అన్వేషించండి

2000 Rupee Notes: రూ.2 వేల నోట్లను 8వ తేదీ తర్వాత కూడా మార్చుకోవచ్చు, షరతులు వర్తిస్తాయి

రూ. 12,000 కోట్ల విలువైన ఈ నోట్లు ఇప్పటికీ మార్కెట్‌లోనే ఉన్నాయి.

2000 Rupee Notes: మీ దగ్గర ఇంకా రూ. 2000 నోట్లు మిగిలి ఉంటే, వాటిని బ్యాంక్ బ్రాంచ్ లేదా పోస్టాఫీసులో డిపాజిట్ చేయడానికి ఈ రోజే (అక్టోబర్ 7, 2023) లాస్ట్‌ డేట్‌. అయితే, రేపటి నుంచి కూడా ఈ పెద్ద నోట్లను మార్చుకోవడానికి ఒక ఆప్షన్‌ ఉంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆ ఆప్షన్‌ గురించి చెప్పారు.

శుక్రవారం, రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్‌, ఇంకా 12,000 కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి తిరిగి రాలేదని చెప్పారు. అంటే రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లలో దాదాపు 97 శాతం మాత్రమే తిరిగి వచ్చాయి. రూ. 12,000 కోట్ల విలువైన ఈ నోట్లు ఇప్పటికీ మార్కెట్‌లోనే ఉన్నాయి.

రూ.2000 నోట్లను అక్టోబర్ 7 తర్వాత కూడా మార్చుకోవచ్చు
ఎవరి దగ్గరైనా రూ. 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోతే, అక్టోబర్ 7 తర్వాత కూడా వాటిని డిపాజిట్‌ చేయడం లేదా ఎక్స్‌చేంజ్‌ చేయాలనుకుంటే, అందుకు కొన్ని ఆప్షన్లను శక్తికాంత దాస్‌ చెప్పారు. 8 అక్టోబర్ 2023 నుంచి రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం వీలవుతుంది. అయితే బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో వాటిని తీసుకోరు. రిజర్వ్‌ బ్యాంక్‌ రీజినల్‌ ఆఫీసుల్లో మాత్రమే పెద్ద నోట్లను తీసుకుంటారు. ఆర్‌బీఐకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఆఫీసుల్లో పింక్‌ నోట్లను డిపాజిట్‌ చేయడానికి లేదా ఎక్స్‌చేంజ్‌ చేసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. 

మొదటి పద్ధతి - సామాన్య ప్రజలు, సంస్థలు RBI ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. మార్పిడి కోసం 20,000 రూపాయల పరిమితి ఉంది. అంటే, సాధారణ ప్రజలు లేదా సంస్థలు RBI ప్రాంతీయ కార్యాలయంలో ఒకేసారి 10 రెండు వేల రూపాయల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. భారతదేశంలో మీకు ఉన్న బ్యాంక్ ఖాతాలో ఆ డబ్బును డిపాజిట్ చేయాలనుకుంటే మాత్రం ఎలాంటి పరిమితి లేదు.

రెండో పద్ధతి - రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ లేదా ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయానికి పంపవచ్చు. ఆ మొత్తాన్ని భారతదేశంలోని వారి బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేస్తారు.

కోర్టులు లేదా చట్టపరమైన సంస్థలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, దర్యాప్తులో పాల్గొనే సంస్థలు లేదా అమలులో పాలుపంచుకున్న పబ్లిక్ అథారిటీలు కూడా రూ. 2000 నోట్లను దేశంలో ఉన్న RBI ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్ చేయవచ్చు. నోట్లు డిపాజిట్ చేయడానికి ఆయా సంస్థలకు కూడా పరిమితి లేదు.

గుర్తింపు కార్డు తప్పనిసరి
RBI నిబంధనల ప్రకారం, 2000 రూపాయల నోట్లతో పాటు, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును సమర్పించాలి. గుర్తింపు కార్డు లేకుండా RBI ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసుకోరు.

మరో ఆసక్తికర కథనం: షేర్ల బైబ్యాక్‌పై కీలక అప్‌డేట్‌, వచ్చే బుధవారమే కంపెనీ డైరెక్టర్ల మీటింగ్‌

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ice Cream Price Hike యుద్ధానికి కరిగిపోతున్న ఐస్‌క్రీమ్, చాక్లెట్‌! భారీగా పెరుగుతున్న ధరలు!
యుద్ధానికి కరిగిపోతున్న ఐస్‌క్రీమ్, చాక్లెట్‌! భారీగా పెరుగుతున్న ధరలు!
Indian Raiways Free Services: రైలు టికెట్‌తో పాటు ప్రయాణికులకు లభించే ఉచిత సేవలు, సౌకర్యాలు ఇవే
రైలు టికెట్‌తో పాటు ప్రయాణికులకు లభించే ఉచిత సేవలు, సౌకర్యాలు ఇవే
Home Loan Tips: హోం లోన్ గడువు ఎంచుకునేటప్పుడు ఈ పొరపాటు చేయవద్దు..
హోం లోన్ గడువు ఎంచుకునేటప్పుడు ఈ పొరపాటు చేయవద్దు..
8th Pay Commission: కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Punjab Crisis: పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Embed widget