అన్వేషించండి

Electric Vehicles Charging Tips: మీది ఎలక్ట్రిక్‌ వెహికలా? చార్జింగ్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్త, సైబర్‌ నేరగాళ్లు మీ డేటాను దోచుకోవచ్చు!

Electric Vehicles Charging Tips: ఎలక్ట్రిక్‌ వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు కాదు. చార్జింగ్‌ స్టేషన్లు, గ్రిడ్‌, సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉండటంతో సైబర్‌ దాడులకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Electric Vehicle Cyber Security: ఇప్పుడు మన రోడ్లపై ఎలక్ట్రిక్‌ వాహనాలు సాధారణ దృశ్యంగా మారిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులు తగ్గుతాయన్న ఆశతో, పర్యావరణానికి మేలు చేస్తాయన్న నమ్మకంతో చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ వాహనాల్లో ఒక విషయం ఎక్కువగా చర్చకు రావడం లేదు. అదే సైబర్‌ భద్రత.

ఎలక్ట్రిక్‌ వాహనం అంటే కేవలం బ్యాటరీ, మోటార్‌ మాత్రమే కాదు. ఇవి చార్జింగ్‌ స్టేషన్లు, విద్యుత్‌ గ్రిడ్‌, మొబైల్‌ యాప్‌లు, క్లౌడ్‌ సర్వర్లతో ఎప్పటికప్పుడు డేటా మార్పిడి చేసుకుంటుంటాయి. ఈ అనుసంధానం మీకు సౌకర్యంగా అనిపించినా, అదే సైబర్‌ నేరగాళ్లకు దారి చూపిస్తోంది.

చార్జింగ్‌ స్టేషన్లే ప్రధాన టార్గెట్‌

పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు EV వ్యవస్థలో కీలక భాగం. ఇవి విద్యుత్‌ సరఫరా, యూజర్‌ గుర్తింపు, బిల్లింగ్‌, గ్రిడ్‌తో కమ్యూనికేషన్‌ వంటి పనులు చేస్తాయి. అందుకే హ్యాకర్లు మొదటగా కన్నేయేది వీటిపైనే. ఒకవేళ చార్జింగ్‌ నెట్‌వర్క్‌లో లోపాలు ఉంటే, చార్జింగ్‌ ఆగిపోవడం, తప్పుడు బిల్లింగ్‌, ఒకే సమయంలో ఎక్కువ వాహనాలకు సమస్యలు రావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.

వాహనం నుంచి గ్రిడ్‌కు కూడా విద్యుత్‌

కొత్త తరం ఈవీల్లో ‘వాహనం నుంచి గ్రిడ్‌కు’ విద్యుత్‌ పంపే టెక్నాలజీ వస్తోంది. అంటే వాహనం కేవలం విద్యుత్‌ వినియోగదారుగానే కాదు, అవసరమైతే సరఫరాదారుగా కూడా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వాహనంలో సైబర్‌ లోపం ఉంటే, అది మొత్తం స్థానిక విద్యుత్‌ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నిపుణులు దీనిని ‘మొబైల్‌ ఎనర్జీ హబ్‌’గా అభివర్ణిస్తున్నారు.

డేటా లీక్‌ అయితే ఏమవుతుంది?

ఎలక్ట్రిక్‌ వాహనాలు యూజర్‌ లొకేషన్‌, చార్జింగ్‌ అలవాట్లు, చెల్లింపుల వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటా తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వ్యక్తిగత గోప్యతకే కాదు, ఆర్థిక భద్రతకూ ముప్పే. అందుకే డేటా ఎన్‌క్రిప్షన్‌, గోప్యతను కాపాడే సిస్టమ్‌లపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ అన్ని కంపెనీలు ఒకే స్థాయిలో భద్రత పాటిస్తున్నాయా అన్నదే ప్రశ్న.

వాహన భద్రతకు కూడా ప్రమాదం

ఈవీల్లో ఇంజిన్‌ పనితీరు, వేగం, స్టెబిలిటీ అన్నీ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగానే నియంత్రణలో ఉంటాయి. ఒకవేళ హ్యాకర్లు ఈ సిస్టమ్‌ల్లోకి చొరబడితే, అది ప్రయాణికుల భద్రతకే ముప్పుగా మారుతుంది. కొన్ని పరిశోధనల్లో అసాధారణ ప్రవర్తనను గుర్తించే టెక్నాలజీలను పరీక్షించారు. అవి ఉపయోగకరంగానే ఉన్నా, వ్యవస్థ ఎంత క్లిష్టంగా మారిందన్నది ఇవి నిరూపిస్తున్నాయి.

ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాని భద్రత

ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు ఎక్కువగా ఒక్కో భాగంపైనే దృష్టి పెట్టాయి. కానీ మొత్తం ఈవీ వ్యవస్థను ఒకే ఫ్రేమ్‌లో చూసే అధ్యయనాలు చాలా తక్కువ. చార్జింగ్‌ కంపెనీలు, వాహన తయారీదారులు, విద్యుత్‌ సంస్థలు, నియంత్రణ సంస్థలు కలిసి పనిచేయకపోతే భద్రత బలపడదు.

నిపుణుల మాటల్లో చెప్పాలంటే... ఎలక్ట్రిక్‌ వాహనాలు అసురక్షితమైనవని కాదు. కానీ టెక్నాలజీ వేగంగా ముందుకు వెళ్తుండగా, దానిని కాపాడే రక్షణ వ్యవస్థలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో, ఈవీ అంటే కేవలం రేంజ్‌, ధర మాత్రమే కాదు... సైబర్‌ భద్రత కూడా కీలక అంశంగా మారబోతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ వాహనాలలో సైబర్ భద్రత ఎందుకు ముఖ్యం?

ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ స్టేషన్లు, గ్రిడ్, యాప్‌లు, సర్వర్‌లతో డేటాను మార్పిడి చేసుకుంటాయి. ఈ అనుసంధానం సైబర్ నేరగాళ్లకు దారి చూపవచ్చు.

సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు?

సైబర్ నేరగాళ్లు మొదటగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లపై కన్నేస్తారు. ఈ నెట్‌వర్క్‌లలో లోపాలు ఉంటే చార్జింగ్ ఆగిపోవడం, తప్పుడు బిల్లింగ్ వంటి సమస్యలు వస్తాయి.

వాహనం నుంచి గ్రిడ్‌కు విద్యుత్ పంపే టెక్నాలజీ వల్ల కలిగే సైబర్ ముప్పు ఏమిటి?

ఒక వాహనంలో సైబర్ లోపం ఉంటే, అది మొత్తం స్థానిక విద్యుత్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని 'మొబైల్ ఎనర్జీ హబ్' గా పరిగణిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలు సేకరించే డేటా లీక్ అయితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి?

యూజర్ లొకేషన్, చార్జింగ్ అలవాట్లు, చెల్లింపుల వివరాలు వంటి సున్నితమైన సమాచారం తప్పుడు చేతుల్లో పడితే వ్యక్తిగత గోప్యతకు, ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో సైబర్ భద్రత ప్రస్తుత స్థితి ఏమిటి?

ప్రస్తుతం పరిశోధనలు ఎక్కువగా ఒక్కో భాగంపైనే దృష్టి సారించాయి. సమగ్ర భద్రతా అధ్యయనాలు తక్కువ. చార్జింగ్ కంపెనీలు, వాహన తయారీదారులు, విద్యుత్ సంస్థలు కలిసి పనిచేస్తేనే భద్రత పెరుగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ బైక్‌ మీ దగ్గర ఉంటే సేఫ్టీ మీ చుట్టూ ఉన్నట్లే! - అత్యంత చవకైన Dual Channel ABS బైకులు
డ్యూయల్ ఛానల్ ABS ఉన్న చవకైన బైకులు ఇవే - రూ.1.05 లక్షల నుంచే అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్
కొత్త ఫీచర్లతో 2026 Hyundai Verna అప్‌డేట్.. HX6+ వేరియంట్ ఎందుకు బెస్ట్?
2026 హ్యుందాయ్ వెర్నా ఏ వేరియంట్ కొనాలి? ధరలు, ఫీచర్లు, బెస్ట్ ఆప్షన్ ఇదే
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget