అన్వేషించండి

PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!

PM E-Drive :ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా పీఎం ఈడ్రైవ్ పథకాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే వారికి భారీ సబ్సిడీ అందిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లకు సబ్సిడీ ఇస్తుంది.
  • ప్రాధాన్యతా ప్రాంతాల్లో 100% వరకు, రద్దీ ప్రాంతాల్లో 70-80% సబ్సిడీ లభిస్తుంది.
  • 2-3 లక్షల పెట్టుబడితో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు సాధ్యమవుతుంది.
  • రోజుకు 20 కార్లు ఛార్జింగ్ చేస్తే నెలకు 4-5 లక్షల ఆదాయం వస్తుంది.

PM E-Drive  Schemes: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈవీల వాడకం పెరగాలంటే పటిష్టమైన చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు అత్యవసరం. ఈ లోటు భర్తీ చేస్తూనే, సామాన్యులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని పట్టాలెక్కించింది. 

పీఎం ఈ డ్రైవ్ పథకం అంటే ఏంటీ?

పీఎం ఈ డ్రైవ్ స్కీమ్‌ అనేది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భారీ ప్రోత్సాహక పథకం. ఈ స్కీమ్‌ ద్వారా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు అయ్యే ఖర్చులో ప్రధాన భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. తద్వారా పెట్టుబడిదారులు తక్కువ రిస్క్‌తో ఈ వ్యాపారంలోకి ప్రవేశించే వీలు కలుగుతుంది. 

సబ్సిడీ వివరాలు ఏంటీ?

ఈ పథకం కింద సబ్సిడీ శాతాన్ని ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను బట్టి విభజించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్‌ కాలనీలు, ఆసుపత్రుల, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల పరికరాల కోసం కేంద్ర వంద శాతం సబ్సిడీని అందిస్తుంది. 

అధిక రద్దీ ఉండే ప్రాంతాలైన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ స్థలాలు, టోల్ ప్లాజాల సమీపంలో సెటప్ చేసుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై 80శాతం, పరికరాలపై 70శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి మౌలిక సదుపాయాల కోసం 80 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది. 

పెట్టుబడి ఎంత? ఆదాయం ఎలా ఉంటుంది? 

సాధారణంగా ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడానికి పది నుంచి 15లక్షల వరకు ఖర్చు అవుతుంది. పీఎం ఈడ్రైవ్ పథకం ద్వారా మీరు 8 నుంచి 12 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. దీని వల్ల జేబు నుంచి పెట్టాల్సిన పెట్టుబడి 2 నుంచి మూడు లక్షలకు తగ్గుతుంది. అయితే ప్రాథమికంగా మొత్తం ఖర్చును మీరు భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.

ఆదాయం ప్రధానంగా యూనిట్ల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఒక్క యూనిట్ ఛార్జింగ్‌కు సగటున రూ.15 నుంచి 20 వరకు వసూలు చేస్తున్నారు. ఒక సాధారణ ఎలక్ట్రిక్‌ కారు పూర్తి చార్జింగ్ కోసం 30 నుంచి 45 యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. రోజుకు సుమారు 20 కార్లు మీ స్టేషన్‌కు వస్తే, నెలకు 4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కరెంటు బిల్లు, స్థలం అద్దె, నిర్వహణ ఖర్చులు తీసివేస్తే మిగిలిందే మీకు ఆదాయం. 

ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకంలో దరఖాస్తు ప్రక్రియ నేరుగా సామాన్యులకు అందుబాటులో ఉండదు. ఇది ఓ పద్ధతిలో జరుగుతుంది. సామాన్య ప్రజలు నేరుగా ప్రభుత్వ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోలేరు. కేవలం ప్రబుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు, వాటి ద్వారా నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్ చేసే అధికారం కలిగి ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు తమ సొంత స్థలంలో లేదా వాణిజ్య స్థలంలో స్టేషన్ ప్రారంభించాలనుకుంటే వారు చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లుగా మారి, పైన పేర్కొన్న నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు లేదా కమర్షియల్ స్థలం ఏదైనా అనుమతి ఉంటుంది. కానీ అది వ్యూహాత్మకంగా వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, నోడల్ ఏజెన్సీల వివరాల కోసం ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌ pmed.gov.ingను సందర్శించవచ్చు. నిరుద్యోగ యువతకు,కొత్త వ్యాపార మార్గాల కోసం చూస్తున్న వారికి ఈ పథకం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. 

Frequently Asked Questions

పీఎం ఈ డ్రైవ్ పథకం అంటే ఏమిటి?

పీఎం ఈ డ్రైవ్ పథకం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భారీ ప్రోత్సాహక పథకం.

పీఎం ఈ డ్రైవ్ పథకం కింద సబ్సిడీ ఎంత?

ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను బట్టి సబ్సిడీ శాతం మారుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్ కాలనీలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో 100% సబ్సిడీ లభిస్తుంది.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవసరం?

సాధారణంగా పది నుంచి 15 లక్షలు ఖర్చవుతుంది. ఈ పథకం ద్వారా 8 నుంచి 12 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది, కాబట్టి మీ జేబు నుంచి 2 నుంచి 3 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

పీఎం ఈ డ్రైవ్ పథకానికి ఎవరు అర్హులు?

ప్రభుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు, వాటి ద్వారా నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్ చేయగలవు. ప్రైవేట్ వ్యక్తులు నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki YMC EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!
ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!
TVS Orbiter vs Bajaj Chetak:టీవీఎస్‌ ఆర్బిటర్‌ vs బజాజ్‌ చేతక్‌! బడ్జెట్‌ ఈవీ రేసులో ఏ స్కూటర్‌ కింగ్‌?
టీవీఎస్‌ ఆర్బిటర్‌ vs బజాజ్‌ చేతక్‌! బడ్జెట్‌ ఈవీ రేసులో ఏ స్కూటర్‌ కింగ్‌?
Toyota Fortunerకు అదిరిపోయే మేకోవర్ - కొత్త జనరేషన్ SUVలా మార్చేసిన ఓనర్
పాత Toyota Fortunerకు నెక్స్ట్ జనరేషన్ లుక్ - మోడిఫికేషన్ చూస్తే మతిపోవాల్సిందే!
1,000cc, 280hp పవర్‌తో సంచలనం - ప్రపంచంలోనే అరుదైన 8 సిలిండర్ టూస్ట్రోక్ బైక్ ఆవిష్కరణ
8 సిలిండర్‌ బైక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? - ఈ బండికి పెట్టే రేటుతో ఏకంగా 10 కార్లు కొనవచ్చు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget