అన్వేషించండి

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, భారీగా నగదు సీజ్ చేసిన సిట్

SIT Seizes ₹11 Crore Cash in AP Liquor Scam | ఏపీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాం హౌస్‌లో దాచిన నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Andhra Pradesh Liquor Policy Case | హైదరాబాద్‌: ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణం (AP Liquor Scam)లో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన  రాజ్‌ కెసిరెడ్డి ఇచ్చిన సమాచారంతో భారీగా నగదును అధికారులు సీజ్ చేశారు. 12 బాక్సుల్లో భద్రపరిచిన ఏకంగా రూ.11 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. నిందితులు ఇస్తున్న సమాచారంతో సిట్ అధికారులు పలు చోట్ల సోదాలు చేపట్టిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు.


AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, భారీగా నగదు సీజ్ చేసిన సిట్

ఫాం హౌస్‌లో అట్ట పెట్టెల్లో నోట్ల కట్టలు

రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంషాబాద్‌ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్‌ గెస్ట్‌ హౌస్‌లో ఈ నగదును సిట్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఏపీ లిక్కర్ కేసును సిట్ అధికారులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం కేసులో నిందితుడు వరుణ్‌ పురుషోత్తం వెల్లడించిన విషయాల ఆధారంగా సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయారు. అట్టపెట్టెల్లో ఉంచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. నిందితులు ఇంకా ఎక్కడెక్కడ నగదు దాచారు, బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా అనే కోణాల్లో సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. 


AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, భారీగా నగదు సీజ్ చేసిన సిట్

లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్‌ 2024లో రాజ్‌ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాలతో వినయ్‌ సాయంతో వరుణ్‌ పురుషోత్తం అనే మరో నిందితుడు రూ.11 కోట్ల నగదును అట్ట పెట్టెలల్లో ఉంచి ఆఫీస్ ఫైల్స్ పేరుతో దాచిపెట్టాడు. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలతో అధికారులు తనిఖీలు చేసి నగదును గుర్తించారు. సిట్ విచారణలో నిందితుడు వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించడంతో ఏపీ లిక్కర్ స్కామ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఏపీలో 3500 కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

ఈ లిక్కర్ స్కామ్ ద్వారా రూ.18,860 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించి కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలున్నాయి. రాజ్‌ కెసిరెడ్డి బినామీ సంస్థ యూపీ డిస్టిలరీస్ పేరును సిట్ తొలి చార్జ్‌షీటులోనే ప్రస్తావించడం తెలిసిందే. 

ఫామ్‌హౌస్‌ యజమాని ఎవరు..
వర్ధమాన్‌ కాలేజీ సమీపంలో ఉన్న సులోచన ఫార్మ్‌ గెస్ట్‌ హౌస్‌ ఓనర్ విజయేందర్‌రెడ్డిగా గుర్తించారు. ఆయన తల్లి పేరిట ఈ ఫామ్‌హౌస్‌ ఉంది. స్టోర్‌ రూమ్‌లో బియ్యం బస్తాల మధ్యలో ఈ నగదును దాచి ఉంచారని సిట్ అధికారులు తెలిపారు. నగదు లభ్యం కావడంపై ఈడీ, ఐటీ లిక్కర్ స్కామ్ కేసుపై దర్యాప్తు చేయనున్నాయి. 

ఈ కేసులో వైసీపీ నేతల పేర్లు వినిపిస్తుండగా.. దర్యాప్తులో వారి పాత్ర తేలుతుందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget