అన్వేషించండి

Stock Market News: స్టాక్‌ మార్కెట్‌ టేడింగ్‌ గంటలు పెంచడం వల్ల ఎవరికి, ఎంత లాభం?

ఎక్కువ గంటల పాటు ట్రేడింగ్ టెర్మినల్స్‌ చురుకుగా ఉంటే ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందన్న విషయంలో ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.

Stock Market News: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మన మార్కెట్‌ ముగిసినా, యూరోపియన్‌ మార్కెట్లు పని చేస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అమెరికన్‌ మార్కెట్‌ ఓపెన్‌ అవుతుంది. వాటి ఎఫెక్ట్‌ మన మార్కెట్ల మీద పడ్డా, మన మార్కెట్‌ ట్రేడింగ్‌ అవర్స్‌ అప్పటికే ముగిసిపోవడంతో ట్రేడర్లు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ రిస్క్‌ను తగ్గించడానికి, హెడ్జ్‌ల్లో మార్పులు, చేర్పులకు ట్రేడర్లకు అవకాశం కల్పించడానికి 'ఇంట్రెస్ట్‌ రేట్‌ డెరివేటివ్స్‌' (interest rate derivatives) ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు NSE పొడిగించింది. 

వడ్డీ రేట్ల డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ NSE తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి, అంటే ఫిబ్రవరి 23, 2023 నుంచి అమలులోకి వస్తుంది. వడ్డీ రేట్ల డెరివేటివ్స్‌ విభాగంలో (F&O) సాయంత్రం 5 గంటల వరకు ట్రేడ్‌ చేయవచ్చు. దీని ప్రకారం, ఫిబ్రవరి నెలతో ముగిసే డెరివేటివ్‌ కాంట్రాక్టులు కూడా ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 23, 2023 తర్వాత గడువు ముగియనున్న ప్రస్తుత అన్ని ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్‌లు, ఇకపై వచ్చే కొత్త ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్‌ల్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌ చేయవచ్చు. 

ట్రేడింగ్‌ గంటలు పెంచడం వల్ల ఏంటి లాభం, నష్టాలున్నాయా?
ఎక్కువ గంటల పాటు ట్రేడింగ్ టెర్మినల్స్‌ చురుకుగా ఉంటే ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందన్న విషయంలో ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. 

జీరోధా టాప్ బాస్ నితిన్ కామత్ దీనిపై ఒక ట్వీట్‌ కూడా చేశారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) కోసం ట్రేడింగ్ గంటలను పొడిగించే నిర్ణయం క్యాపిటల్ మార్కెట్ల ఆదాయాన్ని పెంచుతుందన్నారు. అయితే.. రిటైల్ ఇన్వెస్టర్ల మీద ఒత్తిడి పెరుగుతుందని, ఓవర్‌ట్రేడింగ్ కారణంగా వాళ్లు నష్టపోవచ్చంటూ హెచ్చరించారు.

నాగ్‌పుర్‌కు చెందిన ట్రేడర్‌ హర్షుభ్ షా కూడా, "ట్రేడింగ్‌ గంటల పొడిగింపు వల్ల మరో 14 ఏళ్ల తర్వాత తన ట్రేడింగ్ కెరీర్‌ను ముగించాల్సి వస్తుందని సోషల్ మీడియాలో ప్రకటించే స్థాయికి వెళ్లాడు. "సమయం పొడిగిస్తే ఒత్తిడి పెరుగుతుందని,  ఆరోగ్యం కోసం డబ్బు పెట్టాలనుకోవట్లేదని అన్నారు. మానసిక ప్రశాంతత, కుటుంబ సమయం కూడా ముఖ్యమేనని" ట్వీట్ చేశాడు.

డెరివేటివ్స్ ట్రేడర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, "ఏదైనా షాకింగ్‌ సంఘటన జరిగినప్పుడు, ఇప్పటికే ఉన్న పొజిషన్‌లను సమయానుకూలంగా రక్షించుకునే అవకాశం పొడిగించిన ట్రేడింగ్ గంటల వల్ల ఉంటుందని, అయితే తనలాంటి యాక్టివ్‌ ట్రేడర్ల అలసట, ఒత్తిడి స్థాయిని అది పెంచుతుందని" చెప్పారు.

F&O విభాగంలో రాత్రి 11:55 గంటల వరకు & క్యాష్‌ విభాగంలో సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌ను పొడిగించే అధికారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఉంది. 

ప్రపంచ అనిశ్చితి, ఓవర్‌నైట్‌ రిస్క్‌లను నివారించడానికి ఈక్విటీ F&O, కరెన్సీ సెగ్మెంట్లలో మార్కెట్ గంటలను పొడిగించడం అవసరమని బ్రోకరేజీలు విశ్వసిస్తున్నారు.

"తక్కువ ట్రేడింగ్‌ గంటలు మన క్యాపిటల్‌ మార్కెట్ల వృద్ధిని నిరోధిస్తున్నాయి. ఎందుకంటే, ఆర్థిక మార్కెట్లు పరస్పరం లింక్‌ అయి ఉన్నాయి. హెడ్జ్‌కు అవకాశం తగ్గడం వల్ల భారతదేశం ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మారకుండా ఆగిపోతోంది. ట్రేడింగ్‌ గంటలను పెంచడం వల్ల భారతదేశం నుంచి ఎక్కువ మంది ట్రేడ్‌ చేయడానికి, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెంచడానికి అవకాశం కల్పిస్తుందని" డిస్కౌంట్ ఫ్లాట్‌ఫామ్‌ FYERS సహ వ్యవస్థాపకుడు & CEO తేజస్ ఖోడే చెప్పారు.

Gen Z, మిలీనియల్ ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ గంటల పొడిగింపు బూస్ట్‌ ఇస్తుందని, వారి ప్రస్తుత ఉద్యోగాల పని గంటల తర్వాత ఇకపై స్టాక్స్‌లోనూ ట్రేడ్‌ చేయడానికి వీలు కల్పిస్తుందని, కాబట్టి వాల్యూమ్స్‌లో పెరుగుదల సాధ్యమవుతుందని బ్రోకర్లు అంటున్నారు.

మన మార్కెట్లలో ట్రేడింగ్ గంటల తర్వాత విదేశాల వైపు వెళ్లేవాళ్లు ఇప్పుడు వెనక్కు వస్తారని, ఆ మేరకు వాల్యూమ్స్‌ తిరిగి వస్తాయని; మార్కెట్ పార్టిసిపెంట్‌లకు అదనపు ట్రేడింగ్ & ఆర్జనకు అవకాశం వస్తుందని యాక్సిస్ సెక్యూరిటీస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనూజ్ షా అన్నారు.

ఇది కూడా చదవండి: రిస్క్‌ తగ్గించేందుకు NSE కీలక నిర్ణయం, ఇకపై సాయంత్రం 5 వరకు ట్రేడింగ్‌ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
Construction Ban: నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం-ఇందులో నిజమెంత?
నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం - ఇందులో నిజమెంత?
Credit Card Settlement Offer: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
Pagani Hypercars: డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!
డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget