అన్వేషించండి

EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు

EPFO News: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఇప్పుడు EPF వేతన పరిమితి 15,000 నుంచి 25,000 రూపాయల వరకు పెరగవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆర్థిక శాఖ EPF/EPS వేతన పరిమితి పెంపునకు ఆమోదం తెలిపింది.
  • రూ.25 వేల లోపు వారికి పెన్షన్, పొదుపు సౌకర్యాలు లభిస్తాయి.
  • దీనివల్ల కంపెనీలపై ఆర్థిక భారం పెరుగుతుంది, ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయి.
  • కేబినెట్ ఆమోదం తర్వాత 2027 ఏప్రిల్ 1 నుండి అమలు కావచ్చు.

EPFO News: భారత్‌లో ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో కోట్లాది మంది ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్నారు. చాలా కాలం నుంచి ఉద్యోగ సంఘాలు EPS వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఉద్యోగుల PFకు సంబంధించిన పెన్షన్ పొదుపు మరింతగా పెరగనుంది. దీనిపై కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 

కేంద్ర ప్రభుత్వ ఏం నిర్ణయం తీసుకుంది ?
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి EPF, EPS పరిమితిని పెంచేందుకు సిద్ధమైంది. అవసరమైన రిటైర్మెంట్ ఫండ్ వేతన పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి 25 వేల రూపాయలకు పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. నెక్ట్స్ ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం కోసం పంపనున్నారు. ఆ తర్వాతే కొత్త పరిమితి అమలులోకి వచ్చే తేదీపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. 

ఉద్యోగులకు కలిగే బెనిఫిట్స్
ఈ కొత్త పరిమితి అమలులోకి రావడంతో 15000 నుంచి 25 వేల రూపాయల వరకు వేతనం ఉండే ఉద్యోగులకు కూడా భవిష్యత్తు కోసం పొదుపు, పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. దీని వల్ల ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సామాజిక భద్రత పెరగడంతో వారికి మేలు జరగనుంది.

కంపెనీలపై పెరగనున్న భారం
కేంద్ర ప్రభుత్వం చేయనున్న ఈ మార్పు ప్రభావం కంపెనీలపై పడుతుంది. ఎక్కువ మంది ఉద్యోగులను EPF, EPSలో చేర్చాల్సి రావడంతో కంపెనీలు ఎక్కువ వాటా చెల్లించాల్సి వస్తుంది. దీంతో వారి పేరోల్ ఖర్చు మరింత పెరగవచ్చు. EPF వ్యవస్థలో యజమాని బేసిక్ జీతంలో 8.33 శాతం పెన్షన్ ఫండ్‌కు చెల్లిస్తాడు.  ప్రభుత్వం 1.16 శాతం వాటా ఇస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఖర్చులు సైతం పెరుగుతాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2026-27లో EPS కోసం కేంద్రం 11,144 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది.

ప్రతిపాదన ఆమోదం పొందిన తరువాత ఏమవుతుంది
ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, 15000 నుంచి 25 వేల వరకు శాలరీ పొందే ఉద్యోగులు కూడా తప్పనిసరిగా EPF, EPS పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం 15 వేల వరకు శాలరీ ఉన్న ఉద్యోగులు ఈ పథకాలలో చేరడం తప్పనిసరి. అంతకంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగులు కావాలంటే స్కీమ్ నుంచి బయటకు వెళ్లవచ్చు. వారిని చేర్చాల్సిన చట్టపరమైన బాధ్యత యజమానిపై ఉండదు. 

కొత్త రూల్ ఎప్పుడు అమలులోకి వస్తుంది?
కేబినెట్ ఆమోదం తర్వాత కంపెనీలు తమ పేరోల్ సిస్టమ్, అవసరమైన ప్రక్రియల్లో మార్పులు చేసుకోవడానికి సమయం పట్టవచ్చు. అందువల్ల ఈ రూల్ తక్షణమే అమలులోకి రాదు. ప్రస్తుతం కొత్త EPF వేతన పరిమితి 1 ఏప్రిల్ 2027 నుంచి అమలులోకి రావచ్చని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆర్థిక శాఖ నిర్ణయంపై కేంద్ర కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ నిర్ణయం తర్వాతే ఖరారు కానుంది. 

Frequently Asked Questions

EPS వేతన పరిమితిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి?

ఆర్థిక మంత్రిత్వ శాఖ EPS వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుండి రూ.25,000కి పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన కేబినెట్ ఆమోదం కోసం వెళ్తుంది.

కొత్త పరిమితి అమలులోకి వస్తే ఏ ఉద్యోగులకు లాభం చేకూరుతుంది?

కొత్త పరిమితి అమలుతో, నెలకు రూ.15,000 నుండి రూ.25,000 వరకు వేతనం పొందే ఉద్యోగులకు PF, పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. ఇది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను పెంచుతుంది.

ఈ కొత్త నిబంధన ఎప్పటి నుండి అమలయ్యే అవకాశం ఉంది?

ప్రస్తుతం, ఈ కొత్త EPF వేతన పరిమితి 1 ఏప్రిల్ 2027 నుండి అమలులోకి రావచ్చని భావిస్తున్నారు. అయితే, కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.

ఈ మార్పు వల్ల కంపెనీలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఎక్కువ మంది ఉద్యోగులను EPF, EPSలో చేర్చాల్సి రావడంతో కంపెనీలు ఎక్కువ వాటా చెల్లించాల్సి వస్తుంది. దీంతో వారి పేరోల్ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget