అన్వేషించండి

Bengaluru: పీజీ హాస్టల్‌లో యువతి హత్య, ప్రాధేయపడినా వదలని కిరాతకుడు

Bihar Crime News: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన 24 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. అభిషేక్ అనే వ్యక్తి కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.

Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన 24 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది.  మంగళవారం కోరమంగళ ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ హాస్టల్లో ఉంటున్న 22 ఏళ్ల యువతిని నిందితుడు గొంతుకోసి దారుణంగా హతమార్చాడు.  మృతురాలని బీహార్‌కి చెందిన కృతి కుమారిగా గుర్తించారు.  ఆమె నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. బాధితురాలు కోరమంగళలోని వీఆర్‌ లేఅవుట్‌లోని హాస్టల్‌లో ఉంటోందని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఓ వ్యక్తి హాస్టల్‌లో ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. యువతి హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి 11:10 నుంచి 11:30 గంటల సమయంలో జరిగింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు చేతిలో బ్యాగ్‌తో వచ్చి బాధితురాలి తలుపు తట్టడం కనిపించింది. మహిళ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అందుకున్న పోలీసులు,  ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మంగళవారం రాత్రి 11.10 నుంచి 11.30 గంటల మధ్య నిందితుడు కత్తితో హాస్టల్ ఆవరణలోకి ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మూడో అంతస్తులోని ఓ గది దగ్గరకు వెళ్లాడు.  కృతి కుమారి తలుపులు తెరిచిన తర్వాత నిందితుడు గదిలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. కొన్ని సెకన్ల తర్వాత బాధితురాలు, నిందితుడు మళ్లీ ఫ్రేమ్‌లోకి వస్తారు. ఇప్పుడు నిందితుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు కేకలు వేస్తూ కనిపించింది. కృతి కుమారి పై నిందితుడు ఆగకుండా దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు.  దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. హంతకుడిని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అభిషేక్‌ అని ప్రాథమిక విచారణలో తేలింది. ఘటన జరిగిన వెంటనే కోరమంగళ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దారుణ హత్య జరిగి రెండు రోజులకు పైగా గడుస్తున్నా.. ఇప్పటికీ నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. నిందితుడు యువతికి పరిచయస్తుడే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 మహిళ హత్యకు కారణం ఇదేనా ?
అభిషేక్,  కృతి కుమారి స్నేహితురాలితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు.  అభిషేక్ ప్రియురాలు మహారాష్ట్ర నివాసి. అభిషేక్ తన ప్రియురాలిని కలిసేందుకు తరచూ హాస్టల్ కు వచ్చి వెళ్తుండేవాడు.  అభిషేక్‌ ఉద్యోగం చేయడం లేదనే విషయంలో ప్రియురాలితో గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగా ప్రియురాలు అభిషేక్ కు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే, ఇటీవల వారిద్దరి మధ్య సంబంధాలు చెడిపోవడంతో కృతి కుమారి, ఆమె స్నేహితురాలు అతడిని దూరం పెట్టడం మొదలు పెట్టారు. కొంతకాలం క్రితం అభిషేక్ హాస్టల్ కు వచ్చి గొడవ చేశాడు.  ఆ తర్వాత కృతి కుమారి తన స్నేహితురాలిని వేరే హాస్టల్ కు వెళ్లమని సలహా ఇచ్చింది. దాంతో పాటు కొత్త హాస్టల్ కు మారడానికి సాయం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ అభిషేక్ ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ కావడం మానేశారు.  

జుట్టు పట్టుకొని గొంతు కోసి
దీంతో కోపోద్రిక్తుడైన అభిషేక్ మంగళవారం రాత్రి కృతి కుమారి ఉంటున్న హాస్టల్ కు వచ్చాడు. అక్కడ కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. సిసిటివి ఫుటేజీలో అభిషేక్ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకుని కృతి గది వైపు వెళుతున్నట్లు కనిపించింది. వెంటనే, అభిషేక్ ఆమెను బయటకు లాగడం కనిపిస్తుంది.  కృతి అతని బారి నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అభిషేక్ ఒక చేతిలో కత్తిని పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను కృతి మెడను పట్టుకుని కత్తితో ఆమె గొంతు కోశాడు. కృతి పడిపోయిన తర్వాత కూడా, నిందితుడు ఆమె జుట్టు పట్టుకుని కత్తితో దాడి చేస్తూనే ఉన్నాడు.  అనంతరం  ఆమె నుండి ఒక అడుగు దూరంగా వెళ్లి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అక్కడ ఉంటున్న మహిళల్లో ఒకరు నెమ్మదిగా తలుపు తెరిచి, బయటకు చూస్తూ తన గదిలోకి వెళ్లడం కనిపించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ శుక్రవారం తెలిపారు. ఈ బృందాలు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాయని చెప్పారు. నిందితుడు అభిషేక్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడని వారు తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget