అన్వేషించండి

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, భారీగా నగదు సీజ్ చేసిన సిట్

SIT Seizes ₹11 Crore Cash in AP Liquor Scam | ఏపీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాం హౌస్‌లో దాచిన నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Andhra Pradesh Liquor Policy Case | హైదరాబాద్‌: ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణం (AP Liquor Scam)లో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన  రాజ్‌ కెసిరెడ్డి ఇచ్చిన సమాచారంతో భారీగా నగదును అధికారులు సీజ్ చేశారు. 12 బాక్సుల్లో భద్రపరిచిన ఏకంగా రూ.11 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. నిందితులు ఇస్తున్న సమాచారంతో సిట్ అధికారులు పలు చోట్ల సోదాలు చేపట్టిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు.


AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, భారీగా నగదు సీజ్ చేసిన సిట్

ఫాం హౌస్‌లో అట్ట పెట్టెల్లో నోట్ల కట్టలు

రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంషాబాద్‌ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్‌ గెస్ట్‌ హౌస్‌లో ఈ నగదును సిట్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఏపీ లిక్కర్ కేసును సిట్ అధికారులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం కేసులో నిందితుడు వరుణ్‌ పురుషోత్తం వెల్లడించిన విషయాల ఆధారంగా సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయారు. అట్టపెట్టెల్లో ఉంచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. నిందితులు ఇంకా ఎక్కడెక్కడ నగదు దాచారు, బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా అనే కోణాల్లో సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. 


AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, భారీగా నగదు సీజ్ చేసిన సిట్

లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్‌ 2024లో రాజ్‌ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాలతో వినయ్‌ సాయంతో వరుణ్‌ పురుషోత్తం అనే మరో నిందితుడు రూ.11 కోట్ల నగదును అట్ట పెట్టెలల్లో ఉంచి ఆఫీస్ ఫైల్స్ పేరుతో దాచిపెట్టాడు. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలతో అధికారులు తనిఖీలు చేసి నగదును గుర్తించారు. సిట్ విచారణలో నిందితుడు వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించడంతో ఏపీ లిక్కర్ స్కామ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఏపీలో 3500 కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

ఈ లిక్కర్ స్కామ్ ద్వారా రూ.18,860 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించి కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలున్నాయి. రాజ్‌ కెసిరెడ్డి బినామీ సంస్థ యూపీ డిస్టిలరీస్ పేరును సిట్ తొలి చార్జ్‌షీటులోనే ప్రస్తావించడం తెలిసిందే. 

ఫామ్‌హౌస్‌ యజమాని ఎవరు..
వర్ధమాన్‌ కాలేజీ సమీపంలో ఉన్న సులోచన ఫార్మ్‌ గెస్ట్‌ హౌస్‌ ఓనర్ విజయేందర్‌రెడ్డిగా గుర్తించారు. ఆయన తల్లి పేరిట ఈ ఫామ్‌హౌస్‌ ఉంది. స్టోర్‌ రూమ్‌లో బియ్యం బస్తాల మధ్యలో ఈ నగదును దాచి ఉంచారని సిట్ అధికారులు తెలిపారు. నగదు లభ్యం కావడంపై ఈడీ, ఐటీ లిక్కర్ స్కామ్ కేసుపై దర్యాప్తు చేయనున్నాయి. 

ఈ కేసులో వైసీపీ నేతల పేర్లు వినిపిస్తుండగా.. దర్యాప్తులో వారి పాత్ర తేలుతుందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
Constable Dies in Road Accident: డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. మే 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. మే 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
TGSRTC Strike : తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Embed widget