అన్వేషించండి

YS sunitha : ఎన్నికల్లో పోటీపై 15వ తేదీన వైఎస్ సునీత నిర్ణయం - వివేకా వర్థంతి సందర్భంగా కీలక సమావేశం

Andhra News : ఎన్నికల్లో పోటీపై వైఎస్ సునీత 15వ తేదీన కీలక ప్రకటన చేయనున్నారు.ఆ రోజు వైఎస్ వివేకా వర్థంతి కావడంతో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

YS Sunitha will make a key announcement on the election contest on the 15th :   వచ్చే ఎన్నికల్లో కడప నుంచి రసవత్తర రాజకీయం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ సునీత తన రాజకీయ ప్రకటన చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైఎస్ వివేకా వర్థంతి ఈ నెల పదిహేనో తేదీన కుటుంబసభ్యులు, ఆత్మీయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పులివెందులలో సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నా.. ఫంక్షన్ హాల్ విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో కడపకు మార్చుకున్నారు. పదిహేనో తేదీన కడపలో  కుటుంబసభ్యులు.. ఆత్మీయులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఎన్నికల్లో పోటీపై సునీత కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. 

ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సునీత తనకు ప్రజా మద్దతు కావాలని కోరారు. ప్రజా తీర్పు కావాలన్నారు. ఇందు కోసం ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నానని ఏ రూపంలో వెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీకా పార్లమెంట్ కా అన్నదానిపై స్పష్టతకు వచ్చారని పదిహేనో తేదీన ప్రకటిస్తారని భావిస్తున్నారు. పోటీ సునీత చేస్తారా.. ఆమె తల్లి చేస్తారా అన్నది కూడా ఆ రోజే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైఎస్ సునీత లేదా ఆమె తల్లి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి అంగీకారం తెలిపే అవకాశం కల్పించేందుకు ఆ పార్టీ రెడీగా ఉందన్న సంకేతాలు వచ్చాయి. అయితే ఓ పార్టీ తరపున పోటీ చేయాలా.. విపక్షాల మద్దతుతో స్వతంత్రంగా పోటీ చేయాలా అన్నదానిపైనా చర్చల జరుపుతున్నారు. 

 అయితే స్వతంత్రంగా పోటీ చేస్తే అన్ని పార్టీల మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినా..ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ఇతర పార్టీలు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండవు. అదే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే… అన్ని పార్టీలు మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి. ఈ కోణంలోనూ సునీత చర్చలు జరుపుతున్నారు. సునీత ఇంత వరకూ ఎప్పుడూ రాజకీయాల జోలికి రాలేదు. ఎప్పుడూ మీడియా ముందుకు కూడా రాలేదు. తండ్రిని హత్య చేసిన తర్వాత మాత్రమే ఆమె తెరపైకి వచ్చారు.  న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇటీవలి వరకూ రాజకీయంగా ఆమె  ముందడుగు వేస్తారని ఎవరూ చెప్పలేదు. కానీ తన తండ్రి హంతకులకు  సీఎం జగన్ మద్దతు ఇస్తున్నారని.. కాపాడుతున్నారని గట్టిగా నమ్ముతున్నందున రాజకీయ వేదికపైకి వచ్చి ప్రజల మద్దతు కోరేందుకు సిద్ధమవుతున్నారు. 

గతంలో వైఎస్ వివేకానందరెడ్డి .. జగన్ సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ లో ఉండిపోయారు . కాంగ్రెస్ తరపున ఉపఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు వివేకా కుటుంబమే .. వైఎస్ జగన్  పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయబోతున్నారు. కానీ ఈ సారి కాంగ్రెస్ తరపున కాకుండా.. కొత్తగా ఆలోచిస్తున్నారు. అప్పట్లో రాజకీయం అయితే.. ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నట్లుగా సునీత.. ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.  ఎలా చూసినా ఈ సారి పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభలో కీలకమైన పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Google AI Hub Issue: గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం
గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
CM Chandrababu: ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget