అన్వేషించండి

E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ

E20 పెట్రోల్ వల్ల కొన్ని వాహనాల్లో 3-5% వరకు మైలేజ్ తగ్గొచ్చని కేంద్రం తెలిపింది. అయితే అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

E20 may decrease mileage: E20 పెట్రోల్ వినియోగంతో కొన్ని వాహనాల్లో ఇంధన మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం & సహజ వాయు మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు అంతకంటే ఎంతో ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. అధిక ఆక్టేన్ విలువ, మెరుగైన దహన ప్రక్రియ, ఇంజిన్ పనితీరు మెరుగుదల, తక్కువ కాలుష్య ఉద్గారాలు & దేశ ఇంధన భద్రత బలోపేతం వంటి ప్రయోజనాలను ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది.

E20పై వస్తున్న విమర్శలకు సమాధానంగా కేంద్రం శుక్రవారం విస్తృత ప్రశ్నలు-సమాధానాల రూపంలో వివరణ విడుదల చేసింది. అందులో E20ను E10 లేదా సాధారణ పెట్రోల్ కంటే మరింత నాణ్యమైన, పరిశుభ్రమైన & సమర్థవంతమైన ఇంధనంగా పేర్కొంది. వాహన తయారీ సంస్థలు, పరిశోధనా సంస్థలు, పరీక్ష ఏజెన్సీలు & ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తర్వాతే దేశవ్యాప్తంగా E20 అమలు చేసినట్లు తెలిపింది.

ఇథనాల్ మిశ్రమ కార్యక్రమాన్ని ప్రభుత్వం హఠాత్తుగా అమలు చేయలేదని కూడా స్పష్టం చేసింది. భారత్‌లో ఈ కార్యక్రమం 2001లో పైలట్ ప్రాజెక్టుల రూపంలో ప్రారంభమైందని, 2006 నాటికి కొన్ని ప్రాంతాల్లో 5 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ సరఫరా మొదలైందని గుర్తు చేసింది. 2014 వరకు ఇథనాల్ మిశ్రమం సగటున 1.5 శాతం వద్దే ఉండగా, 2018లో జాతీయ బయోఫ్యూయల్స్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఉత్పత్తి వేగంగా పెరిగిందని పేర్కొంది. చెరకు మాత్రమే కాకుండా ఇతర ముడి పదార్థాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల లక్ష్య సాధన వేగవంతమైందని వివరించింది.

ఇది కూడా చదవండి: టెక్టాన్ వర్సెస్ డస్టర్ - ఒకే రూపంతో ఉన్న కవల SUVలు; డిజైన్‌ నుంచి ధర వరకు పూర్తి కంపారిజన్

2022లోనే 10 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని గడువుకంటే ముందే సాధించిన భారత్‌, 2025-26 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో 20 శాతం మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక ఇథనాల్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాలు, రవాణా వ్యవస్థలు & సరఫరా మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది.

పాత వాహనాలపై వ్యక్తమవుతున్న సందేహాలకూ కేంద్రం వివరణ ఇచ్చింది. E20 అమలుకు ముందు ఇంజిన్ మన్నిక, ఇంధన వ్యవస్థ, లోహ భాగాల అనుకూలత, తుప్పు నిరోధకత, వాహనం పనితీరు & కాలుష్య ఉద్గారాలపై విస్తృత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. వాస్తవ వినియోగ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రధాన సమస్యలు గుర్తించలేదని పేర్కొంది.

మారుతి సుజుకి & హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థల నుంచి అందిన సమాచారాన్ని కూడా కేంద్రం ప్రస్తావించింది. E20 వాడకం వల్ల తుప్పు పట్టడం, విడిభాగాలు అసాధారణంగా దెబ్బతినడం లేదా వాటి జీవితకాలం తగ్గడం వంటి సమస్యలు నమోదుకాలేదని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌

దేశవ్యాప్తంగా ప్యూర్ పెట్రోల్‌, E10 & E20లను ఒకేసారి అందుబాటులో ఉంచాలన్న డిమాండ్లను కూడా కేంద్రం తిరస్కరించింది. లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో మూడు రకాల ఇంధనాలను వేర్వేరుగా నిల్వ చేసి పంపిణీ చేయడం వల్ల లాజిస్టిక్స్ వ్యయం భారీగా పెరుగుతుందని & సరఫరా వ్యవస్థ క్లిష్టంగా మారుతుందని వివరించింది.

E20 ధరపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ కొనుగోలు ధరలను రైతులకు గిట్టుబాటు కలిగేలా నిర్ణయిస్తుండటంతో, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన సందర్భాల్లో కూడా E20 తప్పనిసరిగా తక్కువ ధరలో లభిస్తుందని చెప్పలేమని పేర్కొంది. ఈ కార్యక్రమం లక్ష్యం పెట్రోల్ ధరలు తగ్గించడం కాదని, విదేశీ ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను బలోపేతం చేయడం & ధరల స్థిరత్వాన్ని పెంచడమేనని స్పష్టం చేసింది.

2014-15 నుంచి అమలవుతున్న ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం వల్ల దేశానికి రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని కేంద్రం వెల్లడించింది. దాదాపు 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయని, 952 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయని తెలిపింది. అలాగే రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం చేరిందని వివరించింది. E20పై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని వినియోగదారులకు సూచించిన కేంద్రం, ఈ ఇంధనాన్ని వాహన తయారీ సంస్థలు, పరీక్ష సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు & నియంత్రణ సంస్థలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే దేశవ్యాప్తంగా అమలు చేశామని మరోసారి స్పష్టం చేసింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget