Mangal Gochar 2025: బంగారం, పెట్రోల్ ధరలపై కుజుడి ప్రభావం! పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్!
Mangal Gochar 2025: అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 7 వరకు భూమి, లోహం, బంగారం ధరలు పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మంగళ గోచారం సూచన అని చెబుతున్నారు పండితులు...

Mangal Gochar 2025 Gold Prices: అక్టోబర్ 27న కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. ఈ పరిస్థితి జ్యోతిష్య శాస్త్ర పరంగా చాలా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు.
బృహత్పరాశర హోరా శాస్త్రంలో...
మంగళః భూమ్యర్థధాతుకారకః అని ఉంది
అంటే కుజుడు భూమి, లోహాలు, ఖనిజాలు, శక్తికి సంబంధించిన వస్తువులలో చురుకుదనాన్ని పెంచుతాడని అర్థం
వృశ్చిక రాశిని కుజుడి సొంతరాశిగా పరిగణిస్తారు. జ్యోతిష్యంలో కుజుడిని ఈ రాశికి అధిపతిగా పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత కుజుడు బలవంతుడవుతాడు. ఇది మార్కెట్, పెట్టుబడులు, భూమి పరిశ్రమ, శక్తి కంపెనీలు, వస్తువుల మార్పిడి రేట్లపై నేరుగా ప్రభావం చూపుతుంది. 27 అక్టోబర్ 2025 నుంచి 7 డిసెంబర్ 2025 మధ్య భూమి-ఆస్తి, ఇనుము, రాగి, బంగారం, పెట్రోలియం, బొగ్గు వంటి వాటి ధరలలో పెరుగుదల కనిపించవచ్చు.
ఫలదీపిక ప్రకారం
స్వరాశౌ మంగళే శుభం ఫలతి
కుజుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు, శక్తి, ధైర్యం మార్కెట్ కార్యకలాపాలు పెరుగుతాయి. దీని అర్థం ఏంటంటే పరిశ్రమ రంగం, యంత్రాలు, నిర్మాణం రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో లావాదేవీలు పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా, నీటి మూలకాల రాశులలో అగ్ని గ్రహం ఉండటం అస్థిరతను తెస్తుంది. అందువల్ల, షేర్ మార్కెట్, కరెన్సీ ట్రేడ్ .. లగ్జరీ లైఫ్స్టైల్కు సంబంధించిన వస్తువులలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
జాతక పారిజాతం ప్రకారం
అగ్నిజలయోః సంయోగే అస్థైర్యం.
అంటే అగ్ని నీటి కలయిక అస్థిరతను ఇస్తుంది. దీనివల్ల స్టాక్ మార్కెట్లో ఊహాత్మక ప్రవర్తన మరియు భయం వల్ల అమ్మకాలు (పానిక్ సెల్లింగ్) ఏర్పడవచ్చు.
పెట్టుబడి దృక్కోణం నుంచి చూస్తే.. ఈ గోచారం సహనం దీర్ఘకాలిక దృష్టికి సమయం. స్వల్పకాలిక లాభాలను ఆశించే పెట్టుబడిదారులు అస్థిరతతో ప్రభావితం కావచ్చు, అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు (3-6 నెలలకు పైగా) లాభం పొందుతారు. భూమి, శక్తి, లోహాలు నిర్మాణ సామగ్రిలో ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు శుభంగా ఉంటాయి, అయితే అప్పు తీసుకుని లేదా భావోద్వేగాలతో పెట్టుబడి పెట్టడం నష్టదాయకంగా ఉంటుంది.
జైమిని సూత్రం ప్రకారం
మంగళాత్ భూమ్యర్థం యంత్రం చ
అంటే కుజుడు యంత్రాలు, భూమి అభివృద్ధికి వేగం ఇస్తాడు. ఈ గోచారం ప్రభుత్వం ప్రైవేట్ రంగాలలో మౌలిక సదుపాయాలు లేదా రక్షణ పెట్టుబడుల వేగాన్ని పెంచుతుంది. అదే సమయంలో నీటి ఆధారిత రంగాలలో (ఉదాహరణకు పానీయాలకు సంబంధించిన పరిశ్రమలు, లగ్జరీ వస్తువులు, దుస్తులు, దిగుమతి చేసుకున్న బ్రాండ్లు (Imported Brands) స్తబ్దత లేదా మాంద్యం ఏర్పడవచ్చు.
మానసికంగా ఈ గోచారం మానవులలో నిర్ణయం తీసుకునే వేగం , అసహనాన్ని పెంచుతుంది. అందువల్ల, పెట్టుబడిదారులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు డేటా, కంపెనీ ఫండమెంటల్స్ .. ప్రాథమిక జ్యోతిష్య చక్రాలను రెండింటినీ చూడాలని సూచించారు.
సరవాలి గ్రంథం ప్రకారం
మంగళేన ధైర్యం హీనస్య నాశః
అంటే అసహనం వినాశనానికి కారణమవుతుంది
మంగళుడి గోచారం కారణంగా ముఖ్యంగా వచ్చే మార్పులు ఇవే
ఖరీదైన వస్తువులు: ఇనుము, రాగి, పెట్రోలియం, బొగ్గు, భూమి, రియల్ ఎస్టేట్
చౌకైన లేదా అస్థిరమైన వస్తువులు: షేర్ మార్కెట్, కరెన్సీ, లగ్జరీ బ్రాండ్లు, దిగుమతి చేసుకున్న వస్తువులు
ఏం చేయాలి: దీర్ఘకాలిక పెట్టుబడి, రిస్క్-బ్యాలెన్సింగ్
ఏం చేయకూడదు: అప్పులు, తొందరపాటు పెట్టుబడులు, కీలక నిర్ణయాలు తీసుకోవద్దు
ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్ ఇప్పుడు లోతైన సంద్రంగా మారుతోంది. ఉపరితలంపై కల్లోలం ఉంటుంది, కానీ సహనం వివేకంతో నిర్ణయాలు తీసుకునే పెట్టుబడిదారులు రానున్న రోజుల్లో లాభం పొందుతారు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం. ABP దేశం ఏ రకమైన నమ్మకం, సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు మీకు నమ్మకమైన జ్యోతిష్యశాస్త్ర నిపుణుడిని సంప్రదించండి





















