అన్వేషించండి

UPI Payments: యూపీఐ నుంచి డాలర్లలోనూ డబ్బులు పంపొచ్చు, అతి త్వరలో బ్లాక్‌బస్టర్‌ అప్‌డేట్‌

యూపీఐతో ఒప్పందం ఉన్న దేశాల్లోని వ్యక్తులు/సంస్థలకు ఆయా దేశాల కరెన్సీల్లోనే డబ్బులు పంపొచ్చు.

UPI Payments in Dollars: 'డిజిటల్‌ ఇండియా' ఇనీషియేటివ్‌లో భాగంగా తీసుకొచ్చిన UPI (Unified Payments Interface), మన దేశంలో చెల్లింపుల విషయంలో ఎలాంటి విప్లవం తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. మంచినీళ్లు దొరకని మారుమూల పల్లెలకు కూడా యూపీఐ వెళ్లింది. చదువు రాని వ్యక్తులు సైతం యూపీఐతో ఈజీగా పేమెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు... సెలవులు, బంద్‌లతో సంబంధం లేకుండా ఇది 24X7 పని చేస్తుంది. పూర్తిగా యూజర్‌ ఫ్రెండ్లీ కాబట్టి, ప్రజల రోజువారీ అలవాట్లలో UPI ఒక భాగమైంది. 

అద్భుతమైన అప్‌డేషన్‌ కోసం సిద్ధం
ఇప్పటి వరకు, యూపీఐ ద్వారా మనం రూపాయిల్లో లావాదేవీలు నిర్వహించాం. ఇకపై, డాలర్ల రూపంలోనూ (UPI payments in Dollars) చెల్లింపులు చేసేలా మార్పులు తీసుకురాబోతున్నారు. CNBC ఆవాజ్ రిపోర్ట్‌ ప్రకారం... ఒక్క డాలర్లలోనే కాదు, యూపీఐతో ఒప్పందం ఉన్న దేశాల్లోని వ్యక్తులు/సంస్థలకు ఆయా దేశాల కరెన్సీల్లోనే డబ్బులు పంపొచ్చు. దీనివల్ల ప్రపంచ సరిహద్దులు చెరిగిపోయి, అవాంతరాలు లేని లావాదేవీలకు తలుపులు తెరుచుకుంటాయి. 

యూపీఐని ఉపయోగించి డాలర్ల రూపంలో డబ్బులు పంపడానికి, పేమెంట్స్‌ సిస్టమ్‌లో టెక్నికల్‌గా కొన్ని మార్పులు చేయాలి. ఇప్పుడు అదే పని జరుగుతోంది. దీంతోపాటు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కలిసి స్విఫ్ట్‌తో (SWIFT) చర్చలు జరుపుతున్నాయి. స్విఫ్ట్‌తో చర్చలు పూర్తి కావడమే దీనిలో కీలక ఘట్టం.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చెల్లింపుల వ్యవస్థ సిఫ్ట్‌ (Society for Worldwide Interbank Financial Telecommunication). సీమాంతర (దేశాల మధ్య) లావాదేవీలకు ఇది థర్డ్‌ పార్టీగా పని చేస్తుంది. యూపీఐని స్విఫ్ట్‌తో అనుసంధానిస్తే, క్రాస్-బోర్డర్ డిజిటల్ లావాదేవీల్లో (cross-border digital transactions) యూపీఐ అత్యంత అనుకూలంగా, సురక్షితంగా మారుతుంది. రూపాయలను పంపినట్లే డాలర్లు, ఇతర కరెన్సీలను కూడా చిటికె వేసినంత సులభంగా పంపొచ్చు.

NPCI జారీ చేసిన తాజా డేటా ప్రకారం, గత నెలలో (నవంబర్ 2023) యూపీఐ లావాదేవీలు 11.24 బిలియన్లకు చేరుకున్నాయి. లావాదేవీల మొత్తం విలువ రూ.17.40 లక్షల కోట్లకు చేరుకుంది.

యూపీఐ పేమెంట్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన ఆర్‌బీఐ
ఈ నెల 8న పాలసీ నిర్ణయాలు ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das), ప్రజలకు ఉపయోగపడేలా యూపీఐ చెల్లింపుల స్థాయిని పెంచారు. ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో UPI చెల్లింపుల పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది. 

దీంతోపాటు, ఆటో-డెబిట్‌గా అందరూ పిలిచే ఈ-మాండేట్ (e-mandate) పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ.15,000 నుంచి రూ.1 లక్షకు RBI పెంచింది. ఇప్పటి వరకు, రూ.15,000 కంటే ఎక్కువ ఉన్న UPI ఆటో డెబిట్స్‌ కోసం OTP ఎంటర్‌ చేయాలి. ఈ అప్‌డేషన్‌తో, ₹1 లక్ష వరకు లావాదేవీలకు OTP తప్పనిసరి కాదు. క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులు, SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌ కొనడం, బీమా ప్రీమియంలను మిస్‌ కాకుండా చెల్లించడానికి ఈ నిర్ణయం చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ కొనడానికి కరెక్ట్‌ టైమ్‌ ఇదేనా? - రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Delhi New CM:  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABPTrolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP DesamKakinada Shilparamam Photo Shoots | ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ పెట్టిన శిల్పారామం ఇప్పుడు ఇలా | ABP DesamKTR Photo in Sircilla Tea Shop | టీ షాపునకు కేటీఆర్ ఫోటో..ఈ లోగా కలెక్టర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Delhi New CM:  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
Trolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam
Trolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam
ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ -  ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
CBSE Exams: సీబీఎస్‌ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ
సీబీఎస్‌ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.