అన్వేషించండి

E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ

E20 పెట్రోల్ వల్ల కొన్ని వాహనాల్లో 3-5% వరకు మైలేజ్ తగ్గొచ్చని కేంద్రం తెలిపింది. అయితే అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

E20 may decrease mileage: E20 పెట్రోల్ వినియోగంతో కొన్ని వాహనాల్లో ఇంధన మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం & సహజ వాయు మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు అంతకంటే ఎంతో ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. అధిక ఆక్టేన్ విలువ, మెరుగైన దహన ప్రక్రియ, ఇంజిన్ పనితీరు మెరుగుదల, తక్కువ కాలుష్య ఉద్గారాలు & దేశ ఇంధన భద్రత బలోపేతం వంటి ప్రయోజనాలను ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది.

E20పై వస్తున్న విమర్శలకు సమాధానంగా కేంద్రం శుక్రవారం విస్తృత ప్రశ్నలు-సమాధానాల రూపంలో వివరణ విడుదల చేసింది. అందులో E20ను E10 లేదా సాధారణ పెట్రోల్ కంటే మరింత నాణ్యమైన, పరిశుభ్రమైన & సమర్థవంతమైన ఇంధనంగా పేర్కొంది. వాహన తయారీ సంస్థలు, పరిశోధనా సంస్థలు, పరీక్ష ఏజెన్సీలు & ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తర్వాతే దేశవ్యాప్తంగా E20 అమలు చేసినట్లు తెలిపింది.

ఇథనాల్ మిశ్రమ కార్యక్రమాన్ని ప్రభుత్వం హఠాత్తుగా అమలు చేయలేదని కూడా స్పష్టం చేసింది. భారత్‌లో ఈ కార్యక్రమం 2001లో పైలట్ ప్రాజెక్టుల రూపంలో ప్రారంభమైందని, 2006 నాటికి కొన్ని ప్రాంతాల్లో 5 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ సరఫరా మొదలైందని గుర్తు చేసింది. 2014 వరకు ఇథనాల్ మిశ్రమం సగటున 1.5 శాతం వద్దే ఉండగా, 2018లో జాతీయ బయోఫ్యూయల్స్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఉత్పత్తి వేగంగా పెరిగిందని పేర్కొంది. చెరకు మాత్రమే కాకుండా ఇతర ముడి పదార్థాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల లక్ష్య సాధన వేగవంతమైందని వివరించింది.

ఇది కూడా చదవండి: టెక్టాన్ వర్సెస్ డస్టర్ - ఒకే రూపంతో ఉన్న కవల SUVలు; డిజైన్‌ నుంచి ధర వరకు పూర్తి కంపారిజన్

2022లోనే 10 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని గడువుకంటే ముందే సాధించిన భారత్‌, 2025-26 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో 20 శాతం మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక ఇథనాల్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాలు, రవాణా వ్యవస్థలు & సరఫరా మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది.

పాత వాహనాలపై వ్యక్తమవుతున్న సందేహాలకూ కేంద్రం వివరణ ఇచ్చింది. E20 అమలుకు ముందు ఇంజిన్ మన్నిక, ఇంధన వ్యవస్థ, లోహ భాగాల అనుకూలత, తుప్పు నిరోధకత, వాహనం పనితీరు & కాలుష్య ఉద్గారాలపై విస్తృత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. వాస్తవ వినియోగ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రధాన సమస్యలు గుర్తించలేదని పేర్కొంది.

మారుతి సుజుకి & హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థల నుంచి అందిన సమాచారాన్ని కూడా కేంద్రం ప్రస్తావించింది. E20 వాడకం వల్ల తుప్పు పట్టడం, విడిభాగాలు అసాధారణంగా దెబ్బతినడం లేదా వాటి జీవితకాలం తగ్గడం వంటి సమస్యలు నమోదుకాలేదని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌

దేశవ్యాప్తంగా ప్యూర్ పెట్రోల్‌, E10 & E20లను ఒకేసారి అందుబాటులో ఉంచాలన్న డిమాండ్లను కూడా కేంద్రం తిరస్కరించింది. లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో మూడు రకాల ఇంధనాలను వేర్వేరుగా నిల్వ చేసి పంపిణీ చేయడం వల్ల లాజిస్టిక్స్ వ్యయం భారీగా పెరుగుతుందని & సరఫరా వ్యవస్థ క్లిష్టంగా మారుతుందని వివరించింది.

E20 ధరపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ కొనుగోలు ధరలను రైతులకు గిట్టుబాటు కలిగేలా నిర్ణయిస్తుండటంతో, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన సందర్భాల్లో కూడా E20 తప్పనిసరిగా తక్కువ ధరలో లభిస్తుందని చెప్పలేమని పేర్కొంది. ఈ కార్యక్రమం లక్ష్యం పెట్రోల్ ధరలు తగ్గించడం కాదని, విదేశీ ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను బలోపేతం చేయడం & ధరల స్థిరత్వాన్ని పెంచడమేనని స్పష్టం చేసింది.

2014-15 నుంచి అమలవుతున్న ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం వల్ల దేశానికి రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని కేంద్రం వెల్లడించింది. దాదాపు 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయని, 952 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయని తెలిపింది. అలాగే రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం చేరిందని వివరించింది. E20పై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని వినియోగదారులకు సూచించిన కేంద్రం, ఈ ఇంధనాన్ని వాహన తయారీ సంస్థలు, పరీక్ష సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు & నియంత్రణ సంస్థలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే దేశవ్యాప్తంగా అమలు చేశామని మరోసారి స్పష్టం చేసింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Nissan Tekton: నిస్సాన్ టెక్టన్ కొనడానికి మీరు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? EMI ఎంత ఉంటుంది?
నిస్సాన్ టెక్టన్ కొనడానికి మీరు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? EMI ఎంత ఉంటుంది?
పాత వాహనాల ఓనర్లకు షాక్‌ - ప్యూర్ పెట్రోల్‌, E10 ఆప్షన్లు లేవు, E20 మాత్రమే ఉంటుందన్న కేంద్రం
దేశవ్యాప్తంగా ఇక E20 పెట్రోల్‌ ఒక్కటే - ప్యూర్ పెట్రోల్‌, E10కి కేంద్రం గుడ్‌బై!
Bike Helmet Rules: బైక్ నడిపేవారు హెల్మెట్‌ పెట్టుకునేటప్పుడ్డు జాగ్రత్త! ఈ పొరపాట్లు చేస్తే చలాన్ ఖాయం!
బైక్ నడిపేవారు హెల్మెట్‌ పెట్టుకునేటప్పుడ్డు జాగ్రత్త! ఈ పొరపాట్లు చేస్తే చలాన్ ఖాయం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Embed widget