అన్వేషించండి

Crime News: తెలంగాణలో దారుణాలు - బట్టలు ఆరేసే విషయంలో వివాదంతో కత్తితో దాడి, మరో చోట తండ్రిని చంపేసిన తనయుడు

Hyderabad News: బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరు మహిళల మధ్య చెలరేగిన వివాదం ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి దారి తీసింది. ఈ ఘటన ఎల్బీ నగర్ పరిధిలో చోటు చేసుకుంది.

Clash Between Two Womens Over Clothes Drying In LB Nagar: తెలంగాణలో దారుణాలు చోటు చేసుకున్నాయి. చిన్న చిన్న విషయాలకే కొందరు దాడులకు తెగబడుతూ ప్రాణాలు సైతం తీయడానికి వెనుకాడడం లేదు. నగరంలో బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరు మహిళల మధ్య వివాదం జరిగి అది ఘర్షణకు దారి తీయగా.. సదరు మహిళల సోదరులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కత్తితో మరో వ్యక్తి గొంతు కోశాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అలాగే, మద్యానికి డబ్బులు ఇవ్వాలని తరచూ వేధిస్తోన్న తండ్రిని ఓ కుమారుడు కర్రతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.

బట్టలు ఆరేసే విషయంలో వివాదం 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పరిధిలోని భరత్ నగర్‌లో బుజ్జి, కమలమ్మ అనే ఇద్దరు మహిళల కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. వీరిద్దరూ స్నేహితులైనప్పటికీ శనివారం బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఇది కాస్త పెద్దదిగా మారింది. ఈ క్రమంలో సదరు మహిళల సోదరులు ఎంట్రీ ఇచ్చారు. గొడవ మరింత ముదరగా విచక్షణ కోల్పోయిన బుజ్జి అనే మహిళ తమ్ముడు మరో మహిళ సోదరుడు శంకర్‌పై మటన్ కత్తితో దాడి చేశాడు. అతని గొంతు కోసం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో శంకర్‌కు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇంత జరుగుతున్నా స్థానికులు ఎవరూ వీరి గొడవను ఆపే ప్రయత్నం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

తండ్రిని చంపేసిన తనయుడు

అటు, నిర్మల్ జిల్లాలో శనివారం మరో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని వేధిస్తోన్న తండ్రిని కన్నకొడుకే కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలంలోని చిన్నబెల్లాల్ గ్రామానికి చెందిన కుడిమెత మధు(48) మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని నిత్యం భార్య, కుమారున్ని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుంటే భార్య, కుమారుడితో పాటు కోడలుని సైతం చాలాసార్లు ఇంటి నుంచి వెళ్లగొట్టిన సందర్భాలున్నాయి. ఇదే విషయంలో కుమారుడు అనిల్ తండ్రితో వారం క్రితం గొడవపడ్డాడు. 5 రోజుల క్రితం మరోసారి మద్యానికి డబ్బులివ్వాలని గొడవ చేసిన మధు డబ్బులు ఇవ్వకపోవడంతో భార్య, కుమారుడు, కోడలిని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. మళ్లీ తన ఇంటికి రావద్దంటూ బెదిరించాడు.

కర్రతో కొట్టి చంపేశాడు

తండ్రి తీరుతో విసిగిపోయిన కుమారుడు అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. శనివారం ఉదయం మధు ఇంటికి వెళ్లగా.. మళ్లీ తన ఇంటికి ఎందుకొచ్చావంటూ కొడుకుతో తండ్రి గొడవపడ్డాడు. కోపంతో ఉన్న కుమారుడు తన వెంట తెచ్చుకున్న కర్రతో తండ్రి తలపై దాడి చేశాడు. దీంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఇంఛార్జీ సీఐ నవీన్ కుమార్, ఎస్సై కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి గంగూభాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Hyderabad News: మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు - ఏడేళ్ల చిన్నారి మృతి, తండ్రికి గాయాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget