హ్యుందాయ్ భారతదేశంలో EVల వాడకాన్ని ప్రోత్సహించడానికి, ఇక్కడి వాతావరణం, రోడ్ల పరిస్థితులకు అనువైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి పరిశోధనా నెట్వర్క్ను విస్తరిస్తోంది.
Hyundai India: ఐఐటీ హైదరాబాద్, కాన్పూర్తో హ్యుందాయ్ ఒప్పందం! ఫ్యూచర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Hyundai India: భారత్లో ఈవీ విప్లవం తీసుకొచ్చేందుకు హ్యుందాయ్ భారీగా ప్లాన్ చేస్తోంది. అందుకే ఐఐటీ హైదరాబాద్తోపాటు ఐదు విద్యాసంస్థలతో జతకట్టింది.

- హ్యుందాయ్, నాలుగు విద్యాసంస్థలతో EV పరిశోధనకు ఒప్పందం.
- భారతీయ రోడ్లు, వాతావరణానికి అనువైన EV టెక్నాలజీ అభివృద్ధి.
- బ్యాటరీ పనితీరు, భద్రత, తక్కువ ఖర్చుతో మైలేజీ పెంపు లక్ష్యం.
- దేశీయ EV పరిశోధన, అభివృద్ధికి స్వయం సమృద్ధి సాధించాలనేది ఉద్దేశ్యం.
Hyundai India: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల(Hyundai EV India) వాడకాన్ని ప్రోత్సహించడమే కాకుండా, ఇక్కడి వాతావరణం, రోడ్ల పరిస్థితులకు అనువైన సాంకేతికత తీసుకొచ్చేందుకు హ్యుందాయ్ మోటార్ గ్రూప్ కీలక ముందడుగు వేసింది. హ్యుందాయ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(Hyundai Center of Excellence) చొరవ కింద తన పరిశోధనా నెట్వర్క్ను విస్తరిస్తూ, నాలుగు విద్యాసంస్థలో ఒప్పందం చేసుకుంది.
గతంలో ఉన్న సంస్థలతోపాటు ఇప్పుడు నాలుగు సంస్థలను తన పరిశోధన టీంలో చేర్చింది. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ కాన్పూర్(IIT Kanpur EV Research), విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్, తేజ్పూర్ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకుంది.
ఈ నాలుగు సంస్థలు చేరడంతో హ్యుందాయ్ పరిశోధనా కూటమి(Hyundai academic partnership)లోని మొత్తం విద్యాసంస్థల సంఖ్య ఏడుకు చేరింది. 202లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు ఐఐటీ మద్రాస్(IIT Madras EV Research), ఐఐటీ ఢిల్లీ (IIT Delhi EV Research), ఐఐటీ బాంబే(IIT Bambay EV Research)లు వ్యవస్థాపక భాగస్వాములుగా ఉన్నాయి.
Also Read: హ్యాందాయ్ నుంచి 10 లక్షల బడ్జెట్లో ఉన్న మోడల్స్ ఇవే! కారు కొనే ముందు ఓ లుక్ వేయండి!
పరిశోధనలు ఎందుకు?
భారతీయ మార్కెట్ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నమైంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు, ట్రాఫిక్ పరిస్థితులు, విద్యుత్ మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఈవీ టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. భారతీయ వినియోగదారులు తక్కువ ఖర్చుతో కూడిన, ఎక్కువ మన్నిక ఇచ్చే బ్యాటరీ(Electric Vehicle Battery Technology )లను కోరుకుంటారు. దేశంలో పరిశోధన, అభివృద్ధి పర్యావరణాన్ని బలోపేతం చేయడం ద్వారా స్వయం సమృద్ధి సాధించడం ముఖ్య లక్ష్యం.
హ్యుందాయ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రధానంగా దృష్టి పెట్టిన అంశాలు పరిశీలిస్తే... బ్యాటరీ సెల్స్ పనితీరు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మెరుగుదలపై ఫోకస్ చేస్తారు. బ్యాటరీ పరిమాణం తగ్గించి ఎక్కువ మైలేజీ ఇచ్చేలా చేస్తారు. అగ్ని ప్రమాదాలు నివారించడం, కఠినమైన వాతావరణంలో కూడా బ్యాటరీ పాడవకుండా చూడాలి. వాహనంలో తలెత్తే టెక్నికల్ లోపాలను ముందుగానే గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలు సాగుతాయి.
Also Read: EV త్రీ-వీలర్ మార్కెట్లో సంచలనం.. హ్యుందాయ్, టీవీఎస్ మోటార్స్ Joint Venture! దేశీ రోడ్ల కోసం స్పెషల్ ఎలక్ట్రిక్ ఆటోలు
ప్రస్తుతం ఈ ఏడు విశ్వవిద్యాలయాలలో కలిపి మొత్తం 39 ఉమ్మడి పరిశోధనా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. భారతీయ పరిస్థితులకు తగ్గ బ్యాటరీ మెటీరియల్ పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వెహికల్ టు గ్రిడ్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయడం వీళ్ల ప్రధాన టాస్క్.
భారతీయ, కొరియా పరిశోధకుల మధ్య విజ్ఞాన మార్పిడి కోసం ప్రత్యేక కార్యక్రమాలను హ్యుందాయ్ నిర్వహించనుంది. అంతర్జాతీయ స్థాయి ఇ-కాన్ఫెరెన్స్లు, టెక్నాలజీ ఫోరమ్లను నిర్వహించడం ద్వారా పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య వారధిని నిర్మించనున్నారు.
2030 నాటికి భారీ సంఖ్యలో రవాణా వ్యవస్థను విద్యుదీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కేవలం వాహనాలను దిగుమతి చేసుకుంటే, అసెంబ్లీ చేసుకుంటే సరిపోదు. స్థానిక పరిస్థితులకు అవసరమైన విడిభాగాలు, వాహనాలు సిద్ధం చేయాలి. అందుకే దీనిపై పరిశోధనకు కంపెనీలు ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి.
Before You Go
Auto Expo 2023 Day 1 Highlights: ఎంతో హైప్ తో మొదలైన ఆటో ఎక్స్ పో మొదటి రోజు హైలైట్స్
Frequently Asked Questions
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం హ్యుందాయ్ ఏ చర్యలు తీసుకుంటోంది?
హ్యుందాయ్ పరిశోధన కూటమిలో ప్రస్తుతం ఏయే విద్యా సంస్థలు ఉన్నాయి?
ప్రస్తుతం హ్యుందాయ్ పరిశోధన కూటమిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ కాన్పూర్, విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్, తేజ్పూర్ యూనివర్శిటీతో సహా మొత్తం ఏడు విద్యాసంస్థలు ఉన్నాయి.
భారతీయ మార్కెట్ కోసం EV టెక్నాలజీని ఎందుకు అభివృద్ధి చేయాలి?
భారతీయ మార్కెట్ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు, ట్రాఫిక్, విద్యుత్ మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన, ఎక్కువ మన్నిక ఇచ్చే బ్యాటరీలను అందించడానికి ఈ అభివృద్ధి అవసరం.
హ్యుందాయ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెడుతుంది?
ఈ విభాగం బ్యాటరీ సెల్స్ పనితీరు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మెరుగుదల, బ్యాటరీ పరిమాణం తగ్గించి ఎక్కువ మైలేజీ ఇవ్వడం, అగ్ని ప్రమాదాలు నివారించడం, కఠినమైన వాతావరణంలో బ్యాటరీ పాడవకుండా చూడటంపై దృష్టి పెడుతుంది.
ట్రెండింగ్ వార్తలు





















