అన్వేషించండి

Ola, Uberలకు టెన్షన్ టెన్షన్.. క్యాబ్ సేవల్ని ప్రారంభిస్తున్న VinFast.. కి.మీ.కు ఎంతంటే

Electric Cab Service | విన్‌ఫాస్ట్ కంపెనీ సైతం క్యాబ్ సర్వీసులను ప్రారంభిస్తోంది. మొదట ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తేనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విన్‌ఫాస్ట్ భారత్‌లో గ్రీన్ ఎస్‌ఎమ్ ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభిస్తుంది.
  • మొదట ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో, తర్వాత ఇతర నగరాలకు విస్తరించనుంది.
  • సుమారు 15,000 ఎలక్ట్రిక్ టాక్సీల ఫ్లీట్‌ను ఏర్పాటు చేయనుంది.
  • కిలోమీటరుకు సుమారు రూ. 8 ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది.

Cab Services In India | సొంతంగా వాహనం లేని వారితో పాటు వేరే నగరాలకు వెళ్లిన సమయంలో క్యాబ్ సర్వీసుల ద్వారా మీకు కావాల్సిన చోటుకు వెళ్తుంటారు. భారత్‌లో గత కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో మరిన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయి. వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి గ్రీన్ ఎస్‌ఎమ్ (Green SM) అని పేరు పెట్టారు. ఈ సర్వీసులను మొదట ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుంచి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత క్రమంగా దీనిని ఇతర నగరాలకు కూడా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. దేశంలో పర్యావరణ హితమైన (ఈకో-ఫ్రెండ్లీ), పూర్తిగా ఎలక్ట్రిక్ టాక్సీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడం కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ ప్లాన్‌లో భాగంగా కంపెనీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ టాక్సీలను అందుబాటులోకి తేనుంది. దాదాపు 15,000 ఎలక్ట్రిక్ టాక్సీల బెడాని (ఫ్లీట్) సిద్ధం చేయాలని సంస్థ ప్లాన్ చేసింది. ఈ టాక్సీలలో ప్రధానంగా విన్‌ఫాస్ట్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కార్లను వినియోగించనున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా, ప్రయాణికులకు కంఫర్ట్ జర్నీ అందించేలా, ఈ వాహనాలను ప్రత్యేకంగా రైడ్ హెయిలింగ్, టాక్సీ సేవల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

Also Read: పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!

కిలోమీటరుకు ఎంత చెల్లించాలి 
ఈ సర్వీస్‌కు సంబంధించి ప్రత్యేకమైన అంశం దీని అద్దె  మోడల్ అని చెబుతున్నారు. నివేదికల ప్రకారం, ప్యాసింజర్స్ వద్ద నుంచి ఒక కిలోమీటరుకు దాదాపు రూ. 8 ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ప్రతిరోజూ క్యాబ్‌లలో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే వారికి, సిటీలో ప్రయాణించే వారికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. గ్రీన్ ఎస్‌ఎమ్ అనేది కేవలం ఒక టాక్సీ సేవ మాత్రమే కాదు. విన్‌ఫాస్ట్ కంపెనీ ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్లకు బ్రాండింగ్‌తో పాటు తక్కువ సమయంలో గుర్తింపును తీసుకురావాలని భావిస్తోంది.

Also Read: Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది

ఎకో-ఫ్రెండ్లీగా ఈ ఎలక్ట్రిక్ కార్లు
ఈ ప్రాజెక్ట్ మరో కోణం ఏంటంటే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ ఆధారిత సర్వీస్. దాంతో ఎలాంటి పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాల అవసరం ఉండదు. దీనివల్ల కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను, గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తోంది. కనుక ఇటువంటి సేవలు భవిష్యత్తులో ఎంతో మేలు చేయనున్నాయి. 

ఈ సేవను కేవలం యాప్ ఆధారిత టాక్సీలకే పరిమితం చేయకుండా ఒక ఫ్లీట్ మోడల్‌గా నడపాలని కూడా కంపెనీ యోచిస్తోంది. అంటే డ్రైవర్లు, వాహనాలు, సేవల నాణ్యతపై కంపెనీకి డైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది. దీనివల్ల సేవలను నిలకడగా, మరింత మెరుగ్గా అందించడానికి వీలవుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Frequently Asked Questions

భారతదేశంలో విన్‌ఫాస్ట్‌ ఏ కొత్త సర్వీసును ప్రారంభించనుంది?

విన్‌ఫాస్ట్‌ భారతదేశంలో 'గ్రీన్ ఎస్‌ఎమ్' పేరుతో ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీసును ప్రారంభించనుంది. ఇది పూర్తిగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలతో కూడిన నెట్‌వర్క్‌.

గ్రీన్ ఎస్‌ఎమ్‌ సర్వీసులు మొదట ఏ నగరంలో ప్రారంభమవుతాయి?

గ్రీన్ ఎస్‌ఎమ్‌ సర్వీసులు మొదట ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత క్రమంగా ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

గ్రీన్ ఎస్‌ఎమ్‌ ఎంత మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది?

కంపెనీ దాదాపు 15,000 ఎలక్ట్రిక్ టాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ వాహనాలను ముఖ్యంగా రైడ్ హెయిలింగ్, టాక్సీ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

గ్రీన్ ఎస్‌ఎమ్‌ టాక్సీలకు కిలోమీటరుకు ఎంత ఛార్జీ వసూలు చేస్తారు?

నివేదికల ప్రకారం, ప్రయాణికుల నుంచి ప్రతి కిలోమీటరుకు సుమారు రూ. 8 ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. ఇది రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Fronx on Road Price Hyderabad: మారుతి సుజుకి కూపే  ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ ఆన్‌రోడ్డు ధర ఎంత? మైలేజ్ అండ్‌ ఫుల్ వేరియంట్‌ అనాలిసిస్‌ ఇదే!
మారుతి సుజుకి కూపే  ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ ఆన్‌రోడ్డు ధర ఎంత? మైలేజ్ అండ్‌ ఫుల్ వేరియంట్‌ అనాలిసిస్‌ ఇదే!
కొత్త డిజైన్, తక్కువ బరువు, మరింత పవర్ ఫీల్ - KTM 790 Dukeకు భారీ అప్‌డేట్
సైన్స్ ఫిక్షన్ మూవీ బైక్‌లా KTM 790 Duke - అప్‌డేటెడ్ లుక్ అదిరింది బ్రదర్‌!
Bajaj Freedom 125: లక్ష రూపాయల లోపే సీఎన్జీ బైక్‌! ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు చూడాల్సిన పని లేదు!
లక్ష రూపాయల లోపే సీఎన్జీ బైక్‌! ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు చూడాల్సిన పని లేదు!
Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ లాంచ్‌ - 457cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో కొత్త అప్‌డేట్స్
జంటగా షికార్లు చేయడానికి Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ - కొత్త లుక్‌తో యూత్‌కు ఫుల్ కిక్!
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Ram Charan At APL In Vijayawada: అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
Embed widget