Petrol-Diesel Price 11 December 2021: స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..
ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఇంధన ధరలు తగ్గించింది. పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి.
Petrol-Diesel Price 11 December 2021: దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్టానికి చేరిన ఇంధన ధరలు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా కొంతమేర ధరలు తగ్గించినా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఇంధన ధరలు తగ్గించింది. పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్లో గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. ఇక వరంగల్లోనూ పెట్రోల్ ధర 0.27 పైసలు పెరగగా.. డీజిల్పై 0.25 పైసలు పెరిగింది. వరంగల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.96... డీజిల్ ధర రూ.94.39 గా విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.108.57 కాగా, డీజిల్ ధర రూ.94.95 అయింది. నిజామాబాద్లో ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.56 పైసలు దిగొచ్చింది. దీంతో రూ.109.53 అయింది. డీజిల్ ధర రూ.0.53 పైసలు తగ్గి రూ.95.85 అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read: Gold Rate Today: నిలకడగా బంగారం ధర.. భారీగా పతనమైన వెండి.. బులియన్ మార్కెట్లో లేటెస్ట్ రేట్లు ఇవీ..
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరుకు రూ.0.16 పైసలు తగ్గడంతో ప్రస్తుతం రూ.110.35 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.15 పైసలు తగ్గడంతో రూ.96.44గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్లో పెట్రోల్ ధర 0.17 పైసలు తగ్గడంతో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.05గా ఉంది. డీజిల్ ధర 0.16 పైసల మేర తగ్గడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.18కి దిగొచ్చింది.
చిత్తూరు జిల్లాలో ఇలా..
చిత్తూరులోనూ ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.54 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.1.80 తగ్గింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.1.62 తగ్గడంతో లీటర్ ధర రూ.96.56 అయింది.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!
Also Read: Social Media: భార్యను ట్రోల్ చేశారని.. బ్లాక్చైన్తో సొంత సోషల్ మీడియా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets