అన్వేషించండి

SEBI On Share Buyback: షేర్ల బై బ్యాక్‌కు టాటా చెబుతూ సెబీ కీలక నిర్ణయం, ఎవరికి లాభం?

స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా బై బ్యాక్‌ల రద్దు సహా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

SEBI On Share Buyback: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (Securities and Exchange Board of India - SEBI), స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా సొంత షేర్లను కంపెనీలు తిరిగి కొనుగోలు చేసే (షేర్‌ బై బ్యాక్‌) పద్ధతిని దశల వారీగా రద్దు చేయాలని నిర్ణయించింది. మంగళవారం (20 డిసెంబర్‌ 2022) జరిగిన సెబీ బోర్డు సమావేశంలో... స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా బై బ్యాక్‌ల రద్దు సహా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రస్తుతం, స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి షేర్ బై బ్యాక్ చేస్తున్న పద్ధతిలో ఆశ్రిత పక్షపాతానికి, అనుచిత ప్రాధాన్యానికి అవకాశం ఉంది కాబట్టి, 2025 ఏప్రిల్‌ నుంచి దశల వారీగా తగ్గిస్తూ, పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు SEBI చైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్ తెలిపారు. టెండర్ మార్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బై బ్యాక్‌ నిబంధనలకు సంబంధించి,  HDFC వైస్ చైర్మన్ & CEA కెకీ మిస్త్రీ కమిటీ తన రిపోర్టులో చేసిన సిఫారసుల ఆధారంగా సెబీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 

ప్రస్తుతం 2 బై బ్యాక్‌ పద్ధతులు
ప్రస్తుతం, కంపెనీలు రెండు పద్ధతుల్లో సొంత షేర్లను బై బ్యాక్‌ చేస్తున్నాయి. ఒకటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ రూట్‌ (ఓపెన్‌ మార్కెట్‌). రెండోది టెండర్‌ రూట్‌. 

స్టాక్‌ ఎక్స్ఛేంజీ రూట్‌లో, స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో ఉన్న సెల్లర్స్‌ నుంచి షేర్లను కంపెనీలు తిరిగి కొనుగోలు చేస్తాయి. ఇది ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ. ఈ పద్ధతిలో కంపెనీలు తమకు నచ్చిన వాళ్ల దగ్గరి నుంచి షేర్లను కొనవచ్చు. ఆశ్రిత పక్షపాతం చూపడానికి ఇక్కడ అవకాశం ఉంది. పైగా, ఇన్వెస్టర్‌ తన షేర్లను అమ్మినప్పుడు.. ఓపెన్‌ మార్కెట్‌ రూట్‌లో వాటిని కంపెనీయే కొన్నదా, లేదా వేరే ఇన్వెస్టర్‌ కొన్నారా అన్నది కూడా తెలీదు. ఈ పద్ధతిలో, చిన్న మదుపరులకు (రిటైల్‌ ఇన్వెస్టర్లు) దాదాపుగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. 

చిన్న ఇన్వెస్టర్లకు ప్రయోజనం
టెండర్‌ పద్ధతిలో ఇలా జరగదు. కంపెనీలు షేర్‌ బై బ్యాక్‌ కోసం కొంత ధరను (ఆఫర్‌ ప్రైస్‌) ప్రకటిస్తాయి. ఈ పద్ధతిలో, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి బడా మదుపర్ల వరకు తమ షేర్లను విక్రయించడానికి టెండర్‌ వేయొచ్చు. కంపెనీకి వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా, షేర్ల కొనుగోలు రేషియోను (బై బ్యాక్‌ రేషియో) కంపెనీ ప్రకటిస్తుంది. టెండర్‌ వేసిన ప్రతి ఇన్వెస్టర్‌ దగ్గరి నుంచి ఆ రేషియో ప్రకారం, ముందుగా ప్రకటించిన ధర చెల్లించి షేర్లను కొంటుంది. ఇక్కడ జరిగే ప్రతి స్టెప్‌ బహిరంగమే కాబట్టి, అనుచిత లబ్ధి పొందడానికి ఎవరికీ అవకాశం ఉండదు. కాబట్టి, చిన్న ఇన్వెస్టర్లు కూడా ఈ పద్ధతిలో సమాన ప్రయోజనం పొందుతారు.

ఎక్స్ఛేంజ్‌ల ద్వారా షేర్ల బై బ్యాక్‌కు అనుమతి ఉన్నంత కాలం, బై బ్యాక్ చేపట్టేందుకు ఎక్స్ఛేంజ్‌లో స్పెషల్‌ విండో ప్రారంభించనున్నట్లు సెబీ తెలిపింది. ఈ వ్యవస్థ ద్వారానే కంపెనీలు షేర్ల బై బ్యాక్‌ చేపట్టాలి. స్టాక్ మార్కెట్ నుంచి బై బ్యాక్ ద్వారా సేకరించిన మొత్తంలో 75 శాతాన్ని కంపెనీలు వినియోగించుకోవాలని బోర్డు సమావేశంలో సెబీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ పరిమితి 50 శాతంగా ఉంది. 

ప్రస్తుతం 90 రోజులుగా ఉన్న బై బ్యాక్‌ సమయాన్ని 2023 ఏప్రిల్ 1 నుంచి 66 రోజులకు (18 రోజులు తగ్గింపు), 2024 ఏప్రిల్‌ 1 నుంచి 22 రోజులకు సెబీ తగ్గించింది.

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget