అన్వేషించండి

Silver prices: వెండి ధరలు ఒక్క రోజులో 21వేలు పడిపోవడానికి ఆరు కారణాలు ఇవే !

Silver prices crashed: ఒక్క రోజులోనే వెండి ధరలు 21వేలు తగ్గిపోయాయి. దీనికి ప్రధానమైన ఆరు కారణాలు ఇవీ !

6 reasons why silver prices crashed by Rs 21000: వెండి ధరలు ఒక్కరోజులోనే కిలోకు సుమారు రూ. 21,000 మేర భారీగా పతనమవ్వడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేసింది. ఈ విదంగా పతనమవడానికి ప్రధానంగా ఆరు కారణాలు చెప్పుకోవచ్చు. 

1. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు సంకేతాలు 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై సానుకూల సంకేతాలు రావడం వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయన్న వార్తలతో మార్కెట్‌లో భయం తగ్గింది. యుద్ధం వంటి అనిశ్చిత సమయాల్లో ఇన్వెస్టర్లు వెండిని సురక్షితమైన పెట్టుబడిగా  చూస్తారు, కానీ పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలియగానే అమ్మకాలకు మొగ్గు చూపారు.

2. లాభాల స్వీకరణ

2025 ప్రారంభం నుండి వెండి అద్భుతమైన లాభాలను అందించింది. కిలో ధర రూ. 2.54 లక్షల వద్ద రికార్డు స్థాయిని తాకినప్పుడు, ఇన్వెస్టర్లు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకోవాలని భావించారు. ఒకేసారి పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడం వల్ల ధర ఒక్కసారిగా కిందికి పడిపోయింది.

 3. టెక్నికల్ కరెక్షన్ 

ఏదైనా వస్తువు ధర అతి తక్కువ కాలంలో విపరీతంగా పెరిగినప్పుడు దానిని  ఓవర్ హీటెడ్  మార్కెట్ అంటారు. వెండి ధర దాని సగటు ధర  కంటే చాలా ఎక్కువ స్థాయికి చేరింది. ఇలాంటి సమయాల్లో కరెక్షన్ రావడం సహజం. ఈ సాంకేతిక కారణాల వల్ల ధరలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకునే క్రమంలో భారీ పతనం చోటుచేసుకుంది.

 4. డాలర్ ఇండెక్స్ బలపడటం 

అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ బలోపేతం కావడం వల్ల వెండి ధరలపై ఒత్తిడి పెరిగింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు, ఇతర కరెన్సీలు వాడే వారికి వెండి కొనడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీనివల్ల అంతర్జాతీయంగా వెండికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి.

 5. ఎక్స్ఛేంజ్ మార్జిన్ పెంపు  

చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్  వెండి ట్రేడింగ్‌పై మార్జిన్ మనీని పెంచింది. అంటే, వెండిలో వ్యాపారం చేసే ట్రేడర్లు ఇప్పుడు ఎక్కువ నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదనపు నగదును చెల్లించలేక చాలా మంది ట్రేడర్లు తమ వద్ద ఉన్న వెండి కాంట్రాక్టులను వదిలేశారు, ఇది పతనానికి మరో ప్రధాన కారణమైంది.

 6. ఆల్గో ట్రేడింగ్ , స్టాప్-లాస్ ట్రిగ్గర్స్ 

ప్రస్తుత మార్కెట్లు ఎక్కువగా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ద్వారా నడుస్తున్నాయి. ధర ఒక నిర్దిష్ట స్థాయి కంటే కిందకు పడిపోగానే, ఆటోమేటిక్‌గా అమ్మకాలు జరిగిపోయేలా  స్టాప్-లాస్  ఆర్డర్లు పెడతారు. వెండి ధర రూ. 21,000 పడిపోయే క్రమంలో వరుసగా స్టాప్-లాస్ ఆర్డర్లు ట్రిగ్గర్ అవ్వడం వల్ల అమ్మకాల వేగం పెరిగి, ధరలు ఊహించని రీతిలో క్షీణించాయి.
 
మరి వెండి ధరలు పడిపోతూనే ఉంటాయా...పెరుగుతాయా అన్నది .. రాబోయే రోజుల్లో మార్కెట్ స్పందనను బట్టి అర్థం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.                                  

 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget