అన్వేషించండి

Electric Vehicles Charging Tips: మీది ఎలక్ట్రిక్‌ వెహికలా? చార్జింగ్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్త, సైబర్‌ నేరగాళ్లు మీ డేటాను దోచుకోవచ్చు!

Electric Vehicles Charging Tips: ఎలక్ట్రిక్‌ వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు కాదు. చార్జింగ్‌ స్టేషన్లు, గ్రిడ్‌, సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉండటంతో సైబర్‌ దాడులకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ స్టేషన్లు, గ్రిడ్, యాప్‌లతో డేటా మార్పిడి చేసుకుంటాయి.
  • చార్జింగ్ స్టేషన్లు, వాహనాల సాఫ్ట్‌వేర్ సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా మారుతున్నాయి.
  • వాహనం నుంచి గ్రిడ్ కు విద్యుత్ సరఫరాలో లోపాలు వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
  • వ్యక్తిగత డేటా చోరీ, వాహన భద్రతకు సైబర్ ముప్పులు పొంచి ఉన్నాయి.

Electric Vehicle Cyber Security: ఇప్పుడు మన రోడ్లపై ఎలక్ట్రిక్‌ వాహనాలు సాధారణ దృశ్యంగా మారిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులు తగ్గుతాయన్న ఆశతో, పర్యావరణానికి మేలు చేస్తాయన్న నమ్మకంతో చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ వాహనాల్లో ఒక విషయం ఎక్కువగా చర్చకు రావడం లేదు. అదే సైబర్‌ భద్రత.

ఎలక్ట్రిక్‌ వాహనం అంటే కేవలం బ్యాటరీ, మోటార్‌ మాత్రమే కాదు. ఇవి చార్జింగ్‌ స్టేషన్లు, విద్యుత్‌ గ్రిడ్‌, మొబైల్‌ యాప్‌లు, క్లౌడ్‌ సర్వర్లతో ఎప్పటికప్పుడు డేటా మార్పిడి చేసుకుంటుంటాయి. ఈ అనుసంధానం మీకు సౌకర్యంగా అనిపించినా, అదే సైబర్‌ నేరగాళ్లకు దారి చూపిస్తోంది.

చార్జింగ్‌ స్టేషన్లే ప్రధాన టార్గెట్‌

పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు EV వ్యవస్థలో కీలక భాగం. ఇవి విద్యుత్‌ సరఫరా, యూజర్‌ గుర్తింపు, బిల్లింగ్‌, గ్రిడ్‌తో కమ్యూనికేషన్‌ వంటి పనులు చేస్తాయి. అందుకే హ్యాకర్లు మొదటగా కన్నేయేది వీటిపైనే. ఒకవేళ చార్జింగ్‌ నెట్‌వర్క్‌లో లోపాలు ఉంటే, చార్జింగ్‌ ఆగిపోవడం, తప్పుడు బిల్లింగ్‌, ఒకే సమయంలో ఎక్కువ వాహనాలకు సమస్యలు రావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.

వాహనం నుంచి గ్రిడ్‌కు కూడా విద్యుత్‌

కొత్త తరం ఈవీల్లో ‘వాహనం నుంచి గ్రిడ్‌కు’ విద్యుత్‌ పంపే టెక్నాలజీ వస్తోంది. అంటే వాహనం కేవలం విద్యుత్‌ వినియోగదారుగానే కాదు, అవసరమైతే సరఫరాదారుగా కూడా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వాహనంలో సైబర్‌ లోపం ఉంటే, అది మొత్తం స్థానిక విద్యుత్‌ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నిపుణులు దీనిని ‘మొబైల్‌ ఎనర్జీ హబ్‌’గా అభివర్ణిస్తున్నారు.

డేటా లీక్‌ అయితే ఏమవుతుంది?

ఎలక్ట్రిక్‌ వాహనాలు యూజర్‌ లొకేషన్‌, చార్జింగ్‌ అలవాట్లు, చెల్లింపుల వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటా తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వ్యక్తిగత గోప్యతకే కాదు, ఆర్థిక భద్రతకూ ముప్పే. అందుకే డేటా ఎన్‌క్రిప్షన్‌, గోప్యతను కాపాడే సిస్టమ్‌లపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ అన్ని కంపెనీలు ఒకే స్థాయిలో భద్రత పాటిస్తున్నాయా అన్నదే ప్రశ్న.

వాహన భద్రతకు కూడా ప్రమాదం

ఈవీల్లో ఇంజిన్‌ పనితీరు, వేగం, స్టెబిలిటీ అన్నీ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగానే నియంత్రణలో ఉంటాయి. ఒకవేళ హ్యాకర్లు ఈ సిస్టమ్‌ల్లోకి చొరబడితే, అది ప్రయాణికుల భద్రతకే ముప్పుగా మారుతుంది. కొన్ని పరిశోధనల్లో అసాధారణ ప్రవర్తనను గుర్తించే టెక్నాలజీలను పరీక్షించారు. అవి ఉపయోగకరంగానే ఉన్నా, వ్యవస్థ ఎంత క్లిష్టంగా మారిందన్నది ఇవి నిరూపిస్తున్నాయి.

ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాని భద్రత

ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు ఎక్కువగా ఒక్కో భాగంపైనే దృష్టి పెట్టాయి. కానీ మొత్తం ఈవీ వ్యవస్థను ఒకే ఫ్రేమ్‌లో చూసే అధ్యయనాలు చాలా తక్కువ. చార్జింగ్‌ కంపెనీలు, వాహన తయారీదారులు, విద్యుత్‌ సంస్థలు, నియంత్రణ సంస్థలు కలిసి పనిచేయకపోతే భద్రత బలపడదు.

నిపుణుల మాటల్లో చెప్పాలంటే... ఎలక్ట్రిక్‌ వాహనాలు అసురక్షితమైనవని కాదు. కానీ టెక్నాలజీ వేగంగా ముందుకు వెళ్తుండగా, దానిని కాపాడే రక్షణ వ్యవస్థలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో, ఈవీ అంటే కేవలం రేంజ్‌, ధర మాత్రమే కాదు... సైబర్‌ భద్రత కూడా కీలక అంశంగా మారబోతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ వాహనాలలో సైబర్ భద్రత ఎందుకు ముఖ్యం?

ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ స్టేషన్లు, గ్రిడ్, యాప్‌లు, సర్వర్‌లతో డేటాను మార్పిడి చేసుకుంటాయి. ఈ అనుసంధానం సైబర్ నేరగాళ్లకు దారి చూపవచ్చు.

సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు?

సైబర్ నేరగాళ్లు మొదటగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లపై కన్నేస్తారు. ఈ నెట్‌వర్క్‌లలో లోపాలు ఉంటే చార్జింగ్ ఆగిపోవడం, తప్పుడు బిల్లింగ్ వంటి సమస్యలు వస్తాయి.

వాహనం నుంచి గ్రిడ్‌కు విద్యుత్ పంపే టెక్నాలజీ వల్ల కలిగే సైబర్ ముప్పు ఏమిటి?

ఒక వాహనంలో సైబర్ లోపం ఉంటే, అది మొత్తం స్థానిక విద్యుత్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని 'మొబైల్ ఎనర్జీ హబ్' గా పరిగణిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలు సేకరించే డేటా లీక్ అయితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి?

యూజర్ లొకేషన్, చార్జింగ్ అలవాట్లు, చెల్లింపుల వివరాలు వంటి సున్నితమైన సమాచారం తప్పుడు చేతుల్లో పడితే వ్యక్తిగత గోప్యతకు, ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో సైబర్ భద్రత ప్రస్తుత స్థితి ఏమిటి?

ప్రస్తుతం పరిశోధనలు ఎక్కువగా ఒక్కో భాగంపైనే దృష్టి సారించాయి. సమగ్ర భద్రతా అధ్యయనాలు తక్కువ. చార్జింగ్ కంపెనీలు, వాహన తయారీదారులు, విద్యుత్ సంస్థలు కలిసి పనిచేస్తేనే భద్రత పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

1000 KM రేంజ్ ఉన్న Hector Tomahawk ఫస్ట్ లుక్ ఎలా ఉంది? తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
1000 KM రేంజ్ ఉన్న Hector Tomahawk ఫస్ట్ లుక్ ఎలా ఉంది? తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
Royal Enfield Bullet 350 ఆన్-రోడ్ ధర ఎంత? రూ.10000 చెల్లిస్తే నెలవారీ EMI ఎంత కట్టాలి
Royal Enfield Bullet 350 ఆన్-రోడ్ ధర ఎంత? రూ.10000 చెల్లిస్తే నెలవారీ EMI ఎంత కట్టాలి
కొత్త Bajaj Pulsar 125లో 4 వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
కొత్త Bajaj Pulsar 125లో ఏ వేరియంట్ కొనాలి? రూ.11,500 తేడాలో మారే ఫీచర్లు ఏంటి?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raidurgam Hit and Run Incident: రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
Weapons Missing In Hyderabad: బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
Vijayawada Crime News: పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Kitchen Sink Drain : కిచెన్​లో సింక్​తో ప్రాబ్లమా? ప్లంబర్ అవసరం లేకుండా ముసుకుపోయిన సింక్ డ్రెయిన్ ఇలా క్లీన్ చేసేయండి
కిచెన్​లో సింక్​తో ప్రాబ్లమా? ప్లంబర్ అవసరం లేకుండా ముసుకుపోయిన సింక్ డ్రెయిన్ ఇలా క్లీన్ చేసేయండి
CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
Sadhguru Donation to Nepal: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
Embed widget