అన్వేషించండి

PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!

PM E-Drive :ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా పీఎం ఈడ్రైవ్ పథకాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే వారికి భారీ సబ్సిడీ అందిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లకు సబ్సిడీ ఇస్తుంది.
  • ప్రాధాన్యతా ప్రాంతాల్లో 100% వరకు, రద్దీ ప్రాంతాల్లో 70-80% సబ్సిడీ లభిస్తుంది.
  • 2-3 లక్షల పెట్టుబడితో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు సాధ్యమవుతుంది.
  • రోజుకు 20 కార్లు ఛార్జింగ్ చేస్తే నెలకు 4-5 లక్షల ఆదాయం వస్తుంది.

PM E-Drive  Schemes: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈవీల వాడకం పెరగాలంటే పటిష్టమైన చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు అత్యవసరం. ఈ లోటు భర్తీ చేస్తూనే, సామాన్యులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని పట్టాలెక్కించింది. 

పీఎం ఈ డ్రైవ్ పథకం అంటే ఏంటీ?

పీఎం ఈ డ్రైవ్ స్కీమ్‌ అనేది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భారీ ప్రోత్సాహక పథకం. ఈ స్కీమ్‌ ద్వారా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు అయ్యే ఖర్చులో ప్రధాన భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. తద్వారా పెట్టుబడిదారులు తక్కువ రిస్క్‌తో ఈ వ్యాపారంలోకి ప్రవేశించే వీలు కలుగుతుంది. 

సబ్సిడీ వివరాలు ఏంటీ?

ఈ పథకం కింద సబ్సిడీ శాతాన్ని ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను బట్టి విభజించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్‌ కాలనీలు, ఆసుపత్రుల, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల పరికరాల కోసం కేంద్ర వంద శాతం సబ్సిడీని అందిస్తుంది. 

అధిక రద్దీ ఉండే ప్రాంతాలైన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ స్థలాలు, టోల్ ప్లాజాల సమీపంలో సెటప్ చేసుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై 80శాతం, పరికరాలపై 70శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి మౌలిక సదుపాయాల కోసం 80 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది. 

పెట్టుబడి ఎంత? ఆదాయం ఎలా ఉంటుంది? 

సాధారణంగా ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడానికి పది నుంచి 15లక్షల వరకు ఖర్చు అవుతుంది. పీఎం ఈడ్రైవ్ పథకం ద్వారా మీరు 8 నుంచి 12 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. దీని వల్ల జేబు నుంచి పెట్టాల్సిన పెట్టుబడి 2 నుంచి మూడు లక్షలకు తగ్గుతుంది. అయితే ప్రాథమికంగా మొత్తం ఖర్చును మీరు భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.

ఆదాయం ప్రధానంగా యూనిట్ల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఒక్క యూనిట్ ఛార్జింగ్‌కు సగటున రూ.15 నుంచి 20 వరకు వసూలు చేస్తున్నారు. ఒక సాధారణ ఎలక్ట్రిక్‌ కారు పూర్తి చార్జింగ్ కోసం 30 నుంచి 45 యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. రోజుకు సుమారు 20 కార్లు మీ స్టేషన్‌కు వస్తే, నెలకు 4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కరెంటు బిల్లు, స్థలం అద్దె, నిర్వహణ ఖర్చులు తీసివేస్తే మిగిలిందే మీకు ఆదాయం. 

ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకంలో దరఖాస్తు ప్రక్రియ నేరుగా సామాన్యులకు అందుబాటులో ఉండదు. ఇది ఓ పద్ధతిలో జరుగుతుంది. సామాన్య ప్రజలు నేరుగా ప్రభుత్వ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోలేరు. కేవలం ప్రబుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు, వాటి ద్వారా నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్ చేసే అధికారం కలిగి ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు తమ సొంత స్థలంలో లేదా వాణిజ్య స్థలంలో స్టేషన్ ప్రారంభించాలనుకుంటే వారు చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లుగా మారి, పైన పేర్కొన్న నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు లేదా కమర్షియల్ స్థలం ఏదైనా అనుమతి ఉంటుంది. కానీ అది వ్యూహాత్మకంగా వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, నోడల్ ఏజెన్సీల వివరాల కోసం ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌ pmed.gov.ingను సందర్శించవచ్చు. నిరుద్యోగ యువతకు,కొత్త వ్యాపార మార్గాల కోసం చూస్తున్న వారికి ఈ పథకం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. 

Frequently Asked Questions

పీఎం ఈ డ్రైవ్ పథకం అంటే ఏమిటి?

పీఎం ఈ డ్రైవ్ పథకం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భారీ ప్రోత్సాహక పథకం.

పీఎం ఈ డ్రైవ్ పథకం కింద సబ్సిడీ ఎంత?

ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను బట్టి సబ్సిడీ శాతం మారుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్ కాలనీలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో 100% సబ్సిడీ లభిస్తుంది.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవసరం?

సాధారణంగా పది నుంచి 15 లక్షలు ఖర్చవుతుంది. ఈ పథకం ద్వారా 8 నుంచి 12 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది, కాబట్టి మీ జేబు నుంచి 2 నుంచి 3 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

పీఎం ఈ డ్రైవ్ పథకానికి ఎవరు అర్హులు?

ప్రభుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు, వాటి ద్వారా నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్ చేయగలవు. ప్రైవేట్ వ్యక్తులు నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Evolution of India’s Automotive Aftermarket: మారుతున్న ఆటోమొబైల్ రంగం.. ఆఫ్టర్‌మార్కెట్ యాక్సెసరీలకు పెరిగిన క్రేజ్! 2030 నాటికి రూ. 1.55 లక్షల కోట్ల మార్కెట్!
మారుతున్న ఆటోమొబైల్ రంగం.. ఆఫ్టర్‌మార్కెట్ యాక్సెసరీలకు పెరిగిన క్రేజ్! 2030 నాటికి రూ. 1.55 లక్షల కోట్ల మార్కెట్!
Car Maintenance Tips: మీ కారు లక్ష కిలోమీటర్లు దాటిందా? ఇంజిన్ లైఫ్ పెంచడానికి ఈ మెయింటెనెన్స్ టిప్స్ తప్పనిసరి!
మీ కారు లక్ష కిలోమీటర్లు దాటిందా? ఇంజిన్ లైఫ్ పెంచడానికి ఈ మెయింటెనెన్స్ టిప్స్ తప్పనిసరి!
India Heatwave Alert: నిప్పుల కొలిమిలా వేస‌వి.. 45 డిగ్రీల భానుడి భగభగ! టూ-వీలర్ రైడర్లకు ఐఎండీ కీలక సూచనలు!
నిప్పుల కొలిమిలా వేస‌వి.. 45 డిగ్రీల భానుడి భగభగ! టూ-వీలర్ రైడర్లకు ఐఎండీ కీలక సూచనలు!
Affordable Electric Scooters: బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర రూ. 44,000 నుంచి ప్రారంభం
బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర రూ. 44,000 నుంచి ప్రారంభం
Advertisement

వీడియోలు

MI Batting Line Up vs CSK IPL 2026 | ముంబై బ్యాటర్ల ఘోర వైఫల్యం
IPL 2026 MI vs CSK Akeal Hosein | వాంఖడేలో అకీల్ హోసెన్ స్పిన్ సునామీ
MI vs CSK Highlights IPL 2026 | ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ విక్టరీ
Sanju Samson Century vs MI IPL 2026 | ఒక సెంచరీతో రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ
RR vs LSG IPL 2026 Highlights | లక్నోకు వరుసగా 4వ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Census 2027: తెలంగాణలో తొలిసారి జనగణనతో పాటు కులగణన.. నేటి నుంచి వెబ్ పోర్టల్‌లో సెల్ఫ్-ఎన్యుమరేషన్
తెలంగాణలో తొలిసారి జనగణనతో పాటు కులగణన.. నేటి నుంచి వెబ్ పోర్టల్‌లో సెల్ఫ్-ఎన్యుమరేషన్
IPL 2026 SRH 4th Consecutive Win: స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
Viral Video: అన్నా అని పిలిచినందుకు సెలూన్ సిబ్బందిపై దాడి.. కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐ సస్పెన్షన్!
అన్నా అని పిలిచినందుకు సెలూన్ సిబ్బందిపై దాడి.. కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐ సస్పెన్షన్!
AB Venkateswara Rao: అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
Nivin Pauly Movies OTT : జియో హాట్ స్టార్‌లో నివిన్ పాలీ జోరు - ప్రేమమ్ To లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్... ఎన్ని మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
జియో హాట్ స్టార్‌లో నివిన్ పాలీ జోరు - ప్రేమమ్ To లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్... ఎన్ని మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
Gods and Soldiers Movie: బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
YSRCP MLCs resign: అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
Embed widget