అన్వేషించండి

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Anantapur Crime News: కొన్ని హత్య కేసులు పోలీసులకు ముప్పతిప్పలు పెడతాయి. అలాంటిదే అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. కేవలం మూడు వస్తువులతో ఛేదించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అనంతపురంలో కాలిపోయిన మృతదేహం; జంధ్యం, అప్పడాల ప్యాకెట్ క్లూలు.
  • క్లూల ఆధారంగా బళ్లారి మూగ వ్యక్తి గురురాజారావుగా గుర్తింపు.
  • నిందితులు మృతుడి ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసి పట్టుబడ్డారు.
  • డబ్బుల కోసం మూగ వ్యక్తులిద్దరు గురురాజారావును హత్య చేశారు.

Anantapur Crime News: అనంతపురం జిల్లా డీ హీరేహాల్‌లో ఒక డెడ్‌ బాడీ ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెళ్లి చూస్తే డెడ్‌బాడీ కాలిపోయి ఉంది. అసలు ఆ వ్యక్తి ఎవరో? అక్కడ ఎందుకు చంపేశారో క్లూలు లేవు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేవు. చుట్టుపక్కల మిస్సింగ్ కేసులు కూడా రిజిస్టర్ కాలేదు. కానీ కేవలం జంధ్యం, సగం కాలిన పేపర్‌, అప్పడాల ప్యాకెట్‌తో కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను గుర్తించారు. కానీ వారు మూగ చెవిటి వాళ్లు కావడంతో నిర్దారించుకోవడానికి టైం తీసుకున్నారు.     

క్లూలెస్‌గా డెడ్‌బాడీ కేసు 

జూన్ 23వ తేదీని అనంతపురం జిల్లా పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. డీహీరేహాల్ మండలంలోని పులకుర్తిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని చెప్పారు. వెంటనే పోలీసులు స్పాట్‌కు వచ్చారు. చనిపోయింది మగ వ్యక్తి అని మాత్రమే గుర్తు పట్టారు. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అక్కడ అతన్ని కాల్చేశారు అనేది మాత్రం క్లూలెస్‌గా మారింది. అయితే స్పాట్‌లో మాత్రం ఒక జంధ్యం, సంగ కాలిన కన్నడ పేపర్‌, అప్పడాల ప్యాకెట్‌ దొరికింది. 

మూడు వస్తువులతో కేసు దర్యాప్తు

ఈ మూడింటి ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. అప్పడాల ప్యాకెట్‌ చెన్నైకు చెందింది తెలిసింది. అక్కడికి వెళ్లి ఆరా తీస్తే కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ వివరాలు తెలిశాయి. ఆయన్ని ప్రశ్నిస్తే బళ్లారికి చెందిన గురురాజారావుగా తేల్చారు. మూగ, చెవిటి వ్యక్తి అయిన ఇతను అప్పడాలు అమ్ముకొని జీవించే వాడని తేలింది. ఆయన కనిపించడం లేదని కూడా గుర్తించారు. దీంతో చనిపోయింది గురురాజారావుగా కన్ఫామ్‌ చేసుకున్నారు. 

డబ్బు డ్రా చేసి పోలీసులకు చిక్కిన నిందితులు

చనిపోయింది ఎవరో గుర్తించిన పోలీసులు అసలు నిందితుల ఎవరూ అని ఆరా తీయడం మొదలు పెట్టారు. మృతుడితో పరిచయం ఉన్న వారంతా కూడా చెవిటి, మూగవారే. కాబట్టి వారిని అనుమానించలేదు. కేసు ఎలా ముందుకు వెళ్తుందని పోలీసులు డైలమాలో పడ్డారు. ఇంతలో మృతుడి బ్యాంక్ నుంచి కొంత డబ్బు డ్రా అయ్యింది. 

ఇదే కేసులో టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా అయిన సంగతి తెలుసుకున్న పోలీసులు బ్యాంకు వారితో మాట్లాడారు. వెంటనే వాళ్లు ఏ ఏటీఎంలో డబ్బులు డ్రా అయ్యాయో వివరాలు చెప్పారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు అందజేశారు. దాన్ని చూసిన పోలీసులు షాక్ తిన్నారు. అక్కడ డబ్బులు డ్రా చేసింది ఇద్దరు వ్యక్తులు బసవరాజు, కోటేష్‌. వారిద్దరు కూడా మూగ, చెవిటి వాళ్లే. 

దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడానికి సైగల భాష నిపుణుల సాయం తీసుకున్నారు. వారితో కేసులో పురోగతి సాధించారు. వారిద్దరే ఈ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. గురురాజారావు వద్ద డబ్బులు ఉన్నాయని భావించిన వీళ్లిద్దరు అతన్ని నమ్మించి మోసం చేశారు. ఫుల్‌గా మద్యం తాగించి కళ్లల్లో కారం కొట్టి హత్య చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డీహీరేల్‌ వద్ద డెడ్‌బాడీని తగలబెట్టేశారు. 

Frequently Asked Questions

అనంతపురం జిల్లాలో కాలిపోయిన మృతదేహం ఎక్కడ దొరికింది?

అనంతపురం జిల్లాలోని డీ హేరేహాల్ మండలంలోని పులకుర్తిలో ఒక గుర్తు తెలియని కాలిపోయిన మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మొదట వ్యక్తి వివరాలు క్లూలెస్‌గా ఉన్నాయి.

పోలీసులకు దొరికిన మృతదేహం కేసును ఛేదించడానికి ఏ ఆధారాలు సహాయపడ్డాయి?

ఘటనా స్థలంలో దొరికిన జంధ్యం, సగం కాలిన కన్నడ పేపర్, అప్పడాల ప్యాకెట్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఈ వస్తువులే బాధితుడి గుర్తింపునకు కీలకంగా మారాయి.

హత్యకు గురైన వ్యక్తి ఎవరు?

హత్యకు గురైన వ్యక్తి కర్ణాటకలోని బళ్లారికి చెందిన గురురాజారావుగా గుర్తించారు. ఆయన మూగ, చెవిటి వ్యక్తి, అప్పడాలు అమ్ముకొని జీవించేవాడు.

నిందితులను పోలీసులు ఎలా పట్టుకున్నారు?

మృతుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా అయిన తర్వాత పోలీసులు ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను బసవరాజు, కోటేష్‌గా గుర్తించారు. వారు కూడా మూగ, చెవిటి వారే.

హత్యకు గల కారణం ఏమిటి?

గురురాజారావు వద్ద డబ్బులు ఉన్నాయని భావించి, నిందితులు అతన్ని మోసం చేసి, మద్యం తాగించి, కళ్ళల్లో కారం కొట్టి హత్య చేశారు. సాక్ష్యాలను మాయం చేయడానికి మృతదేహాన్ని తగలబెట్టారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget