప్రాథమిక విచారణలో తేలింది. ఘటన జరిగిన వెంటనే కోరమంగళ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దారుణ హత్య జరిగి రెండు రోజులకు పైగా గడుస్తున్నా.. ఇప్పటికీ నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. నిందితుడు యువతికి పరిచయస్తుడే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 మహిళ హత్యకు కారణం ఇదేనా ?
అభిషేక్,  కృతి కుమారి స్నేహితురాలితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు.  అభిషేక్ ప్రియురాలు మహారాష్ట్ర నివాసి. అభిషేక్ తన ప్రియురాలిని కలిసేందుకు తరచూ హాస్టల్ కు వచ్చి వెళ్తుండేవాడు.  అభిషేక్‌ ఉద్యోగం చేయడం లేదనే విషయంలో ప్రియురాలితో గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగా ప్రియురాలు అభిషేక్ కు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే, ఇటీవల వారిద్దరి మధ్య సంబంధాలు చెడిపోవడంతో కృతి కుమారి, ఆమె స్నేహితురాలు అతడిని దూరం పెట్టడం మొదలు పెట్టారు. కొంతకాలం క్రితం అభిషేక్ హాస్టల్ కు వచ్చి గొడవ చేశాడు.  ఆ తర్వాత కృతి కుమారి తన స్నేహితురాలిని వేరే హాస్టల్ కు వెళ్లమని సలహా ఇచ్చింది. దాంతో పాటు కొత్త హాస్టల్ కు మారడానికి సాయం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ అభిషేక్ ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ కావడం మానేశారు.  

జుట్టు పట్టుకొని గొంతు కోసి
దీంతో కోపోద్రిక్తుడైన అభిషేక్ మంగళవారం రాత్రి కృతి కుమారి ఉంటున్న హాస్టల్ కు వచ్చాడు. అక్కడ కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. సిసిటివి ఫుటేజీలో అభిషేక్ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకుని కృతి గది వైపు వెళుతున్నట్లు కనిపించింది. వెంటనే, అభిషేక్ ఆమెను బయటకు లాగడం కనిపిస్తుంది.  కృతి అతని బారి నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అభిషేక్ ఒక చేతిలో కత్తిని పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను కృతి మెడను పట్టుకుని కత్తితో ఆమె గొంతు కోశాడు. కృతి పడిపోయిన తర్వాత కూడా, నిందితుడు ఆమె జుట్టు పట్టుకుని కత్తితో దాడి చేస్తూనే ఉన్నాడు.  అనంతరం  ఆమె నుండి ఒక అడుగు దూరంగా వెళ్లి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అక్కడ ఉంటున్న మహిళల్లో ఒకరు నెమ్మదిగా తలుపు తెరిచి, బయటకు చూస్తూ తన గదిలోకి వెళ్లడం కనిపించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ శుక్రవారం తెలిపారు. ఈ బృందాలు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాయని చెప్పారు. నిందితుడు అభిషేక్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడని వారు తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget