అన్వేషించండి

Anantapur News: అనంతపురం జిల్లాలో విషాదం... ములకవారిపల్లి తండా చెరువులో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు చెరువులో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అమడగూరు మండలంలోని ములకవారిపల్లి తండాలో చెరువులో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. చెరువులోకి దిగిన చిన్నారులు ప్రమాదవశాత్తు గల్లంతైనట్లు తెలుస్తోంది. చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  గల్లంతైనవారిలో లాలూ ప్రసాద్ నాయక్ నాలుగో తరగతి, పురుషోత్తం నాయక్ ఆరో తరగతి, హేమంత్ నాయక్ ఏడో తరగతి చదువుతున్నారు. దసరా సెలవుల కారణంగా సరదాగా చెరువు వైపు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు విద్యార్థులకు ఆచూకీ లభించలేదు. ఓకే తండాకు చెందిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి గల్లంతు అవ్వడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నారు. 

Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..


Anantapur News: అనంతపురం జిల్లాలో విషాదం... ములకవారిపల్లి తండా చెరువులో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

మహిళ కాపాడిన పోలీసులు 

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గోదావరి బ్రిడ్జ్ పై నుంచి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ మహిళను రావులపాలెం హైవే మొబైల్ పోలీసులు రక్షించారు. సోమవారం సాయంత్రం రాజమండ్రికి చెందిన ఏరుబండి చక్ర వేణి(33) అనే  మహిళ గోదావరి బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తుండగా అటు వైపుగా వెళ్తున్న రావులపాలెం హైవే మొబైల్ సిబ్బంది ఆమెను గమనించి అడ్డుకున్నారు. తన సమస్యలు పోలీస్ సిబ్బంది చెప్పి ఆ మహిళ బోరున విలపించింది. తన  అత్తవారి ఊరు  రాజమండ్రి వెంకట నగర్ అని, అమ్మగారి ఊరు రాజనగరం మండలం కానవరం కాగా  ఒక పాప, ఒక బాబు సంతానం అని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల కిందట భర్త చనిపోవడంతో పిల్లల పోషణ, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించానని కన్నీటి పర్యాంతం అయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆమెను  సురక్షితంగా రావులపాలెం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. 

Also Read: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి

రాజమహేంద్రవరంలో దారుణ ఘటన

రాజమహేంద్రవరం పట్టణంలోని ఆనంద్‌ నగర్‌లో ఈ ఘటన జరిగింది. తాడేపల్లికి చెందిన అనూష అనే మహిళ భర్త 13 ఏళ్ల కిందట చనిపోవడంతో రాజమండ్రికి వచ్చి బ్యూటీషియన్‌గా పనిచేస్తూ ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల పిల్లల విషయంలో ఆమె తల్లితో కూడా గొడవ పడింది. పిల్లల్ని కొట్టద్దని అడ్డు వచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను సైతం అనూష గాయపర్చింది. దీంతో ఆమె చెయ్యి గూడు విరగడంతో తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై లక్ష్మి అనూష సోదరులు వారి మేనమామకు సమాచారం అందించడంతో వారు లక్ష్మీ అనూషకు ఫోన్ చేసి మందలించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కుమార్తె ఎనిమిదేళ్ల చిన్మయి, ఆరేళ్ల మోహిత్‌‌ను ఇంట్లో ఉరివేసి చంపేసిందని స్థానికులు, బంధువులు వెల్లడించారు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి మూడో పట్టణ పోలీసులు నిందితురాలు అనూషను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

Also Read: నిజామాబాద్ చిన్నారి ఆచూకీ లభ్యం... మహారాష్ట్రలో పాపను వదిలివెళ్లిన కిడ్నాపర్లు...

అయితే.. పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం అనూష ప్రియుడికి ఫోన్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. పిల్లల్ని చంపేసినట్లుగా బంధువులకు కూడా ఫోన్ చేసి తెలపడంతో వారు ఆగమేఘాలపై ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో అనూష ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా వారు నిరోధించారు. అనంతరం చనిపోయిన పిల్లల్ని అనుష్కను 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి పిల్లలను హతమార్చిందా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో తాము విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Also Read: పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం ... వైరల్ అయిన వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Bangladesh Bengali Language: ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
Embed widget