అన్వేషించండి

Stock Market News: స్టాక్‌ మార్కెట్‌ టేడింగ్‌ గంటలు పెంచడం వల్ల ఎవరికి, ఎంత లాభం?

ఎక్కువ గంటల పాటు ట్రేడింగ్ టెర్మినల్స్‌ చురుకుగా ఉంటే ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందన్న విషయంలో ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.

Stock Market News: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మన మార్కెట్‌ ముగిసినా, యూరోపియన్‌ మార్కెట్లు పని చేస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అమెరికన్‌ మార్కెట్‌ ఓపెన్‌ అవుతుంది. వాటి ఎఫెక్ట్‌ మన మార్కెట్ల మీద పడ్డా, మన మార్కెట్‌ ట్రేడింగ్‌ అవర్స్‌ అప్పటికే ముగిసిపోవడంతో ట్రేడర్లు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ రిస్క్‌ను తగ్గించడానికి, హెడ్జ్‌ల్లో మార్పులు, చేర్పులకు ట్రేడర్లకు అవకాశం కల్పించడానికి 'ఇంట్రెస్ట్‌ రేట్‌ డెరివేటివ్స్‌' (interest rate derivatives) ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు NSE పొడిగించింది. 

వడ్డీ రేట్ల డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ NSE తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి, అంటే ఫిబ్రవరి 23, 2023 నుంచి అమలులోకి వస్తుంది. వడ్డీ రేట్ల డెరివేటివ్స్‌ విభాగంలో (F&O) సాయంత్రం 5 గంటల వరకు ట్రేడ్‌ చేయవచ్చు. దీని ప్రకారం, ఫిబ్రవరి నెలతో ముగిసే డెరివేటివ్‌ కాంట్రాక్టులు కూడా ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 23, 2023 తర్వాత గడువు ముగియనున్న ప్రస్తుత అన్ని ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్‌లు, ఇకపై వచ్చే కొత్త ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్‌ల్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌ చేయవచ్చు. 

ట్రేడింగ్‌ గంటలు పెంచడం వల్ల ఏంటి లాభం, నష్టాలున్నాయా?
ఎక్కువ గంటల పాటు ట్రేడింగ్ టెర్మినల్స్‌ చురుకుగా ఉంటే ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందన్న విషయంలో ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. 

జీరోధా టాప్ బాస్ నితిన్ కామత్ దీనిపై ఒక ట్వీట్‌ కూడా చేశారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) కోసం ట్రేడింగ్ గంటలను పొడిగించే నిర్ణయం క్యాపిటల్ మార్కెట్ల ఆదాయాన్ని పెంచుతుందన్నారు. అయితే.. రిటైల్ ఇన్వెస్టర్ల మీద ఒత్తిడి పెరుగుతుందని, ఓవర్‌ట్రేడింగ్ కారణంగా వాళ్లు నష్టపోవచ్చంటూ హెచ్చరించారు.

నాగ్‌పుర్‌కు చెందిన ట్రేడర్‌ హర్షుభ్ షా కూడా, "ట్రేడింగ్‌ గంటల పొడిగింపు వల్ల మరో 14 ఏళ్ల తర్వాత తన ట్రేడింగ్ కెరీర్‌ను ముగించాల్సి వస్తుందని సోషల్ మీడియాలో ప్రకటించే స్థాయికి వెళ్లాడు. "సమయం పొడిగిస్తే ఒత్తిడి పెరుగుతుందని,  ఆరోగ్యం కోసం డబ్బు పెట్టాలనుకోవట్లేదని అన్నారు. మానసిక ప్రశాంతత, కుటుంబ సమయం కూడా ముఖ్యమేనని" ట్వీట్ చేశాడు.

డెరివేటివ్స్ ట్రేడర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, "ఏదైనా షాకింగ్‌ సంఘటన జరిగినప్పుడు, ఇప్పటికే ఉన్న పొజిషన్‌లను సమయానుకూలంగా రక్షించుకునే అవకాశం పొడిగించిన ట్రేడింగ్ గంటల వల్ల ఉంటుందని, అయితే తనలాంటి యాక్టివ్‌ ట్రేడర్ల అలసట, ఒత్తిడి స్థాయిని అది పెంచుతుందని" చెప్పారు.

F&O విభాగంలో రాత్రి 11:55 గంటల వరకు & క్యాష్‌ విభాగంలో సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌ను పొడిగించే అధికారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఉంది. 

ప్రపంచ అనిశ్చితి, ఓవర్‌నైట్‌ రిస్క్‌లను నివారించడానికి ఈక్విటీ F&O, కరెన్సీ సెగ్మెంట్లలో మార్కెట్ గంటలను పొడిగించడం అవసరమని బ్రోకరేజీలు విశ్వసిస్తున్నారు.

"తక్కువ ట్రేడింగ్‌ గంటలు మన క్యాపిటల్‌ మార్కెట్ల వృద్ధిని నిరోధిస్తున్నాయి. ఎందుకంటే, ఆర్థిక మార్కెట్లు పరస్పరం లింక్‌ అయి ఉన్నాయి. హెడ్జ్‌కు అవకాశం తగ్గడం వల్ల భారతదేశం ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మారకుండా ఆగిపోతోంది. ట్రేడింగ్‌ గంటలను పెంచడం వల్ల భారతదేశం నుంచి ఎక్కువ మంది ట్రేడ్‌ చేయడానికి, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెంచడానికి అవకాశం కల్పిస్తుందని" డిస్కౌంట్ ఫ్లాట్‌ఫామ్‌ FYERS సహ వ్యవస్థాపకుడు & CEO తేజస్ ఖోడే చెప్పారు.

Gen Z, మిలీనియల్ ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ గంటల పొడిగింపు బూస్ట్‌ ఇస్తుందని, వారి ప్రస్తుత ఉద్యోగాల పని గంటల తర్వాత ఇకపై స్టాక్స్‌లోనూ ట్రేడ్‌ చేయడానికి వీలు కల్పిస్తుందని, కాబట్టి వాల్యూమ్స్‌లో పెరుగుదల సాధ్యమవుతుందని బ్రోకర్లు అంటున్నారు.

మన మార్కెట్లలో ట్రేడింగ్ గంటల తర్వాత విదేశాల వైపు వెళ్లేవాళ్లు ఇప్పుడు వెనక్కు వస్తారని, ఆ మేరకు వాల్యూమ్స్‌ తిరిగి వస్తాయని; మార్కెట్ పార్టిసిపెంట్‌లకు అదనపు ట్రేడింగ్ & ఆర్జనకు అవకాశం వస్తుందని యాక్సిస్ సెక్యూరిటీస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనూజ్ షా అన్నారు.

ఇది కూడా చదవండి: రిస్క్‌ తగ్గించేందుకు NSE కీలక నిర్ణయం, ఇకపై సాయంత్రం 5 వరకు ట్రేడింగ్‌ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Telangana Latest News: అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
Bandla Ganesh : బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
Hyderabad Crime News: ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Telangana Latest News: అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
Bandla Ganesh : బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
Hyderabad Crime News: ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
Telangana Govt Employees: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 
Pawan Kalyan:
"పిఠాపురంలో రూల్‌బుక్, అభివృద్ధే మాట్లాడాలి" అధికారులకు కీలక ఆదేశాలు! మార్చి 14న భారీ బహిరంగ సభ
Bha Bha Ba OTT: ఓటీటీకి వచ్చే వారమే 'భా భా బా'... మలయాళ యాక్షన్ కామెడీలో మోహన్ లాల్ కూడా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి వచ్చే వారమే 'భా భా బా'... మలయాళ యాక్షన్ కామెడీలో మోహన్ లాల్ కూడా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Iran Latest News: ఇరాన్‌లో మరింత దిగజారిన పరిస్థితులు! 180 నగరాల్లో నిరసనలు, వందల మంది మృతి! ఇంటర్నెట్ నిషేధం, విమానాలు రద్దు!
ఇరాన్‌లో మరింత దిగజారిన పరిస్థితులు! 180 నగరాల్లో నిరసనలు, వందల మంది మృతి! ఇంటర్నెట్ నిషేధం, విమానాలు రద్దు!
Embed widget