Sai Parenteral: సాయి పారెంటరల్స్ తొలి IPO - మార్చి 24న ప్రారంభం
Sai Parenteral IPO: హైదరాబాద్ కేంద్రంగా పని చేసే సాయి పారెంటరల్స్ తొలి IPO మార్చి 24న ప్రారంభం కానుంది. రూ. 285 కోట్ల నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Sai Parenteral to launch IPO on March 24 : ఫార్మాస్యూటికల్ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సాయి పారెంటరల్స్ (Sai Parenteral ) సంస్థ తన తొలి పబ్లిక్ ఆఫర్ ను మార్చి 24న ప్రారంభించనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 285 కోట్ల తాజా నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆఫర్లో రూ. 285 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూతో పాటు, ప్రమోటర్లు , పెట్టుబడిదారుల నుంచి 32 లక్షల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉండనుంది.
ఈ ఐపీఓ మార్చి 24న మంగళవారం ప్రారంభమై మార్చి 27న శుక్రవారం ముగుస్తుంది. షేర్ల కేటాయింపు ప్రక్రియ మార్చి 30 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సంస్థ షేర్లు ఎన్ఎస్ఈ NSE, బీఎస్ఈ ఎక్స్ఛేంజీలలో ఏప్రిల్ 2, 2026న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ఇష్యూకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్ను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను కంపెనీ వ్యూహాత్మక అవసరాల కోసం ఉపయోగించనుంది. ఇందులో రూ. 110.8 కోట్లను తయారీ కేంద్రాల విస్తరణ , ఆధునీకరణకు, రూ. 18 కోట్లను కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కేటాయించనున్నారు. మిగిలిన నిధులను అప్పుల చెల్లింపులకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఆస్ట్రేలియాలోని నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ కొనుగోలు కోసం తీసుకున్న రుణాల చెల్లింపులకు వినియోగించనున్నారు.
సాయి పారెంటరల్స్ సంస్థ కార్డియోవాస్కులర్, డయాబెటిక్, శ్వాసకోశ , డెర్మటాలజీ వంటి అనేక విభాగాల్లో ఔషధాలను ఉత్పత్తి చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 163.1 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉంది. అలాగే కంపెనీ నికర లాభం కూడా దాదాపు 72 శాతం వృద్ధితో రూ. 14.45 కోట్లుగా నమోదైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు ఐదు తయారీ కేంద్రాలు ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















