అన్వేషించండి

Pulasa Fish : వామ్మో పులస క్రేజ్ మామూలుగా లేదు, యానాం మార్కెట్లో రూ.23 వేలు పలికిన పులస!

Pulasa Fish :యానాం గౌతమి గోదావరిలో మత్స్యకారుల వలకు 2 కిలోల పులస చేప చిక్కింది. యానాం చేపల మార్కెట్లో పులస చేపను విక్రయిస్తే రూ.23 వేల ధర పలికింది.

Pulasa Fish : పుస్తెలమ్మైనా పులస చేప తినాల్సిందే అని గోదావరి జిల్లాల్లో నానుడి. జీవితంలో ఒక్కసారైనా పులస పులుసు తినాలంటారు గోదావరి వాసులు. వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ చేపకు చాలా డిమాండ్ ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ చేపలు నదీ జలాల్లో సంతానోత్పత్తికి వస్తుంటాయి. జులై, ఆగస్టుల్లో గోదావరి వరద బంగాళాఖాతంలో కలిసే నదీ ముఖద్వారం వద్దకు పులస చేపలు వస్తాయి. గోదావరిలో ఎదురీదుతూ ప్రయాణిస్తాయి. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలసగా పిలుస్తే గోదావరి నదిలోకి వచ్చాకే పులసగా పిలుస్తారు. 

రూ. 23 వేలు పలికిన పులస 

గోదావరి జిల్లాల్లో పులస చేపకు మామూలు క్రేజ్ ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే జాలర్లు, భోజన ప్రియులు పులస కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. పులస చేపల పులుసు ఎంతో రుచికరంగా ఉంటుంది కాబట్టి ఈ చేపలకు మార్కెట్ లో  భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే పులస దొరకగానే వాటిని సొంతం చేసుకునేందుకు భోజన ప్రియులు బారులు తీరుతారు. యానాం మార్కెట్లో ఇటీవల రెండు కిలోల బరువున్న పులస రూ.19 వేల ధర పలికింది. తాజాగా మరో పులస జాలర్లకు చిక్కింది. దీని ధర మరింత ఎక్కు పలికింది. రెండు కిలోల బరువున్న పులస చేప ఆగస్టు 28 న యానాం రాజీవ్‌ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద అమ్మకానికి పెట్టారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ.22 వేలకు కొనుగోలు చేసింది. అనంతరం దానిని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు రూ.23 వేలకు కొనుగోలు చేశారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేప గోదావరిలో వరద నీటికి ఎదురీదుతుంది.  

సంతానోత్పత్తికి గోదావరిలోకి 

పులసలు నదీ సంగమాల వద్ద గోదావరిలో ప్రవేశించి ధవళేశ్వరం బ్యారేజ్  వరకు వెళ్తాయి. నదిలో మున్ముందుకు వెళ్లేకొద్దీ వాటి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్యే జరుగుతుందండి. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి.  గోదావరి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోందని చెబుతారు. ఈ చేపలో కొవ్వు సముద్రంలో ఉన్నప్పుడు 12.4 శాతం వరకూ ఉంటే నదీ ముఖద్వారం వద్దకు వచ్చినప్పుడు 17.3 శాతానికి పెంచుకొని సంతానోత్పత్తికి సిద్ధమవుతుందట. గోదావరిలో ఎదురీదే సమయంలో ఆహారం తీసుకోకుండా తన శరీరంలోని శక్తినంతా కూడగట్టుకొని వెళ్తుంది. అలా ముందుకొచ్చేకొద్దీ ఈ చేపలోని కొవ్వు తగ్గిపోతూ వస్తుంది. ఎంతలా అంటే 14.50 నుంచి 8.78 శాతం వరకు తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. 

రుచి అందుకేనండి 

గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉండే ఇలస. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. ప్రతి సీజన్లో పులస చేపల వ్యాపారం లక్షల్లో జరుగుతుంది.

Also Read : Jagananna Videshi Vidya Deevena : విదేశాల్లో చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్- టోఫెల్, జీఆర్ఈ పరీక్షలకు ఉచిత శిక్షణ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Embed widget