అన్వేషించండి

PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!

PM E-Drive :ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా పీఎం ఈడ్రైవ్ పథకాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే వారికి భారీ సబ్సిడీ అందిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లకు సబ్సిడీ ఇస్తుంది.
  • ప్రాధాన్యతా ప్రాంతాల్లో 100% వరకు, రద్దీ ప్రాంతాల్లో 70-80% సబ్సిడీ లభిస్తుంది.
  • 2-3 లక్షల పెట్టుబడితో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు సాధ్యమవుతుంది.
  • రోజుకు 20 కార్లు ఛార్జింగ్ చేస్తే నెలకు 4-5 లక్షల ఆదాయం వస్తుంది.

PM E-Drive  Schemes: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈవీల వాడకం పెరగాలంటే పటిష్టమైన చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు అత్యవసరం. ఈ లోటు భర్తీ చేస్తూనే, సామాన్యులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని పట్టాలెక్కించింది. 

పీఎం ఈ డ్రైవ్ పథకం అంటే ఏంటీ?

పీఎం ఈ డ్రైవ్ స్కీమ్‌ అనేది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భారీ ప్రోత్సాహక పథకం. ఈ స్కీమ్‌ ద్వారా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు అయ్యే ఖర్చులో ప్రధాన భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. తద్వారా పెట్టుబడిదారులు తక్కువ రిస్క్‌తో ఈ వ్యాపారంలోకి ప్రవేశించే వీలు కలుగుతుంది. 

సబ్సిడీ వివరాలు ఏంటీ?

ఈ పథకం కింద సబ్సిడీ శాతాన్ని ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను బట్టి విభజించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్‌ కాలనీలు, ఆసుపత్రుల, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల పరికరాల కోసం కేంద్ర వంద శాతం సబ్సిడీని అందిస్తుంది. 

అధిక రద్దీ ఉండే ప్రాంతాలైన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ స్థలాలు, టోల్ ప్లాజాల సమీపంలో సెటప్ చేసుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై 80శాతం, పరికరాలపై 70శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి మౌలిక సదుపాయాల కోసం 80 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది. 

పెట్టుబడి ఎంత? ఆదాయం ఎలా ఉంటుంది? 

సాధారణంగా ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడానికి పది నుంచి 15లక్షల వరకు ఖర్చు అవుతుంది. పీఎం ఈడ్రైవ్ పథకం ద్వారా మీరు 8 నుంచి 12 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. దీని వల్ల జేబు నుంచి పెట్టాల్సిన పెట్టుబడి 2 నుంచి మూడు లక్షలకు తగ్గుతుంది. అయితే ప్రాథమికంగా మొత్తం ఖర్చును మీరు భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.

ఆదాయం ప్రధానంగా యూనిట్ల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఒక్క యూనిట్ ఛార్జింగ్‌కు సగటున రూ.15 నుంచి 20 వరకు వసూలు చేస్తున్నారు. ఒక సాధారణ ఎలక్ట్రిక్‌ కారు పూర్తి చార్జింగ్ కోసం 30 నుంచి 45 యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. రోజుకు సుమారు 20 కార్లు మీ స్టేషన్‌కు వస్తే, నెలకు 4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కరెంటు బిల్లు, స్థలం అద్దె, నిర్వహణ ఖర్చులు తీసివేస్తే మిగిలిందే మీకు ఆదాయం. 

ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకంలో దరఖాస్తు ప్రక్రియ నేరుగా సామాన్యులకు అందుబాటులో ఉండదు. ఇది ఓ పద్ధతిలో జరుగుతుంది. సామాన్య ప్రజలు నేరుగా ప్రభుత్వ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోలేరు. కేవలం ప్రబుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు, వాటి ద్వారా నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్ చేసే అధికారం కలిగి ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు తమ సొంత స్థలంలో లేదా వాణిజ్య స్థలంలో స్టేషన్ ప్రారంభించాలనుకుంటే వారు చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లుగా మారి, పైన పేర్కొన్న నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు లేదా కమర్షియల్ స్థలం ఏదైనా అనుమతి ఉంటుంది. కానీ అది వ్యూహాత్మకంగా వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, నోడల్ ఏజెన్సీల వివరాల కోసం ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌ pmed.gov.ingను సందర్శించవచ్చు. నిరుద్యోగ యువతకు,కొత్త వ్యాపార మార్గాల కోసం చూస్తున్న వారికి ఈ పథకం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. 

Frequently Asked Questions

పీఎం ఈ డ్రైవ్ పథకం అంటే ఏమిటి?

పీఎం ఈ డ్రైవ్ పథకం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భారీ ప్రోత్సాహక పథకం.

పీఎం ఈ డ్రైవ్ పథకం కింద సబ్సిడీ ఎంత?

ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను బట్టి సబ్సిడీ శాతం మారుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్ కాలనీలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో 100% సబ్సిడీ లభిస్తుంది.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవసరం?

సాధారణంగా పది నుంచి 15 లక్షలు ఖర్చవుతుంది. ఈ పథకం ద్వారా 8 నుంచి 12 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది, కాబట్టి మీ జేబు నుంచి 2 నుంచి 3 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

పీఎం ఈ డ్రైవ్ పథకానికి ఎవరు అర్హులు?

ప్రభుత్వ విభాగాలు, మున్సిపాలిటీలు, వాటి ద్వారా నియమించిన నోడల్ ఏజెన్సీలు మాత్రమే పోర్టల్‌లో రిజిస్టర్ చేయగలవు. ప్రైవేట్ వ్యక్తులు నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Top 5 Hybrid Cars Mileage: ఆఫీసుకు వెళ్లేవారికి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టాప్ 5 హైబ్రిడ్ కార్లు ఇవే
ఆఫీసుకు వెళ్లేవారికి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టాప్ 5 హైబ్రిడ్ కార్లు ఇవే
High Speed Electric Bikes India: మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే! ధర ఫీచర్లు గురించి తెలుసుకోండి!
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే! ధర ఫీచర్లు గురించి తెలుసుకోండి!
Bajaj Freedom 125 CNG Bike: ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు ఆగే పని లేదు! బజాజ్ ఫ్రీడమ్‌125 బైక్ వచ్చేసింది! ధర, మైలేజీ వివరాలు ఇవే!
ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు ఆగే పని లేదు! బజాజ్ ఫ్రీడమ్‌125 బైక్ వచ్చేసింది! ధర, మైలేజీ వివరాలు ఇవే!
Tata Altroz CNG AMT EMI Details: టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ  కారు కొనాల‌నుకుంటున్నారా..? ఈఎమ్ఐ వివరాలు ఇవే.!
టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ  కారు కొనాల‌నుకుంటున్నారా..? ఈఎమ్ఐ వివరాలు ఇవే.!
Advertisement

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilkur Balaji Visa Temple: చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
Ram Charan : లాంగ్ హెయిర్‌తో రామ్ చరణ్ - పెద్ది రిలీజ్ ముందు న్యూ లుక్... గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?
లాంగ్ హెయిర్‌తో రామ్ చరణ్ - పెద్ది రిలీజ్ ముందు న్యూ లుక్... గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?
Karuppu OTT : ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో బిగుస్తున్న ఉచ్చు! ఏ క్షణమైనా పోలీసుల ఎదుట లొంగుబాటు!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో బిగుస్తున్న ఉచ్చు! ఏ క్షణమైనా పోలీసుల ఎదుట లొంగుబాటు!
TamilNadu Politics: మళ్లీ తమిళనాట సనాతన మంట పెట్టిన ఉదయనిధి - అందుకుంటున్న బీజేపీ - అరవ రాజకీయం మారుతోందా?
మళ్లీ తమిళనాట సనాతన మంట పెట్టిన ఉదయనిధి - అందుకుంటున్న బీజేపీ - అరవ రాజకీయం మారుతోందా?
Political Publicity: ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
8th Pay Commission Updates: 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్స్‌! అభ్యర్థనల సమర్పణ గడువు పెంపు! రెండు రోజుల్లో సభ్యుల హైదరాబాద్‌ టూర్! 
8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్స్‌! అభ్యర్థనల సమర్పణ గడువు పెంపు! రెండు రోజుల్లో సభ్యుల హైదరాబాద్‌ టూర్! 
Embed widget