అన్వేషించండి

Modakondamma Thalli Jatara in Paderu 2025: మోదకొండమ్మ జాతరతో మారుమోగనున్న మన్యం..నిథులు పెంచమంటూ ప్రతిపాదనలు!

Modakondamma Thalli Jatara 2025: మన్యంలో స్వయంభువుగా వెలసిన రూపం...గిరిజనుల కొంగుబంగారం..కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంన్న మోదకొండమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. 

Modakondamma Thalli Jatara in Paderu 2025: మన్యం దేవతగా గిరిజనుల దేవతగా పూజలందుకుంటున్న మోదకొండమ్మకు ప్రతి సంవత్సరం మే నెలలో జాతర నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 11 నుంచి మూడు రోజుల పాటు జాతర చేయనున్నారు. ఈ మేరకు ఉత్సవ, ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  రాష్ట్ర విభజన తర్వాత దీనిని రాష్ట్ర గిరిజన జాతరగా ప్రకటించారు. మొదటి రెండేళ్లు ఏడాదికి 50 లక్షలు చొప్పున నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆ లెక్కను కోటికిపెంచారు. 

మోదకొండమ్మ జాతర ఏటా మే నెలలో రెండో వారంలో నిర్వహించడం ఆనవాయితీ. విశాఖ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో పాడేరులో స్వయంభువుగా వెలసింది అమ్మవారు. మోదం అంటే సంతోషం అని అర్థం. గిరుల్లో వెలసిన దేవత కాబట్టి కొండమ్మ అని కలసి...మోదకొండమ్మ అని పూజలందిస్తున్నారు భక్తులు. 

ఒడిశా కోరాపుట్‌ జిల్లాలో నందపురం అనే ప్రాంతం కళింగ దేశంలో ఓ రాజ్యంగా ఉండేది. ఆ నందపురాన్ని రాణి మాకలశక్తి, భైరవుడు పాలించేవారు. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఓ కొడుకు. వారిలో మొదటి సంతానమే మోదకొండమ్మ. చిన్నప్పటి నుంచీ మహిమలు చూపే మోదకొండమ్మ  మహిషాసుర సంహారం సమయంలో ఆదిపరాశక్తికి సహాయపడిందని పురాణాలు చెబుతున్నాయి. మోదకొండమ్మ మేనత్తకు ఏడుగురు కుమారులు ఉండేవారట. దేశిరాజులుగా పిలచే ఆ ఏడుగురిని మోదకొండమ్మ అక్కచెల్లెళ్లు ఏడుగురు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత  పాడేరులో పినవేనం అనే రాతి గుహ వద్ద స్వయంభువుగా కొలువుదీరిందనీ...మోదకొండమ్మ చెల్లెళ్లు కూడా వివిధ ప్రాంతాల్లో వెలిశారని కథనం. 

కొన్నాళ్లక్రితం ఇక్కడ ఏటా ప్రత్యేక పూజలు చేసేవారు. ఓసారి పూజల అనంతరం అంతా వెళ్లిపోయాక మోదకొండమ్మ తన చెల్లెళ్లతో కలసి విందు ఆరగిస్తోందిట. ఆ సమయంలో పూజారి వెనక్కు వెళ్లాడు. అంతదూరం తిరిగి వచ్చిన పూజారిని చూసి మోదకొండమ్మ...తన దర్శనం కోసం ఇంత దూరం ఎవరూ రావొద్దని చెప్పి...ఈ చెంబు పడేచోట తాను కొలువై ఉంటాయనని విసిరిందట. ఆ చెంబు పడిన చోట అమ్మవారి పాదాలు కనిపించడంతో వాటినే ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు భక్తులు.ఆ తర్వాత కాలంలో తహసిల్దార్‌ దాసరిశర్మ అనే భక్తుడి కలలో అమ్మవారు కనిపించడంతో పాడేరులో ఆలయం నిర్మించారని కథనం.
 
ఏడాది మొత్తం విశేష పూజలు నిర్వహించి ఏడాదికోసారి మే నెలలో మూడు రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా భారీగా తరలివస్తారు. మొదటి రెండు రోజులూ స్థానిక సతకంపట్టు వద్ద అమ్మవారి ఘటాలను మేళతాళాలతో  తీసుకొచ్చి పెడతారు. వాటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. సాయంత్రం ఆ ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. మూడో రోజు తెల్లవారుజామునుంచే మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. విశేషమైన పూజలు, ఊరేగింపులతో ఉత్సవాలు ముగుస్తాయి. విశాఖ వరకూ ట్రైన్ లేదా బస్సులో చేరుకుంటే అక్కడి నుంచి మోదకొండమ్మ ఆలయానికి బస్సులు, ప్రేవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.

జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ఏర్పాట్ల ఖర్చు కూడా పెరుగుతోంది అంటున్నారు నిర్వాహకులు. అందుకే ప్రభుత్వం ఇస్తున్న కోటి రూపాయల నిథులను మూడు కోట్లకు పెంచాలని స్థానిక అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget