Petrol-Diesel Price, 11 November: మరోసారి పెట్రో, డీజిల్ ధరలు పెరుగుదల.. ఇక్కడ మాత్రం స్థిరం..
హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా ముందు రోజుతో పోల్చితే నిలకడగానే ఉంది.
![Petrol-Diesel Price, 11 November: మరోసారి పెట్రో, డీజిల్ ధరలు పెరుగుదల.. ఇక్కడ మాత్రం స్థిరం.. Petrol Diesel Price Today 11 November 2021 know rates fuel price in your city Telangana Andhra Pradesh Amaravati Hyderabad Petrol-Diesel Price, 11 November: మరోసారి పెట్రో, డీజిల్ ధరలు పెరుగుదల.. ఇక్కడ మాత్రం స్థిరం..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/08/ce4d4e1e9fe698cb8e1313823034fd8e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కొద్ది రోజుల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చాయి. కానీ, తాజాగా కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కాస్త ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా ముందు రోజుతో పోల్చితే నిలకడగానే ఉంది. గత ఐదు రోజుల నుంచి హైదరాబాద్లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.19 పైసలు పెరిగింది. దీంతో తాజా ధర రూ.107.88 అయింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో పెట్రోల్ ధర పాత ధరతో పోలిస్తే రూ.0.21 పైసలు పెరిగి రూ.108.59గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.19 పైసలు పెరిగి రూ.94.97 కు చేరింది. నిజామాబాద్లో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.35 పైసలు తగ్గి రూ.109.74 గా ఉంది. డీజిల్ ధర రూ.0.33 పైసలు తగ్గి రూ.96.05 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర నేడు అతి స్వల్పంగా తగ్గింది. లీటరుకు రూ.0.06 ప్రస్తుతం రూ.110.65 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.08 పైసలు తగ్గి రూ.96.69గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.90గా ఉంది. పాత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.68 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.97గా ఉంది. ఇది లీటరుకు రూ.0.63 పైసల చొప్పున పెరిగింది.
తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.58 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.0.66 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.59 పైసలు పెరిగి రూ.96.60గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా నవంబరు 8 నాటి ధరల ప్రకారం 81.55 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!
Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!
Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)