అన్వేషించండి

RBI update: ఆర్బీఐ కీలక నిర్ణయం, రూ.2000 నోట్లను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన - మే 23 నుంచి నోట్లు మార్చుకోండి

RBI to withdraw Rs 2000 currency note: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తన నిర్ణయం ప్రకటించింది.

RBI to withdraw Rs 2000 currency note: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తన నిర్ణయం ప్రకటించింది. అయితే రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు మార్చుకునేందుకు ఆర్బీఐ వెసలుబాటు కల్పించింది. రూ. 2000 నోటు చెలామణి కాకుండా ఉపసంహరించుకుంది. ఇకనుంచి రూ.2 వేల నోట్లను జారీ చేయకూడదని, వినియోగదారులకు ఇవ్వకూడదని బ్యాంకులకు సూచిస్తూ ఓ ప్రకటనలో పేర్కొంది.

2018 లోనే రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. అదే సమయం నుంచి గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్లు రెండు వేల నోట్లను సైతం రద్దు చేస్తారని పలుమార్తు ప్రచారం జరిగింది. ప్రజలు అనుకున్నట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంది. ఈ నోట్లు చెలామణిలో ఉండవని పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2వేల నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. ఒకేసారి 20 వేల రూపాయల వరకు మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యులపై ఏ ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. కేవలం రూ.2 వేల నోట్లతో లావాదేవీలు జరిపే వారు, రియల్ ఎస్టేట్, పెద్ద వ్యాపారం నిర్వహించే వారికి ఈ నిర్ణయంతో కాస్త ఇబ్బంది ఉంటుందన్నారు.

మే 23న నోట్ల మార్పిడి ప్రారంభం.. 
మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు రెండు వేల నోట్లను ఎక్స్ ఛేంజ్ చేసుకోవచ్చు, డిపాజిట్ సైతం చేసుకునే వీలు కల్పించింది ఆర్బీఐ. క్లీన్ నోట్ పాలసీ కింద రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచీలలో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. 

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కొరతతో ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 24(1) ప్రకారం దేశంలో రూ.2000 నోట్లను 2016లో నవంబర్ లో ప్రవేశపెట్టారు. రెండేళ్ల అనంతరం ఈ పెద్ద నోటు ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. 2017 మార్చి నాటికి చలామణిలో ఉన్న నగదులో 2 వేల నోట్ల వాటా 89 శాతానికి చేరింది. 2018 మార్చి 31 నాటికి ఈ నోట్ల విలువ రూ.6.72 లక్షలుగా ఉంది. అయితే 2023 మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లకు పడిపోయింది.

గతంలో 2013-14లో ఇదే తరహాలో చలామణిలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకున్నట్లు కీలక ప్రకటనలో ఆర్బీఐ గుర్తుచేసింది.  బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసులలో రెండు వేల నోట్లను మార్చుకునే ప్రక్రియ మే 23న ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 30న ముగియనుందని ఆర్బీఐ తెలిపింది. మరిన్ని వివరాలకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ లో అప్ డేట్స్ చెక్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
నెలకు 1000 km డ్రైవ్‌ చేసే సీనియర్‌ సిటిజన్లకు రూ.15 లక్షల్లో పర్‌ఫెక్ట్‌ ఆటోమేటిక్‌ కార్‌ - దీనిని మిస్‌ అవ్వొద్దు!
సీనియర్‌ సిటిజన్లు ఈజీగా హ్యాండిల్‌ చేయగల సేఫ్‌, ఆటోమేటిక్‌ కార్‌ - రూ.15 లక్షల బడ్జెట్‌లో
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
Snack for Weight Loss : ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ABP Southern Rising Summit 2025: దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
Embed widget