అన్వేషించండి

Electric Vehicles Charging Tips: మీది ఎలక్ట్రిక్‌ వెహికలా? చార్జింగ్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్త, సైబర్‌ నేరగాళ్లు మీ డేటాను దోచుకోవచ్చు!

Electric Vehicles Charging Tips: ఎలక్ట్రిక్‌ వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు కాదు. చార్జింగ్‌ స్టేషన్లు, గ్రిడ్‌, సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉండటంతో సైబర్‌ దాడులకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ స్టేషన్లు, గ్రిడ్, యాప్‌లతో డేటా మార్పిడి చేసుకుంటాయి.
  • చార్జింగ్ స్టేషన్లు, వాహనాల సాఫ్ట్‌వేర్ సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా మారుతున్నాయి.
  • వాహనం నుంచి గ్రిడ్ కు విద్యుత్ సరఫరాలో లోపాలు వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
  • వ్యక్తిగత డేటా చోరీ, వాహన భద్రతకు సైబర్ ముప్పులు పొంచి ఉన్నాయి.

Electric Vehicle Cyber Security: ఇప్పుడు మన రోడ్లపై ఎలక్ట్రిక్‌ వాహనాలు సాధారణ దృశ్యంగా మారిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులు తగ్గుతాయన్న ఆశతో, పర్యావరణానికి మేలు చేస్తాయన్న నమ్మకంతో చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ వాహనాల్లో ఒక విషయం ఎక్కువగా చర్చకు రావడం లేదు. అదే సైబర్‌ భద్రత.

ఎలక్ట్రిక్‌ వాహనం అంటే కేవలం బ్యాటరీ, మోటార్‌ మాత్రమే కాదు. ఇవి చార్జింగ్‌ స్టేషన్లు, విద్యుత్‌ గ్రిడ్‌, మొబైల్‌ యాప్‌లు, క్లౌడ్‌ సర్వర్లతో ఎప్పటికప్పుడు డేటా మార్పిడి చేసుకుంటుంటాయి. ఈ అనుసంధానం మీకు సౌకర్యంగా అనిపించినా, అదే సైబర్‌ నేరగాళ్లకు దారి చూపిస్తోంది.

చార్జింగ్‌ స్టేషన్లే ప్రధాన టార్గెట్‌

పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు EV వ్యవస్థలో కీలక భాగం. ఇవి విద్యుత్‌ సరఫరా, యూజర్‌ గుర్తింపు, బిల్లింగ్‌, గ్రిడ్‌తో కమ్యూనికేషన్‌ వంటి పనులు చేస్తాయి. అందుకే హ్యాకర్లు మొదటగా కన్నేయేది వీటిపైనే. ఒకవేళ చార్జింగ్‌ నెట్‌వర్క్‌లో లోపాలు ఉంటే, చార్జింగ్‌ ఆగిపోవడం, తప్పుడు బిల్లింగ్‌, ఒకే సమయంలో ఎక్కువ వాహనాలకు సమస్యలు రావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.

వాహనం నుంచి గ్రిడ్‌కు కూడా విద్యుత్‌

కొత్త తరం ఈవీల్లో ‘వాహనం నుంచి గ్రిడ్‌కు’ విద్యుత్‌ పంపే టెక్నాలజీ వస్తోంది. అంటే వాహనం కేవలం విద్యుత్‌ వినియోగదారుగానే కాదు, అవసరమైతే సరఫరాదారుగా కూడా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వాహనంలో సైబర్‌ లోపం ఉంటే, అది మొత్తం స్థానిక విద్యుత్‌ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నిపుణులు దీనిని ‘మొబైల్‌ ఎనర్జీ హబ్‌’గా అభివర్ణిస్తున్నారు.

డేటా లీక్‌ అయితే ఏమవుతుంది?

ఎలక్ట్రిక్‌ వాహనాలు యూజర్‌ లొకేషన్‌, చార్జింగ్‌ అలవాట్లు, చెల్లింపుల వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటా తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వ్యక్తిగత గోప్యతకే కాదు, ఆర్థిక భద్రతకూ ముప్పే. అందుకే డేటా ఎన్‌క్రిప్షన్‌, గోప్యతను కాపాడే సిస్టమ్‌లపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ అన్ని కంపెనీలు ఒకే స్థాయిలో భద్రత పాటిస్తున్నాయా అన్నదే ప్రశ్న.

వాహన భద్రతకు కూడా ప్రమాదం

ఈవీల్లో ఇంజిన్‌ పనితీరు, వేగం, స్టెబిలిటీ అన్నీ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగానే నియంత్రణలో ఉంటాయి. ఒకవేళ హ్యాకర్లు ఈ సిస్టమ్‌ల్లోకి చొరబడితే, అది ప్రయాణికుల భద్రతకే ముప్పుగా మారుతుంది. కొన్ని పరిశోధనల్లో అసాధారణ ప్రవర్తనను గుర్తించే టెక్నాలజీలను పరీక్షించారు. అవి ఉపయోగకరంగానే ఉన్నా, వ్యవస్థ ఎంత క్లిష్టంగా మారిందన్నది ఇవి నిరూపిస్తున్నాయి.

ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాని భద్రత

ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు ఎక్కువగా ఒక్కో భాగంపైనే దృష్టి పెట్టాయి. కానీ మొత్తం ఈవీ వ్యవస్థను ఒకే ఫ్రేమ్‌లో చూసే అధ్యయనాలు చాలా తక్కువ. చార్జింగ్‌ కంపెనీలు, వాహన తయారీదారులు, విద్యుత్‌ సంస్థలు, నియంత్రణ సంస్థలు కలిసి పనిచేయకపోతే భద్రత బలపడదు.

నిపుణుల మాటల్లో చెప్పాలంటే... ఎలక్ట్రిక్‌ వాహనాలు అసురక్షితమైనవని కాదు. కానీ టెక్నాలజీ వేగంగా ముందుకు వెళ్తుండగా, దానిని కాపాడే రక్షణ వ్యవస్థలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో, ఈవీ అంటే కేవలం రేంజ్‌, ధర మాత్రమే కాదు... సైబర్‌ భద్రత కూడా కీలక అంశంగా మారబోతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ వాహనాలలో సైబర్ భద్రత ఎందుకు ముఖ్యం?

ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ స్టేషన్లు, గ్రిడ్, యాప్‌లు, సర్వర్‌లతో డేటాను మార్పిడి చేసుకుంటాయి. ఈ అనుసంధానం సైబర్ నేరగాళ్లకు దారి చూపవచ్చు.

సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు?

సైబర్ నేరగాళ్లు మొదటగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లపై కన్నేస్తారు. ఈ నెట్‌వర్క్‌లలో లోపాలు ఉంటే చార్జింగ్ ఆగిపోవడం, తప్పుడు బిల్లింగ్ వంటి సమస్యలు వస్తాయి.

వాహనం నుంచి గ్రిడ్‌కు విద్యుత్ పంపే టెక్నాలజీ వల్ల కలిగే సైబర్ ముప్పు ఏమిటి?

ఒక వాహనంలో సైబర్ లోపం ఉంటే, అది మొత్తం స్థానిక విద్యుత్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని 'మొబైల్ ఎనర్జీ హబ్' గా పరిగణిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలు సేకరించే డేటా లీక్ అయితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి?

యూజర్ లొకేషన్, చార్జింగ్ అలవాట్లు, చెల్లింపుల వివరాలు వంటి సున్నితమైన సమాచారం తప్పుడు చేతుల్లో పడితే వ్యక్తిగత గోప్యతకు, ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో సైబర్ భద్రత ప్రస్తుత స్థితి ఏమిటి?

ప్రస్తుతం పరిశోధనలు ఎక్కువగా ఒక్కో భాగంపైనే దృష్టి సారించాయి. సమగ్ర భద్రతా అధ్యయనాలు తక్కువ. చార్జింగ్ కంపెనీలు, వాహన తయారీదారులు, విద్యుత్ సంస్థలు కలిసి పనిచేస్తేనే భద్రత పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget