By: ABP Desam | Updated at : 25 Mar 2023 04:22 PM (IST)
Edited By: Arunmali
ఏప్రిల్ 3-6 తేదీల్లో MPC భేటీ
RBI MPC Meeting Full Schedule: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) సమావేశం జరగనుంది. ఏప్రిల్ 3 - 6 తేదీల్లో కమిటీ సభ్యులు భేటీ అయి చర్చలు జరుపుతారు. వడ్డీ రేట్లను పెంచుతారా లేక యథాతథంగా కొనసాగిస్తారా?, ఒకవేళ పెంచితే, ఎంత మేర పెంచుతారు అన్న ప్రశ్నలకు ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నానికి సమాధానం దొరుకుతుంది.
దీంతోపాటు... వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) పరపతి విధాన కమిటీ సమావేశం అయ్యే తేదీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది, పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.
ద్వైమాసిక ప్రాతిపదికన (ప్రతి రెండు నెలలకు ఒకసారి) పరపతి విధాన కమిటీ సమావేశం అవుతుంది కాబట్టి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆరు సార్లు భేటీలు ఉంటాయి. 2023 సంవత్సరంలో ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్లో, 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో MPC మీటింగ్స్ జరుగుతాయి.
2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి MPC సమావేశం వచ్చే నెలలో అంటే ఏప్రిల్లో జరగనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి MPC సమావేశం ఏప్రిల్ 3 - 6 తేదీలలో జరుగుతుంది. యూరప్ బ్యాంక్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US FED) వడ్డీ రేట్లను నిరంతరం పెంచడం వల్ల RBIపై ఒత్తిడి పెరిగి, వడ్డీ రేట్లపై మరో కఠిన నిర్ణయం తీసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో RBI MPC సమావేశ తేదీలు
మొదటి సమావేశం: ఏప్రిల్ 3, 5, 6 తేదీలు, 2023
రెండో సమావేశం: జూన్ 6, 7, 8 తేదీలు, 2023
మూడో సమావేశం: ఆగస్టు 8, 9, 10 తేదీలు, 2023
నాలుగో సమావేశం: అక్టోబర్ 4, 5, 6 తేదీలు, 2023
ఐదో సమావేశం: డిసెంబర్ 6, 7, 8 తేదీలు, 2023
ఆరో సమావేశం: ఫిబ్రవరి 6, 7, 8 తేదీలు, 2024
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీలో అధ్యక్షుడు సహా ఐదుగురు సభ్యులు ఉంటారు. సెంట్రల్ బ్యాంక్ నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉంటారు, మరో ముగ్గురు బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. RBI గవర్నర్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. వీరంతా MPC సమావేశానికి హాజరవుతారు. గవర్నర్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. దేశ ఆర్థిక, దేశీయ పరిస్థితులను సమీక్షిస్తారు. ఆ తర్వాత రెపో రేటుపై నిర్ణయం తీసుకుంటారు.
గత సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ చెప్పిన కీలక విషయం
గ్లోబల్ ఎకనమిక్ సవాళ్లు వేగంగా పెరుగుతున్నాయని, భారతదేశంలో కూడా సెంట్రల్ బ్యాంక్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత MPC సమావేశంలోనే చెప్పారు. ఇప్పుడు, గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభంతో పాటు, US ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు ప్రక్రియను కొనసాగిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా దీనికి మద్దతు పలుకుతూ, ఇటీవల వడ్డీ రేట్లను పెంచాయి.
Stock Market News: బుల్రన్ కంటిన్యూ! 18,600 వద్ద క్లోజైన నిఫ్టీ!
Banking Services Unavailable: హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్! జూన్లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్!
Byjus Loan Default: బైజూస్కు షాక్! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్ ఎగ్గొట్టినట్టే!
Stock Market News: మార్కెట్లో బుల్ రన్! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!
Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్నాథ్
Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్
Hyderabad News: భారత్ భవన్కు కేసీఆర్ శంకుస్థాపన, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎక్స్లెన్స్, హెచ్ఆర్డీ కేంద్రం
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు