అన్వేషించండి

Modakondamma Thalli Jatara in Paderu 2025: మోదకొండమ్మ జాతరతో మారుమోగనున్న మన్యం..నిథులు పెంచమంటూ ప్రతిపాదనలు!

Modakondamma Thalli Jatara 2025: మన్యంలో స్వయంభువుగా వెలసిన రూపం...గిరిజనుల కొంగుబంగారం..కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంన్న మోదకొండమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. 

Modakondamma Thalli Jatara in Paderu 2025: మన్యం దేవతగా గిరిజనుల దేవతగా పూజలందుకుంటున్న మోదకొండమ్మకు ప్రతి సంవత్సరం మే నెలలో జాతర నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 11 నుంచి మూడు రోజుల పాటు జాతర చేయనున్నారు. ఈ మేరకు ఉత్సవ, ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  రాష్ట్ర విభజన తర్వాత దీనిని రాష్ట్ర గిరిజన జాతరగా ప్రకటించారు. మొదటి రెండేళ్లు ఏడాదికి 50 లక్షలు చొప్పున నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆ లెక్కను కోటికిపెంచారు. 

మోదకొండమ్మ జాతర ఏటా మే నెలలో రెండో వారంలో నిర్వహించడం ఆనవాయితీ. విశాఖ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో పాడేరులో స్వయంభువుగా వెలసింది అమ్మవారు. మోదం అంటే సంతోషం అని అర్థం. గిరుల్లో వెలసిన దేవత కాబట్టి కొండమ్మ అని కలసి...మోదకొండమ్మ అని పూజలందిస్తున్నారు భక్తులు. 

ఒడిశా కోరాపుట్‌ జిల్లాలో నందపురం అనే ప్రాంతం కళింగ దేశంలో ఓ రాజ్యంగా ఉండేది. ఆ నందపురాన్ని రాణి మాకలశక్తి, భైరవుడు పాలించేవారు. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఓ కొడుకు. వారిలో మొదటి సంతానమే మోదకొండమ్మ. చిన్నప్పటి నుంచీ మహిమలు చూపే మోదకొండమ్మ  మహిషాసుర సంహారం సమయంలో ఆదిపరాశక్తికి సహాయపడిందని పురాణాలు చెబుతున్నాయి. మోదకొండమ్మ మేనత్తకు ఏడుగురు కుమారులు ఉండేవారట. దేశిరాజులుగా పిలచే ఆ ఏడుగురిని మోదకొండమ్మ అక్కచెల్లెళ్లు ఏడుగురు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత  పాడేరులో పినవేనం అనే రాతి గుహ వద్ద స్వయంభువుగా కొలువుదీరిందనీ...మోదకొండమ్మ చెల్లెళ్లు కూడా వివిధ ప్రాంతాల్లో వెలిశారని కథనం. 

కొన్నాళ్లక్రితం ఇక్కడ ఏటా ప్రత్యేక పూజలు చేసేవారు. ఓసారి పూజల అనంతరం అంతా వెళ్లిపోయాక మోదకొండమ్మ తన చెల్లెళ్లతో కలసి విందు ఆరగిస్తోందిట. ఆ సమయంలో పూజారి వెనక్కు వెళ్లాడు. అంతదూరం తిరిగి వచ్చిన పూజారిని చూసి మోదకొండమ్మ...తన దర్శనం కోసం ఇంత దూరం ఎవరూ రావొద్దని చెప్పి...ఈ చెంబు పడేచోట తాను కొలువై ఉంటాయనని విసిరిందట. ఆ చెంబు పడిన చోట అమ్మవారి పాదాలు కనిపించడంతో వాటినే ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు భక్తులు.ఆ తర్వాత కాలంలో తహసిల్దార్‌ దాసరిశర్మ అనే భక్తుడి కలలో అమ్మవారు కనిపించడంతో పాడేరులో ఆలయం నిర్మించారని కథనం.
 
ఏడాది మొత్తం విశేష పూజలు నిర్వహించి ఏడాదికోసారి మే నెలలో మూడు రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా భారీగా తరలివస్తారు. మొదటి రెండు రోజులూ స్థానిక సతకంపట్టు వద్ద అమ్మవారి ఘటాలను మేళతాళాలతో  తీసుకొచ్చి పెడతారు. వాటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. సాయంత్రం ఆ ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. మూడో రోజు తెల్లవారుజామునుంచే మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. విశేషమైన పూజలు, ఊరేగింపులతో ఉత్సవాలు ముగుస్తాయి. విశాఖ వరకూ ట్రైన్ లేదా బస్సులో చేరుకుంటే అక్కడి నుంచి మోదకొండమ్మ ఆలయానికి బస్సులు, ప్రేవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.

జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ఏర్పాట్ల ఖర్చు కూడా పెరుగుతోంది అంటున్నారు నిర్వాహకులు. అందుకే ప్రభుత్వం ఇస్తున్న కోటి రూపాయల నిథులను మూడు కోట్లకు పెంచాలని స్థానిక అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Actor Dileep : హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Dhurandhar Collections : 100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్
100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్
Hyderabad Crime News: నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం
నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం
Embed widget