By: ABP Desam | Updated at : 07 May 2022 07:28 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం
Anantapur News : అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న రేకుల షెడ్డును పోలీసుల సహాయంతో స్థానిక నేతలు కూల్చివేశారని ఓ దళిత కుటుంబం ఆరోపిస్తుంది. షెడ్యూల్ ను కూల్చివేస్తుండగా రెవిన్యూ, పోలీసు అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదని బాధితులు అంటున్నారు. షెడ్డును కూలుస్తున్న జేసీబీకి అడ్డువెళ్లిన తమను పోలీసులు ఈడ్చేశారని ఆరోపిస్తున్నారు. తమ ఇల్లు నేలమట్టం కావడంతో సహించలేక భార్యాభర్తలు అనితలక్ష్మీ, హనుమంత రాయుడు పురుగుల మందు తాగి అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నం చేశారు. 108లో బాధితుల్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ స్థలాన్ని ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితులు అనితలక్ష్మీ హనుమంతరాయుడు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదు. అధికారులు చట్టప్రకారమే స్థలాన్ని ఖాళీ చేసేందుకు వచ్చామంటున్నారు.
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !
Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్లోనే లాంచ్ - ధర లీక్!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి