అన్వేషించండి

పాత వాహనాల ఓనర్లకు షాక్‌ - ప్యూర్ పెట్రోల్‌, E10 ఆప్షన్లు లేవు, E20 మాత్రమే ఉంటుందన్న కేంద్రం

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ మాత్రమే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్యూర్ పెట్రోల్‌, E10ను అందుబాటులో ఉంచడం ఖర్చుతో కూడుకున్నదని స్పష్టం చేసింది. పాత వాహనాలపై కూడా కీలక వివరణ ఇచ్చింది.

E20 Petrol News: దేశవ్యాప్తంగా ప్యూర్ పెట్రోల్‌, E10 & E20 అనే మూడు రకాల పెట్రోల్‌ను ఒకేసారి అందుబాటులో ఉంచే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌నే ప్రామాణిక ఇంధనంగా కొనసాగిస్తామని కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మూడు రకాల పెట్రోల్‌ను ఒకేసారి సరఫరా చేయాలంటే భారీగా మౌలిక సదుపాయాలు అవసరమవుతాయని, దీనివల్ల వ్యయభారం పెరగడంతో పాటు పంపిణీ వ్యవస్థ కూడా క్లిష్టంగా మారుతుందని పేర్కొంది.

జులై 10న విడుదల చేసిన ప్రశ్నలు-సమాధానాల రూపంలోని వివరణలో కేంద్రం తన నిర్ణయానికి గల కారణాలను వివరించింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్ బంకులు, రిఫైనరీలు, డిపోలు, టెర్మినల్స్‌, పైప్‌లైన్లు & నిల్వ కేంద్రాల ద్వారా ఇంధన పంపిణీ జరుగుతోందని తెలిపింది. ఇలాంటి భారీ వ్యవస్థలో ప్యూర్ పెట్రోల్‌, E10 & E20లను వేర్వేరుగా నిల్వ చేసి పంపిణీ చేయడం వల్ల అదనపు గిడ్డంగులు, ప్రత్యేక నిల్వ ట్యాంకులు, వేర్వేరు సరఫరా వ్యవస్థలు అవసరమవుతాయని వెల్లడించింది.

ప్రీమియం పెట్రోల్‌ కూడా మార్కెట్లో లభిస్తోందని కొందరు చేస్తున్న వాదనలను కూడా కేంద్రం కొట్టిపారేసింది. ప్రీమియం పెట్రోల్‌ను చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే కొద్దిమంది వినియోగిస్తారని, దానికి ప్రత్యేక దేశవ్యాప్త సరఫరా వ్యవస్థ అవసరం ఉండదని వివరించింది. అయితే E20 మాత్రం దేశవ్యాప్తంగా వినియోగించే ప్రధాన ఇంధనమని పేర్కొంది.

ఇది కూడా చదవండి: బైక్ నడిపేవారు హెల్మెట్‌ పెట్టుకునేటప్పుడ్డు జాగ్రత్త! ఈ పొరపాట్లు చేస్తే చలాన్ ఖాయం!

ఇథనాల్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కూడా మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. డిస్టిలరీలు, నిల్వ కేంద్రాలు, రవాణా వ్యవస్థలు & ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు మళ్లీ E10ను ప్రామాణిక ఇంధనంగా తీసుకొస్తే రైతులు, సహకార సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు & ఆర్థిక సంస్థలు చేసిన పెట్టుబడులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం నవంబర్ 2025 నుంచి జూన్ 2026 వరకు దేశంలో సగటున 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని సాధించింది. అంతకుముందు సరఫరా సంవత్సరంలో ఈ స్థాయి 19.2 శాతంగా నమోదైందని తెలిపింది. దీంతో ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందని కేంద్రం అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో చెట్టు కూలి డ్యామేజ్ అయితే మీ కారుకు బీమా ఎలా పొందాలి?

E10కు అనుగుణంగా తయారైన పాత వాహనాల యజమానుల్లో ఉన్న ఆందోళనలపై కూడా కేంద్రం స్పందించింది. E20 అమలుకు ముందు వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీదారులు, పరీక్షా సంస్థలు & పరిశోధన సంస్థలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇంజిన్ పనితీరు, ఇంధన వ్యవస్థ, విడిభాగాల మన్నిక, ఉద్గారాలు & ఇంధన వినియోగంపై సమగ్ర పరిశీలన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మారుతి సుజుకి అందించిన వివరాల ప్రకారం FY2025-26లో సర్వీస్‌కు వచ్చిన 2.84 కోట్ల వాహనాల్లో దాదాపు 1.5 కోట్ల పాత వాహనాలు E20కు మొదట అనుమతించబడనివేనని తెలిపింది. అయినప్పటికీ E20 వల్ల తుప్పు పట్టడం, అసాధారణంగా విడిభాగాలు దెబ్బతినడం లేదా వాటి జీవితకాలం తగ్గినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. హీరో మోటోకార్ప్ కూడా ఇదే తరహా అనుభవాన్ని వెల్లడించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే E20 వాడటం వల్ల కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యం 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంగీకరించింది. అయితే అధిక ఆక్టేన్ విలువ, ముడి చమురు దిగుమతుల తగ్గుదల, కాలుష్య ఉద్గారాల నియంత్రణ వంటి ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కాగా, బహుళ రకాల పెట్రోల్‌ను అందుబాటులో ఉంచడం వల్ల వచ్చే అదనపు వ్యయం & వినియోగదారులకు కలిగే ప్రయోజనాలపై స్వతంత్ర విశ్లేషణను మాత్రం ఈ వివరణలో ప్రభుత్వం వెల్లడించలేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget